జోరు మీదున్న సైకిల్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో వందలాదిమంది చేరుతుండటంతో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.
వైకాపాకు చెందిన 250 మంది చేరిక
దామచర్ల జనార్దన్ సమక్షంలో చేరిన నాయకులు, కార్యకర్తలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో వందలాదిమంది చేరుతుండటంతో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఒంగోలు నగరంలోని 11వ డివిజన్ (క్లౌపేట)కు చెందిన వైకాపా నాయకులు రాయపాటి వినోద్కుమార్, సుందర్ సింగ్, తేళ్ల సుజిత్, రాయపాటి అనిల్, తెలగలపూడి బెంజిమెన్తోపాటు, 150 మంది పార్టీ తీర్థం తీసుకున్నారు. ఆదివారం ఒంగోలు అసెంబ్లీ, పార్లమెంటు తెదేపా అభ్యర్థులు దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసులురెడ్డి సమక్షంలో వారు తెదేపాలో చేరారు. 9వ డివిజన్ పులి వెంకటరెడ్డి కాలనీకి చెందిన వైకాపా నాయకులు జిలకర నవీన్, జిలకర మని, శిరి అశోక్, సాంబతోపాటు, 25 కుటుంబాలు తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
వైకాపా అభిమానులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎస్ఎన్ పాడు తెదేపా అభ్యర్థి బీఎన్ విజయ్కుమార్
నాగులుప్పలపాడు : మట్టిగుంట గ్రామంలో వైకాపాకు చెందిన వంద కుటుంబాలు సీనియర్ నాయకులు దివి పున్నారావు ఆధ్వర్యంలో తెదేపాలోకి చేరాయి. సంతనూతలపాడు తెదేపా అభ్యర్థి బీఎన్ విజయ్కుమార్ సమక్షంలో వారు చేరారు. ఈ మేరకు ఆదివారం ఒంగోలులోని ఆయన నివాసానికి వచ్చిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల, రాష్ట్ర తెదేపా సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్కుమార్, క్టస్టర్ ఇన్ఛార్జులు కాకర్ల లక్ష్మీవరప్రసాద్, గుమ్మడి సాయిబాబా, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు జాన్సన్ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిమ్మ.. నష్టాలే మిగిల్చెనమ్మా!
[ 19-05-2024]
జిల్లాలో అత్యధికంగా నిమ్మ సాగు చేసే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో తోటలు సాగయ్యేవి. ఈ ప్రాంతాన్ని నిమ్మ వనంగా అభివర్ణించేవారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
[ 19-05-2024]
ఆటో మినీలారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో జరిగింది. -
బోలెరో ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 19-05-2024]
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలోరో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తర్లుపాడు, సీతానాగులవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. -
తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
[ 19-05-2024]
తెలంగాణ మద్యం సీసాలను అక్రమంగా తీసుకువెళుతున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం -
చెంపపై కొట్టి.. జుట్టు పట్టుకుని లాగి...
[ 19-05-2024]
అధికార పార్టీకి ఓటేయాలంటూ ఓ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శిగా కె.అనూష పనిచేస్తున్నారు. -
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు మెరిట్ ప్రకారం
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు