విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. అభిమానులను దోచుకున్న నిర్వాహకులు
చెన్నై సూపర్కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ మ్యాచ్లో అందరి కళ్లు చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీపైనే..
అభిమానుల కేరింతలు
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: చెన్నై సూపర్కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ మ్యాచ్లో అందరి కళ్లు చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీపైనే. ఈ మ్యాచ్కున్న డిమాండ్ దృష్ట్యా దిల్లీ జట్టు యాజమాన్యం, నిర్వాహకులు టికెట్ల విషయంలో అభిమానులను దోచుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విక్రయాలతో తమకేమీ సంబంధం లేదని చెబుతున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్.. వైకాపా నాయకులకు పెద్దఎత్తున టికెట్లు కేటాయించినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో వైకాపా కార్యాలయాల ద్వారా జిల్లాలోని పారిశ్రామికవేత్తలకు వీటిని చేరవేసినట్లు తెలిసింది. బ్లాక్లో టికెట్లు విక్రయించడంలోనూ వీరి పాత్ర ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు. పలువురు వైకాపా నాయకుల వద్ద కాంప్లిమెంటరీ పాస్లు ఉండటం గమనార్హం.
పట్టించుకోని పోలీసులు
దిల్లీ, చెన్నై మ్యాచ్ టికెట్లను ఈనెల 27న పేటీఎంలో అందుబాటులో ఉంచారు. నిమిషాల వ్యవధిలోనే టికెట్లు ఖాళీ అయిపోయాయని ప్రకటించడంతో అభిమానులు విస్మయానికి గురయ్యారు. కానీ ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియం గేటు బయట, సామాజిక మాధ్యమాల్లో బ్లాక్లో టికెట్ల విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయి. రూ.1000 టికెట్ను రూ.3 వేలకు, రూ.2 వేల టికెట్ను రూ.6 వేలకు, రూ.3 వేల టికెట్ను రూ.8 వేలకు విక్రయించారు. పోలీసుల కళ్ల ముందే ఇదంతా జరిగినా.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ప్లాటినం లాంజ్, కార్పొరేట్ బాక్సుల్లోని టికెట్లను ఆన్లైన్లో బ్లాక్ చేశారు. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు అధిక ధరల (రూ.12,000, రూ.15 వేలు, రూ.25 వేలు)కు అందుబాటులో ఉంచడం గమనార్హం.
యాజమాన్యమే కేటాయించిందా.?
ఆన్లైన్లో ఒక్కో ఫోన్ నంబర్తో రెండు టికెట్లు కొనుగోలు చేయడానికే అవకాశం కల్పించారు. కానీ కొందరు పదుల సంఖ్యలో టికెట్లు చేజిక్కించుకున్నారు. అవన్నీ వారి చేతికి ఎలా వచ్చాయో తెలియని పరిస్థితి. జట్టు యాజమాన్యమే కొందరికి టికెట్లు కేటాయించి, బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. గతంలో విశాఖ వేదికగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగినా ఎప్పుడూ ఇలా జరగలేదని, ఇదే తొలిసారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో టికెట్ ప్రారంభ ధర రూ.300 ఉండగా ఇప్పుడు రూ.1000కు పెంచారు. ఏ ధర టికెట్లు.. ఎన్ని విక్రయిస్తున్నామనే వివరాలు వెల్లడించలేదు. రూ.2 వేల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో పెట్టలేదు. కానీ బ్లాక్లో విక్రయించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కొందరు మోసపోయామని వాపోతున్నారు. మ్యాచ్కు టికెట్లు ఉన్నాయని ఓ వ్యక్తి ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశాడు. ఓ అభిమాని ఎంతో ఆశగా వాట్సప్ నెంబర్కు మెసేజ్ చేశాడు. ఆ టికెట్లకు చాలా డిమాండ్ ఉందని, త్వరగా డబ్బులు చెల్లించాలని అవతలి వ్యక్తి కంగారుపెట్టాడు. డబ్బులు చెల్లించిన వెంటనే సదరు వ్యక్తి ‘బ్లాక్’ చేయడంతో మోసపోయినట్లు గుర్తించాడు. చేసేదేమీలేక సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
[ 02-05-2024]
తెదేపా హయాంలో ‘బీఆర్ అంబేడ్కర్’ పేరుతో అమలు చేసిన విదేశీ విద్య పథకానికి ముఖ్యమంత్రి జగన్ నీళ్లొదిలారు. ఈ పథకానికి తన పేరు పెట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు. -
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
పాడికుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. ప్రతిపక్షం మీద కక్షతో జగన్ పాడిని పాడు చేశారు. -
మాటలు బడాయి.. పేదల వైద్యానికి బకాయి
[ 02-05-2024]
సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మెరుగైన వైద్య సేవలందించాలి. కానీ వైకాపా ప్రభుత్వం అవేవీ పట్టవన్నట్లు వ్యవహరిస్తోంది. -
మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసా..
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఓటు ఎక్కడ ఉంది? పోలింగ్ కేంద్రం ఎక్కడ? ఎలా చేరుకోవాలి? అనే సందేహాలు ఓటర్లలో తలెత్తుతున్నాయి. -
నేడు ‘దక్షిణం’లో పవన్ సభ
[ 02-05-2024]
దక్షిణ నియోజకవర్గ దుర్గాలమ్మ ఆలయం ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు జనసేన అధినేత పవన్కల్యాణ్ బహిరంగ సభ జరగనుందని ఆ పార్టీ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
ఫలితాలు తేల్చేది వనితలే!
[ 02-05-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏప్రిల్ 25 నాటికి 12,89,371 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి గత శనివారం రాజకీయ పార్టీల సమావేశంలో ప్రకటించారు. -
కాపులకు మేలు చేసింది తెదేపానే: గంటా
[ 02-05-2024]
రాష్ట్రంలో కాపులకు మేలుచేసిన పార్టీ తెదేపా మాత్రమేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
ఆరోగ్యశ్రీ పథకానికి అనారోగ్యం
[ 02-05-2024]
జగనన్న పాలనలో ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. -
విదేశీ విద్య.. అంతా మిథ్య
[ 02-05-2024]
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్న పేద విద్యార్థుల కలను జగన్ కల్లగానే మిగిల్చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరిట అమలు చేస్తున్న ఈ పథకం లబ్ధిదారులకు కఠిన నిబంధనలు అడ్డుగా మారాయి. -
జనసేనానికి జన నీరాజనం
[ 02-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పెందుర్తిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జనసేనానికి నీరాజనాలు పలికారు. -
ఎమ్మెల్యే సారూ.. జెట్టీ ఒట్టి మాటేనా..
[ 02-05-2024]
పరవాడ మండలం ముత్యాలమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం, జాలారిపేట, సమ్మెంగిపాలెంలోని మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన ఆధారం. -
నోటా కోసమే ఒక బ్యాలెట్ యూనిట్
[ 02-05-2024]
జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోల్చితే విశాఖ దక్షిణంలో పోలింగ్ ఈసారి కాస్త భిన్నంగా ఉండనుంది. ఇ -
స్వగ్రామానికి ఆర్మీ ఉద్యోగి మృతదేహం
[ 02-05-2024]
పశ్చిమబెంగాల్లో హఠాన్మరణం చెందిన ఆర్మీ హవల్దార్ చిల్ల త్రినాథరెడ్డి (36) మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన చిట్టివలస సమీప జీరుపేట గ్రామానికి బుధవారం తీసుకువచ్చారు. -
ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్యాయత్నం....
[ 02-05-2024]
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది. -
బాలికపై అత్యాచార యత్నం
[ 02-05-2024]
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై ఎండాడ దిశా పోలీసు స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు భీమిలి సీఐ డి.రమేశ్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు