మాకూ కావాలి.. ఓ గన్!!
ప్రశాంతతకు మారు పేరుగా నిలిచే విశాఖలో ఇటీవలి పరిణామాలు కలవరపెడుతున్నాయి. దీంతో ‘గన్’ లైసెన్స్కు దరఖాస్తులు పెరుగుతున్నాయి.
విశాఖలో లైసెన్సులకు దరఖాస్తులు!
భూ కబ్జాలు, కిడ్నాప్లు, హత్యల నేపథ్యంలో ఆందోళన
వ్యక్తిగత భద్రతపై విశాఖ ప్రముఖుల దృష్టి
ఈనాడు-విశాఖపట్నం : ప్రశాంతతకు మారు పేరుగా నిలిచే విశాఖలో ఇటీవలి పరిణామాలు కలవరపెడుతున్నాయి. దీంతో ‘గన్’ లైసెన్స్కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. కొన్నాళ్లుగా హత్యలు, కిడ్నాప్లు, దాడులతో భయానక పరిస్థితి నెలకొంది. విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించిన తరువాత భూకబ్జాలు, ఆక్రమణలు, బెదిరింపులు-వేధింపులు పెరగడంతో నేరాల తీరు కూడా మారిపోయింది. నగరంలో 2021లో 37 హత్యలు, 2022లో 38 హత్యలు జరిగాయి. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో 15 జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మరో వైపు గంజాయి నిల్వ... రవాణాకు నగరం కేంద్రంగా మారింది. ఇటీవల వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్లతోపాటు, వైకాపా నేత, ప్రముఖ ఆడిటర్ జీవీలను డబ్బు కోసం కిడ్నాప్ చేయడం ఉలిక్కిపడేలా చేసింది. ఎంపీ కుటుంబీకులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటనే అంశం చర్చనీయాంశమయింది. దీంతో విశాఖలోని కొందరు రాజకీయ, వ్యాపార, స్తిరాస్థి (రియల్ ఎస్టేట్) ప్రముఖుల్లో వణుకు మొదలైంది.
నేరగాళ్ల కన్ను పడింది: ఒక్క కిడ్నాప్ ఘటనతోనే నగరవాసుల్లో ఇంత భయం కలగలేదు. గత కొంత కాలంగా వరుసగా జరుగుతున్న నేరాలు తీవ్ర స్థాయికి చేరడంతోనే ఈ ఆందోళన నెలకొంది. కొందరు నేతల భూదాహం విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. వివాదాస్పద స్థలాల్లో ఓ వర్గానికి కొమ్ముకాస్తూ ‘డెవలెప్మెంట్’ పేరుతో పాగా వేస్తున్నారు. అధికార అస్త్రాన్ని ప్రయోగించి విలువైన భూములను తమపరం చేసుకుంటున్నారు. వారికి దన్నుగా నిలుస్తున్న కొందరు రౌడీషీటర్లే కిడ్నాప్లు, హత్యలకు తెగబడుతున్నారు. రౌడీషీటర్ హేమంత్ గతేడాది జూన్లో భీమిలికి చెందిన తెదేపా నేత, రియల్టర్ను కిడ్నాప్ చేసి, కారులో తిప్పుతూ రూ.కోటి డిమాండ్ చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో రియల్టర్ను ప్లాటు అమ్ముతానంటూ పిలిచి కిడ్నాప్ చేసి రూ.7.50 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల ఎంపీ కుటుంబీకులను, ఆడిటర్ను కిడ్నాప్ చేసిన సమయంలో ‘ఎంపీ అయినా, ఆటోడ్రైవరైనా ఒక్కటే.. పదిహేను రోజుల్లో బయటకు వచ్చేస్తాం’ అని కిడ్నాపర్లు ధీమాగా మాట్లాడటం గమనార్హం. ఎవరిని అడిగితే అప్పటికప్పుడు రూ.కోట్లు తెచ్చి ఇస్తారో? ఎవరి వద్ద డబ్బులు ఎక్కువ ఉంటాయో? నగరంలోని ప్రముఖల పేర్లు, ఫోన్ నెంబర్లు చెప్పి మరీ బాధితులతో ఫోన్ చేయించారంటే నేరగాళ్ల కన్ను వీరందరిపైనా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కిడ్నాప్ సంఘటన తరువాత తన కుమారుడు శరత్కు వ్యక్తిగత భద్రత నేపథ్యంలో గన్ లైసెన్సు జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీ ఇటీవల వెల్లడించారు. పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మూడు నెలల క్రితం గన్ లైసెన్సు విషయంలో నిర్ణయం తీసుకోగా... నెల కిందట దరఖాస్తు పెట్టినట్లు సమాచారం. మంత్రికి గన్మెన్లతో వన్ ప్లస్ ఫోర్ సెక్యూర్టీ ఉన్నప్పటికీ, వ్యక్తిగత భద్రత పేరుతో గన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కొన్ని రోజులుగా: నగరంలో ఇప్పటి వరకు 300 పైగా గన్ లైసెన్సులు ఉన్నాయి. ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనతో గత పదిరోజులుగా కొత్తగా దరఖాస్తులు అందుతున్నట్లు సమాచారం. వెంటనే లైసెన్సు మంజూరు చేయాలనే సిఫార్సులతో, అభ్యర్థనలతో దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. పోలీస్ కమిషనర్కు వచ్చే దరఖాస్తులను స్పెషల్బ్రాంచ్కి పంపి విచారణ చేయించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుకు బందోబస్తు అవసరమని గుర్తిస్తే దస్త్రాన్ని అమరావతి పంపి అనుమతి రాగానే మంజూరు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాన్ని శాసించేలా!!
[ 17-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలట్ ఓట్లు వినియోగించుకున్న వారి సంఖ్య ఈ ఎన్నికల్లో గణనీయంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో 0.31శాతం మంది పోస్టల్ బ్యాలట్లు వినియోగిస్తే, ఈ ఎన్నికల్లో 1.13 మంది పోస్టల్ ఓట్లు వేశారు. -
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ శిబిరాలు
[ 17-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. -
బాధితులకు ‘తెదేపా’ పరామర్శ
[ 17-05-2024]
విశాఖలోని బర్మాక్యాంపు ప్రాంతంలో జరిగిన వైకాపా నాయకుల దాడిలో గాయపడిన బాధితులను గురువారం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో విశాఖ పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు గండి బాబ్జీ పరామర్శించారు. -
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
[ 17-05-2024]
ఐదేళ్లుగా విశాఖను కబళించిన ‘జె’ గ్యాంగ్లో ఆయన ఒకరు. ఏకంగా రాయలసీమ జిల్లాలు దాటొచ్చి విశాఖలో రూ.వందల కోట్ల విధ్వంసం సాగించారు. రుషికొండ మట్టిని కొల్లగొట్టి.. ఏపీఐఐసీ భూముల్లోనూ దర్జాగా గ్రావెల్ తవ్వకాలు సాగించిన ఘనుడు. -
ఈవీఎంలకు కేంద్ర బలగాల భద్రత సీసీ కెమెరాల ఏర్పాటు
[ 17-05-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న ఓటింగ్ యంత్రాల (ఈవీఎం, వీవీపాట్)స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతను కల్పించారు. తొలి అంచెలో కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయి. -
ముగిసిన ఐఐవైసీ వార్షిక సమావేశాలు
[ 17-05-2024]
ఇస్కాన్ (సాగర్నగర్) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు(హెల్పర్) మృతి చెందాడు. -
వరాహా నదిలో రాతి విగ్రహం లభ్యం
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెదఉప్పలం సమీపాన వరాహానదిలో నూకాంబిక అమ్మవారి రాతి విగ్రహం గురువారం లభ్యమైంది. -
తెదేపా అభిమానిపై వైకాపా నాయకుల దాడి
[ 17-05-2024]
మండలంలోని జె.పి.అగ్రహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తెదేపా అభిమానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేశామని రోలుగుంట ఎస్సై సురేష్ తెలిపారు. -
పారా వాలీబాల్ జాతీయ జట్టుకు సోముదేవుపల్లి యువకుడి ఎంపిక
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు పాత సోముదేవుపల్లికి చెందిన దివ్యాంగ యువకుడు అన్నం గణేష్ పారా వాలీబాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. -
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
[ 17-05-2024]
జాతీయ రహదారిపై నూతనగుంటపాలెం సమీపాన గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో డ్రైవరుతో సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.