logo

తెదేపా కూటమికి 160 స్థానాలు

రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తెదేపా కూటమి 160 ఎమ్మెల్యే స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.

Published : 06 May 2024 02:14 IST

మాజీ మంత్రి దేవినేని ధీమా

మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

కనిగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తెదేపా కూటమి 160 ఎమ్మెల్యే స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక అమరావతి మైదానంలో తెదేపా శ్రేణులతో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పక్కా ప్రణాళికతో సొంత మేనిఫెస్టో రూపొందించడం ఆయన దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో కనిగిరి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. స్థానికంగా 60 వేల మంది ఉపాధి కోసం వలస వెళ్లారంటే ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తే జిల్లాలో తాగునీటి సమస్యలు దూరమవుతాయన్నారు. ఉగ్రనరసింహారెడ్డి నామినేషన్‌కు 45 వేల మంది పాల్గొన్నారంటే ఆ రోజే ఆయన విజయం ఖాయమైందన్నారు. ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని