Chennai Vs Punjab: ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై జట్టుకు తన సొంతమైదానం చెపాక్లో మళ్లీ ఓటమి ఎదురైంది. ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న వేళ ఈ పరాజయం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై (162/7) భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62) కీలక ఇన్నింగ్స్ ఆడినా సరిపోలేదు. కనీసం మరో 50 నుంచి 60 పరుగుల వరకు చేస్తే బాగుండేదని రుతురాజ్ (Rutursj Gaikwad) వ్యాఖ్యానించాడు.
‘‘చెపాక్ స్టేడియంలో మళ్లీ ఓటమి ఎదురు కావడం నిరుత్సాహానికి గురి చేసింది. కనీసం మరో 60 పరుగుల వరకు అదనంగా చేయాల్సింది. మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. తర్వాత బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. మతీశా పతిరన, తుషార్ దేశ్పాండే లేకపోవడం కూడా నష్టం చేసింది. వికెట్ కావాల్సిన సమయంలో కేవలం ఇద్దరు పేసర్లతోనే బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి. మంచు ప్రభావం వల్ల స్పిన్నర్లకు బంతిపై నియంత్రణ ఉండదు. వారి నుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు. గత మ్యాచ్లోనూ మేం భారీ తేడాతో (78 పరుగులు) హైదరాబాద్పై గెలవడం కూడా మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తేమను మనం కంట్రోల్ చేయలేం. తొలి ఇన్నింగ్స్లో ఇంకాస్త బెటర్గా బ్యాటింగ్ చేస్తే బాగుండేది. గత రెండు మ్యాచుల్లో మేం 200+ స్కోరును చేసి ప్రత్యర్థి ముందు ఉంచాం. ఇప్పుడీ మ్యాచ్లో కనీసం 180 రన్స్ ఉంచినా లక్ష్య ఛేదన క్లిష్టంగా మారేది. టాస్ కూడా కలిసి రావాలి. అందుకోసం నేను టాస్ వేయడాన్ని కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేశా. అక్కడ కొన్నిసార్లు విజయవంతమయ్యా. ఇక్కడ మాత్రం అనుకూలంగా రాలేదు. గేమ్లో పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ టాస్ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యా’’ అని రుతురాజ్ వెల్లడించాడు. గత మ్యాచ్ (హైదరాబాద్తో పోరు) సందర్భంగా పతిరన, తుషార్ దేశ్ పాండే గాయపడటంతో వారిద్దరికి జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- ఐపీఎల్లో 2014 నుంచి అతిపెద్ద వయసులో అరంగేట్రం చేసిన రెండో ఆటగాడు రిచర్డ్ గ్లీసన్. చెన్నై తరఫున రిచర్డ్ 36 ఏళ్ల 151 రోజుల వయసులో డెబ్యూ చేశాడు. అంతకుముందు సికిందర్ రజా (36 ఏళ్ల 342 రోజులు) అందరి కంటే ముందున్నాడు.
- ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై 10 మ్యాచ్లు ఆడింది. కెప్టెన్ రుతురాజ్ తొమ్మిది సార్లు టాస్ను ఓడిపోయాడు.
- చెపాక్లో చెన్నైపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. ముంబయి (5) ముందుండగా.. పంజాబ్ (4) రెండో స్థానంలోకి వచ్చింది. కోల్కతా (3) ఆ తర్వాత ఉంది.
- ఐపీఎల్లో చెన్నైపై వరుస విజయాలు సాధించిన ముంబయి జట్టుతో పంజాబ్ సమంగా నిలిచింది. ముంబయి (2018-19 సీజన్లలో) వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. ఇప్పుడు పంజాబ్ (2021-2024) కూడా ఐదు విజయాలతో నిలిచింది.
- అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ గైక్వాడ్ వద్దకు చేరింది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ (500 రన్స్) ఉన్న క్యాప్ను రుతురాజ్ (509) సొంతం చేసుకున్నాడు. గత 9 మ్యాచుల వరకు కోహ్లీ వద్దే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా