ఆలయం.. నిధులందక ఆలస్యం
నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీలో ఆరు గుడుల నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున తితిదే అధికారులు కేటాయించారు. నిధులు రాకపోయినా కొన్నిచోట్ల నాయకులు శ్రద్ధ తీసుకుని నిర్మాణ పనులను దాదాపు ముగింపు దశకు తీసుకొచ్చారు.
నిర్మాణాలకు అందని తితిదే సాయం
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్టుడే,నర్సీపట్నం గ్రామీణం, రోలుగుంట, అనకాపల్లి:
వేములపూడి శివారు అప్పనపాలెంలో దాదాపు పూర్తయిన లక్ష్మీదేవి ఆలయం
నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీలో ఆరు గుడుల నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున తితిదే అధికారులు కేటాయించారు. నిధులు రాకపోయినా కొన్నిచోట్ల నాయకులు శ్రద్ధ తీసుకుని నిర్మాణ పనులను దాదాపు ముగింపు దశకు తీసుకొచ్చారు. ఎస్సీ కాలనీలో రామాలయం, పార్వతీదేవి గుడి, బంగారయ్యపేటలో లక్ష్మిదేవి గుడి నిధుల్లేక పునాదుల స్థాయిలోని నిలిచిపోయాయి. రెండు నెలల క్రితం అధికారులు కొలతలు తీసుకువెళ్లినా నిధులు విడుదల కాలేదు.
* రోలుగుంట మండలం బి.బి.పట్నంలో రామాలయం సుమారు 90 ఏళ్ల క్రితం నిర్మించడంతో పూర్తిగా శిథిలాస్థకు చేరుకుంది. ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి గ్రామస్థులు సంకల్పించారు. గత ఏడాది ఏప్రిల్లో సర్పంచి విశ్వేశ్వరరావు నేతృత్వంలో విప్ కరణం ధర్మశ్రీ ద్వారా ప్రతిపాదనలు పంపారు. ఇటీవలే శంకుస్థాపన చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నిధులొస్తే పనులు చేపట్టొచ్చని చూస్తున్నారు.
..ఇలా ఒకటి రెండు కాదు.. వందలాది గుడులకు తితిదే ఆర్థిక సాయం అందాల్సి ఉంది.
భక్తుల కోర్కెలు తీర్చే భగవంతుడికి గూడు ఏర్పరచాలంటే నిధుల కొరత తప్పడం లేదు. భక్తుల మొర ఆలకించడానికి దేవుడికి ఓ ఆవాసం కల్పించడానికి పాలకులకు అనుగ్రహం కలగడం లేదు. ఆయా గ్రామాల్లో గుడులు, గోపురాలు కట్టడానికి ఆర్థిక సాయం చేస్తామని పెద్దలు హామీలిచ్చినా సొమ్ములు విడుదల చేయడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవాణి ట్రస్ట్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో గుడుల నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేశారు. అనకాపల్లి జిల్లాలో మొదటి విడత 98 దేవాలయాలకు, అల్లూరి జిల్లాలో 161 ఆలయాల నిర్మాణానికి తితిదే నుంచి సాయం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క గుడికీ పైసా కూడా అందలేదు. గ్రామస్థుల చందాలు, దాతల విరాళాలతో కొంతవరకు నిర్మించి సొమ్ముల్లేక ఆలయాలను అసంపూర్తిగా వదిలేయాల్సి వస్తోంది.
దుగ్గాడలో నూకాలతల్లి కోవెల పైకప్పు
ఆ రెండు నియోజకవర్గాలకే..
బడి లేని ఊరుంటుందేమో గాని గుడి లేకుండా గ్రామం కనిపించదు. చిన్నదో పెద్దదో ఓ కోవెల ఉంటే ఊరికి మంచిదని విశ్వాసం. అందుకే గ్రామాల్లోకి నేతలెవరొచ్చినా గుడి కట్టుకుంటాం సాయం చేయండని అడుగుతుంటారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తితిదే కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణానికి నిధులు సమకూర్చుతుంది. అందులో భాగంగానే ఎమెల్మేలు కూడా తితిదే నిధుల కోసం ప్రతిపాదనలు పంపిస్తుంటారు. ప్రస్తుతం అధికార పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా నేతలు ఎవరు అడిగినా కాదనడం లేదు. మొదటి విడతలో నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో 98 గుడులకు తితిదే ద్వారా మంజూరు లభించింది. తాజాగా రెండో విడతలో కూడా నర్సీపట్నం, చోడవరం ఎమ్మెల్యేలు 81 దేవాలయాలకు ఆర్థిక సాయం కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇవి కాకుండా మరో అయిదు గ్రామాల నుంచి నేరుగా ప్రతిపాదనలు రాగా వాటన్నింటికీ మంజూరు లభించినట్లు తెలిసింది.
జీఎస్టీ గండం..
గ్రామంలో కమిటీల ద్వారా కోవెలలు నిర్మిస్తుంటారు. తితిదే తరఫున అందించే సాయం కూడా ఈ కమిటీ సభ్యుల పేరునే ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తయిన పనికి బిల్లు చేసేటప్పుడు నిర్మాణ కమిటీల పేరున జీఎస్టీ చెల్లించాలి. ఒక్కో గుడికి రూ.10 లక్షలు ఖర్చుచేస్తే అందులో రూ.1.35 లక్షల వరకు జీఎస్టీ కింద పోతుంది. ఇది పెద్ద సమస్య కాకపోయినా జీఎస్టీ కమిటీ సభ్యుల పేరున చెల్లించడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వారు అనర్హులుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీంతో బిల్లుల చెల్లింపులపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా అట్నుంచి స్పష్టత రాక.. బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దేవాదాయ శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు రాంబాబు వద్ద ప్రస్తావించగా తితిదే నుంచి నిధులైతే విడుదలయ్యాయని, జీఎస్టీ సమస్యపై ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు వస్తాయేమో అని ఎదురుచూస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మొదటి విడత నిర్మాణాలకు సొమ్ములు అందుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే మొదటి విడతలో నిర్మిస్తున్న వాటికే నిధులు ఇవ్వకపోవడంతో రెండో విడతలో మంజూరైన వాటిని కార్యరూపంలోకి తేలేకపోతున్నారు.
బి.బి.పట్నంలోని పునాదుల దశలో రామాలయం పనులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిషేధమన్నావు.. నిషాలో ముంచావు!
[ 08-05-2024]
మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. మూడు దశల్లో మద్యం నిషేధిస్తాం. 2024 ఎన్నికల్లో ఓటడిగే సమయానికి మద్యం దుకాణాలే లేకుండా చేస్తాం. -
వైకాపాను తరిమికొడదాం
[ 08-05-2024]
వైకాపాను తరిమికొట్టి, తెదేపాను గద్దెనెక్కిద్దామని ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల వారపు సంతలో కూటమి నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగన్కు పల్లకీ మోత.. గిరిజనులకు డోలీమోత
[ 08-05-2024]
మన్యంలో మరణమృదంగం మోగుతూనే ఉంది. కొండపై నివసించే గిరిజనుల బతుకులు తరచూ కొండెక్కిపోతున్నాయి. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
[ 08-05-2024]
చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ప్రమాదానికి గురైంది. -
పోలవరం నిర్వాసితులను మోసంచేసిన వైకాపా
[ 08-05-2024]
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. -
సర్కారు తీరుతో పింఛను కష్టాలు
[ 08-05-2024]
ప్రతి నెలా ఒకటో తేదీన అందాల్సిన పింఛను రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఈ నెల ఏడో తేదీ వరకు అందలేదు. దీంతో వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
అంతకు మించి అన్నారు.. అలా వంచించారు!
[ 08-05-2024]
మత్స్యకారులు నా కుటుంబ సభ్యులు. వారి జీవితాలను బాగుచేస్తాం. వైకాపా అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఏపీఐఐసీ పైపులైను పరిహారం చెల్లిస్తాం. -
జగన్ ప్రచార సభ వెలవెల
[ 08-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గాజువాక కూడలిలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ పేలవంగా సాగింది. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ దుర్మరణం
[ 08-05-2024]
బొలెరో వాహనం అదుపు తప్పి ఇంజినీర్ దుర్మరణం పాలైన ఘటన మంగళవారం హుకుంపేట మండలంలో చోటుచేసుకుంది. -
ఆదివాసీల ఐక్యతకు కృషిచేసేవారిని గెలిపించండి
[ 08-05-2024]
ఆదివాసీల హక్కులు, ఐక్యతకు కృషి చేసే ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్ పేర్కొన్నారు. -
గందరగోళం.. పోస్టల్ బ్యాలెట్
[ 08-05-2024]
నాలుగు రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. -
రాష్ట్రంలో వైకాపా నియంత పాలన
[ 08-05-2024]
రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM