హీరోగా నటించడానికి సంశయించిన సూరి
హీరోగా నటించడానికి మొదట్లో సూరి సంశయించాడని నటుడు శివకార్తికేయన్ తెలిపారు. దర్శకుడు వెట్రిమారన్ కథ రాసి, దురై సెంథిల్ దర్శకత్వం వహించిన ‘గరుడన్’ 31న విడుదల కానున్న విషయం తెలిసిందే.
శివకార్తికేయన్
చెన్నై, న్యూస్టుడే: హీరోగా నటించడానికి మొదట్లో సూరి సంశయించాడని నటుడు శివకార్తికేయన్ తెలిపారు. దర్శకుడు వెట్రిమారన్ కథ రాసి, దురై సెంథిల్ దర్శకత్వం వహించిన ‘గరుడన్’ 31న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం నగరంలో మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివకార్తికేయన్ మాట్లాడుతూ... ‘సీమరాజా’ చిత్రీకరణ సమయంలో ప్రధానపాత్ర పోషించే చిత్రాలు ఎంచుకుని నటించాలని సూరికి సూచించినట్టు తెలిపారు.
అప్పట్లో ఆయన సంశయించారని, ఒక సినిమాలో హీరోగా నటించిన తర్వాత మిగతా సినిమాల్లో అవకాశాలు రాకపోతే అంటూ అనుమానం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత దర్శకుడు వెట్రిమారన్ నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని, అందులో ప్రధానపాత్ర పోషించనున్నట్లు సూరి చెప్పారని తెలిపారు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పానన్నారు. హాస్యనటులు సీరియస్ పాత్రలను సులభంగా పోషించగలరని, దానికి సూరి ఓ ఉదాహరణ అన్నారు. సీరియస్ పాత్రలు పోషించేవారు అంత సులభంగా హాస్యపాత్రలు పోషించలేరని వెల్లడించారు. కార్యక్రమంలో దర్శకుడు వెట్రిమారన్, నటులు శశికుమార్, సముద్రఖని, విజయ్సేతుపతి, సూరి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెయ్యి సినిమాల పేర్లతో ఇళయరాజా చిత్రం.. అద్భుతంగా గీసిన టీచర్
[ 03-06-2024]
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 81వ జన్మదినం సందర్భంగా ఆయన సంగీతం అందించిన వెయ్యి చిత్రాల పేర్లతో కూడిన చిత్రాన్ని పళనికి చెందిన ఉపాధ్యాయుడు అన్బుసెల్వన్ గీసి అబ్బురపరిచారు. -
సినిమా థియేటర్లో వివక్ష
[ 03-06-2024]
రాణిపేట జిల్లాకు చెందిన సుమారు 30 మంది సంచార జాతివారు కడలూర్ జిల్లాలో వారం రోజులుగా బస చేసి ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వంట పాత్రలను విక్రయిస్తున్నారు. -
విజయం ఎవరిని వరించేనో!
[ 03-06-2024]
బలం, బలగం అధికారపార్టీ డీఎంకేకు సొంతమవుతుందా, లేకుంటే మారుతుందా.. అనేది ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల ద్వారా తేలిపోనుంది. అన్ని స్థానాలూ తామే గెలుస్తామనే ధీమా డీఎంకేలో కనిపిస్తుండగా.. -
రామనాథస్వామిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం
[ 03-06-2024]
రామేశ్వరం రామనాథస్వామిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం కుటుంబంతోపాటు దర్శించుకున్నారు. -
ఈ ఏడాది ఉత్తమ క్రికెటర్గా సాయి సుదర్శన్
[ 03-06-2024]
తమిళనాడు క్రికెట్ సంఘం 92వ వార్షికోత్సవం చెన్నై చేప్పాక్కం స్టేడియంలో శనివారం జరిగింది. ఈ ఏడాది ఉత్తమ క్రికెటర్గా సాయి సుదర్శన్ను ఎంపిక చేసి పురస్కారంతో సత్కరించారు. -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
[ 03-06-2024]
చెన్నై నగరంలో భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్న నేపథ్యంలో విద్యుత్తు వినియోగానికి కూడా డిమాండు పెరిగింది. -
‘హొగినేకల్’కి పోటెత్తిన సందర్శకులు
[ 03-06-2024]
కావేరి నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధర్మపురి జిల్లా హొగినేకల్ జలపాతానికి నీటిరాక అధికమైంది. ఆదివారం మూడో రోజుగా 2 వేల ఘనపుటడుగు నీరు వస్తోంది. -
కరుణాస్ బ్యాగులో 40 బుల్లెట్లు స్వాధీనం
[ 03-06-2024]
ప్రముఖ హాస్య నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ వద్ద 40 బుల్లెట్లు లభించడం సంచలనంగా మారింది. చెన్నై నుంచి విమానం ద్వారా తిరుచ్చి వెళ్లడానికి విమానాశ్రయానికి వచ్చిన కరుణాస్ వస్తువులను అధికారులు సోదాలు చేశారు. -
జీవితంలోని ప్రతి క్షణం దేశానికి అంకితం
[ 03-06-2024]
తన జీవితంతోని ప్రతి క్షణాన్ని దేశం కోసం అంకితం చేస్తానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కన్నియాకుమరిలోని వివేకానంద మండపంలో మూడు రోజుల ధ్యానాన్ని శనివారం ముగించుకుని తిరువనంతపురం వెళ్లిన ఆయన
తాజా వార్తలు (Latest News)
-
భార్య గెలవాలని.. హీరో పొర్లు దండాలు: వీడియో వైరల్
-
మామిడి కాయల బస్తాల్లో తరలిస్తున్న గంజాయి పట్టివేత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
పాక్కు రహస్యాలు చేరవేసిన కేసు.. బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్కు జీవిత ఖైదు
-
బౌలర్లు అప్పుడు సత్తా చాటారు.. ఇప్పుడేం చేస్తారో?
-
20 రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏలోకి: ఎమ్మెల్యే రవి రాణా