logo

నేడు వైఎస్‌ షర్మిల పర్యటన

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు.

Published : 27 Apr 2024 01:18 IST

హుకుంపేటలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌, సీపీఎం నాయకులు

పాడేరు, అరకులోయ, హుకుంపేట, న్యూస్‌టుడే: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి సతక బుల్లిబాబు శుక్రవారం పాడేరులోని తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. శనివారం ఉదయం పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి పాడేరు చేరుకుంటారన్నారు. సాయంత్రం ఇక్కడ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు.

మధ్యాహ్నం హుకుంపేట, అరకులోయల్లో షర్మిల రోడ్‌షో ఉంటుందని అరకులోయ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శెట్టి గంగాధరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుకుంపేట వైస్‌ ఎంపీపీ కొండలరావు, కాంగ్రెస్‌ నాయకులు పిలుపునిచ్చారు. హుకుంపేటలో వారు విలేకరులతో మాట్లాడారు. హుకుంపేట మోదకొండమ్మ ఆలయం వద్ద నుంచి కామయ్యపేట జంక్షన్‌ వరకు రోడ్‌ షో ఉంటుందని పేర్కొన్నారు. సీపీఎం, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు ఆదినారాయణ, రామలింగం, రామారావు, కృష్ణారావు సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని