ఆలయం.. నిధులందక ఆలస్యం
నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీలో ఆరు గుడుల నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున తితిదే అధికారులు కేటాయించారు. నిధులు రాకపోయినా కొన్నిచోట్ల నాయకులు శ్రద్ధ తీసుకుని నిర్మాణ పనులను దాదాపు ముగింపు దశకు తీసుకొచ్చారు.
నిర్మాణాలకు అందని తితిదే సాయం
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్టుడే,నర్సీపట్నం గ్రామీణం, రోలుగుంట, అనకాపల్లి:
వేములపూడి శివారు అప్పనపాలెంలో దాదాపు పూర్తయిన లక్ష్మీదేవి ఆలయం
నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీలో ఆరు గుడుల నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున తితిదే అధికారులు కేటాయించారు. నిధులు రాకపోయినా కొన్నిచోట్ల నాయకులు శ్రద్ధ తీసుకుని నిర్మాణ పనులను దాదాపు ముగింపు దశకు తీసుకొచ్చారు. ఎస్సీ కాలనీలో రామాలయం, పార్వతీదేవి గుడి, బంగారయ్యపేటలో లక్ష్మిదేవి గుడి నిధుల్లేక పునాదుల స్థాయిలోని నిలిచిపోయాయి. రెండు నెలల క్రితం అధికారులు కొలతలు తీసుకువెళ్లినా నిధులు విడుదల కాలేదు.
* రోలుగుంట మండలం బి.బి.పట్నంలో రామాలయం సుమారు 90 ఏళ్ల క్రితం నిర్మించడంతో పూర్తిగా శిథిలాస్థకు చేరుకుంది. ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి గ్రామస్థులు సంకల్పించారు. గత ఏడాది ఏప్రిల్లో సర్పంచి విశ్వేశ్వరరావు నేతృత్వంలో విప్ కరణం ధర్మశ్రీ ద్వారా ప్రతిపాదనలు పంపారు. ఇటీవలే శంకుస్థాపన చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నిధులొస్తే పనులు చేపట్టొచ్చని చూస్తున్నారు.
..ఇలా ఒకటి రెండు కాదు.. వందలాది గుడులకు తితిదే ఆర్థిక సాయం అందాల్సి ఉంది.
భక్తుల కోర్కెలు తీర్చే భగవంతుడికి గూడు ఏర్పరచాలంటే నిధుల కొరత తప్పడం లేదు. భక్తుల మొర ఆలకించడానికి దేవుడికి ఓ ఆవాసం కల్పించడానికి పాలకులకు అనుగ్రహం కలగడం లేదు. ఆయా గ్రామాల్లో గుడులు, గోపురాలు కట్టడానికి ఆర్థిక సాయం చేస్తామని పెద్దలు హామీలిచ్చినా సొమ్ములు విడుదల చేయడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవాణి ట్రస్ట్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో గుడుల నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేశారు. అనకాపల్లి జిల్లాలో మొదటి విడత 98 దేవాలయాలకు, అల్లూరి జిల్లాలో 161 ఆలయాల నిర్మాణానికి తితిదే నుంచి సాయం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క గుడికీ పైసా కూడా అందలేదు. గ్రామస్థుల చందాలు, దాతల విరాళాలతో కొంతవరకు నిర్మించి సొమ్ముల్లేక ఆలయాలను అసంపూర్తిగా వదిలేయాల్సి వస్తోంది.
దుగ్గాడలో నూకాలతల్లి కోవెల పైకప్పు
ఆ రెండు నియోజకవర్గాలకే..
బడి లేని ఊరుంటుందేమో గాని గుడి లేకుండా గ్రామం కనిపించదు. చిన్నదో పెద్దదో ఓ కోవెల ఉంటే ఊరికి మంచిదని విశ్వాసం. అందుకే గ్రామాల్లోకి నేతలెవరొచ్చినా గుడి కట్టుకుంటాం సాయం చేయండని అడుగుతుంటారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తితిదే కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణానికి నిధులు సమకూర్చుతుంది. అందులో భాగంగానే ఎమెల్మేలు కూడా తితిదే నిధుల కోసం ప్రతిపాదనలు పంపిస్తుంటారు. ప్రస్తుతం అధికార పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా నేతలు ఎవరు అడిగినా కాదనడం లేదు. మొదటి విడతలో నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో 98 గుడులకు తితిదే ద్వారా మంజూరు లభించింది. తాజాగా రెండో విడతలో కూడా నర్సీపట్నం, చోడవరం ఎమ్మెల్యేలు 81 దేవాలయాలకు ఆర్థిక సాయం కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇవి కాకుండా మరో అయిదు గ్రామాల నుంచి నేరుగా ప్రతిపాదనలు రాగా వాటన్నింటికీ మంజూరు లభించినట్లు తెలిసింది.
జీఎస్టీ గండం..
గ్రామంలో కమిటీల ద్వారా కోవెలలు నిర్మిస్తుంటారు. తితిదే తరఫున అందించే సాయం కూడా ఈ కమిటీ సభ్యుల పేరునే ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తయిన పనికి బిల్లు చేసేటప్పుడు నిర్మాణ కమిటీల పేరున జీఎస్టీ చెల్లించాలి. ఒక్కో గుడికి రూ.10 లక్షలు ఖర్చుచేస్తే అందులో రూ.1.35 లక్షల వరకు జీఎస్టీ కింద పోతుంది. ఇది పెద్ద సమస్య కాకపోయినా జీఎస్టీ కమిటీ సభ్యుల పేరున చెల్లించడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వారు అనర్హులుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీంతో బిల్లుల చెల్లింపులపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా అట్నుంచి స్పష్టత రాక.. బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దేవాదాయ శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు రాంబాబు వద్ద ప్రస్తావించగా తితిదే నుంచి నిధులైతే విడుదలయ్యాయని, జీఎస్టీ సమస్యపై ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు వస్తాయేమో అని ఎదురుచూస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మొదటి విడత నిర్మాణాలకు సొమ్ములు అందుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే మొదటి విడతలో నిర్మిస్తున్న వాటికే నిధులు ఇవ్వకపోవడంతో రెండో విడతలో మంజూరైన వాటిని కార్యరూపంలోకి తేలేకపోతున్నారు.
బి.బి.పట్నంలోని పునాదుల దశలో రామాలయం పనులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు