logo

ముగిసిన సైకిల్‌ యాత్ర

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వేదికగా నరసన్నపేటకు చెందిన అడ్వెంచర్‌ క్లబ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బరాటం తేజేశ్వరరావు డిసెంబరు 10న ప్రారంభించిన సాహో సైకిల్‌ యాత్ర ఆదివారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో 38 రోజులపాటు పర్యటించినట్లు ఈయన తెలిపారు. అందులో భాగంగా పర్యాటక

Published : 17 Jan 2022 04:04 IST


తేజేశ్వరరావును అభినందిస్తున్న సెట్‌శ్రీ సీఈవో ప్రసాదరావు, తదితరులు

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వేదికగా నరసన్నపేటకు చెందిన అడ్వెంచర్‌ క్లబ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బరాటం తేజేశ్వరరావు డిసెంబరు 10న ప్రారంభించిన సాహో సైకిల్‌ యాత్ర ఆదివారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో 38 రోజులపాటు పర్యటించినట్లు ఈయన తెలిపారు. అందులో భాగంగా పర్యాటక స్థలాలు, దేవాలయాలు, వెలుగులోనికి రాని ప్రాంతాలకు వెళ్లి వివరాలను సేకరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తేజేశ్వరరావును సెట్‌ శ్రీ సీఈవో బి.వి.ప్రసాదరావు, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ శ్రీనివాస్‌కుమార్‌, సైకిల్‌పోలో అసోసియేషన్‌ అధ్యక్షులు నటుకుల మోహన్‌, పర్యాటక శాఖాధికారి ఎన్‌.నారాయణరావు, తదితరులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని