నేడు వైఎస్ షర్మిల పర్యటన
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు.
హుకుంపేటలో మాట్లాడుతున్న కాంగ్రెస్, సీపీఎం నాయకులు
పాడేరు, అరకులోయ, హుకుంపేట, న్యూస్టుడే: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి సతక బుల్లిబాబు శుక్రవారం పాడేరులోని తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. శనివారం ఉదయం పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి పాడేరు చేరుకుంటారన్నారు. సాయంత్రం ఇక్కడ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు.
మధ్యాహ్నం హుకుంపేట, అరకులోయల్లో షర్మిల రోడ్షో ఉంటుందని అరకులోయ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శెట్టి గంగాధరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుకుంపేట వైస్ ఎంపీపీ కొండలరావు, కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. హుకుంపేటలో వారు విలేకరులతో మాట్లాడారు. హుకుంపేట మోదకొండమ్మ ఆలయం వద్ద నుంచి కామయ్యపేట జంక్షన్ వరకు రోడ్ షో ఉంటుందని పేర్కొన్నారు. సీపీఎం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు ఆదినారాయణ, రామలింగం, రామారావు, కృష్ణారావు సోమన్న తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రమోదీయం.. జనామోదం
[ 07-05-2024]
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. -
విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
[ 07-05-2024]
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. -
అల్లూరి స్ఫూర్తికి అడుగడుగునా తూట్లు
[ 07-05-2024]
రిటిష్ వారి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఏకం చేసి వారిని ఉద్యమ వీరులుగా తీర్చిదిద్దిన యోధుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలకు వెరవకుండా ఆయన చేసిన పోరాటం ఈనాటికీ గిరిజనులను ఉత్తేజపరుస్తూనే ఉంది. -
సమర్థులు వీరు.. గెలిపించాలి మీరు!
[ 07-05-2024]
సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో దింపాం. వారిని ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. -
రాష్ట్రంలో కూటమిదే అధికారం
[ 07-05-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమిదే అధికారమని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
కదల్లేని వారిపై కనికరమేది...!
[ 07-05-2024]
ప్రతిపక్షాలపై కక్ష.. కదల్లేని పింఛను లబ్ధిదారులకు శాపంగా మారింది. వయోవృద్ధులకు ఇంటికే వెళ్లి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
నాలుగు వేల మందికి ఒకే బూత్
[ 07-05-2024]
స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ను వేసేందుకు అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు విశేష స్పందన
[ 07-05-2024]
తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ విజయ సునీత సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో మన్యం నిర్లక్ష్యం
[ 07-05-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం రైతులపాలిట శాపంగా మారుతుందని, ప్రజలు భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదముందని అరకులోయ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM