logo

వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి

ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్‌ ఆది పిలుపునిచ్చారు.

Published : 27 Apr 2024 01:19 IST

నాయకులతో హైపర్‌ ఆది

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్‌ ఆది పిలుపునిచ్చారు. దక్షిణం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ తరఫున శుక్రవారం ఆయన జ్ఞానాపురంలోని బాబుకాలనీ, సెబాస్టియన్‌ కాలనీ, వడిచర్ల, రావులపల్లి, దయాస్‌, స్లీవగుర్తు, రే, బరిల్‌, సిరిల్‌ వీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆది మాట్లాడుతూ జగన్‌ పాలనలో రాష్ట్రాభివృద్ధి 20ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందన్నారు. నియంతల్లా మారిన వైకాపా పాలకులకు బుద్ధి చెప్పాలన్నారు. తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌కు సైకిల్‌ గుర్తుపై, దక్షిణం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌కు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం అందించాలని కోరారు. అనంతరం 32, 33, 34, 35 వార్డుల్లోని నీలమ్మ వేపచెట్టు, కొబ్బరితోట, అల్లిపురం, పూర్ణామార్కెÆట్, వెలంపేట, వేంకటేశ్వరమెట్ట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు ఐతి మధుబాబు, సన్నియాదవ్‌, సానబాని ఫ్రాన్సిస్‌, ఐతి రవిబాబు, భానోజీరావు, కొర్లాపు చిన్న, ఆంథోని, గవర రవణ, కోమలి, అనిత, సునీత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని