నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం.
అక్కచెల్లెమ్మలకు విశాఖలో భద్రతేది జగన్!
ఉలిక్కిపడేలా ఘోరాల గణాంకాలు
ఈనాడు- విశాఖపట్నం
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుని పెద్దపీట వేస్తున్నాం.
ఇదీ జగన్ మహిళల భద్రతపై గొప్పగా చెప్పిన మాటలు
... ఇవన్నీ ప్రచార ఆర్భాటానికే తప్ప, ఆడపిల్లలపై అకృత్యాలను అడ్డుకోలేకపోయాయి. అక్కచెల్లెమ్మలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. విశాఖలో పట్టపగలే మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. ‘వన్ స్టాప్’ కేంద్రంలో నమోదవుతున్న గణాంకాలు ఆడబిడ్డల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. గృహ హింస, అత్యాచారం, మహిళల చిత్రాలను అంతర్జాలంలో పెట్టి బెదిరింపులు, అక్రమ రవాణా, బాలికలపై లైంగిక వేధింపులు వైకాపా హయాంలో పెరిగిపోయాయి. కఠిన చర్యలు తీసుకుంటే సీఎం జగన్ పాలనలో ఇన్ని జరిగేవా అని జనం ప్రశ్నిస్తున్నారు.
ప్రముఖులకే రక్షణ లేదు: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడికే రక్షణ కరవైంది. గతేడాది జూన్లో ఇద్దరు రౌడీషీటర్లు ఎంపీ కుమారుడు శరత్ ఇంట్లోకి చొరబడ్డారు. శరత్ను కిడ్నాప్ చేసి, సినీ ఫక్కీలో ఫోన్లో మాట్లాడిస్తూ ఎంపీ సతీమణి జ్యోతి, ఆడిటర్ జీవీని ఆ ఇంటికి పిలిపించి నిర్బంధించారు. ఎంపీ భార్య వద్ద ఆభరణాలు దోచుకోవడమే కాకుండా, చేయిచేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లు మూడు రోజులు గంజాయి మత్తులో ఉండి విచక్షణారహితంగా బాధితులను కొట్టి హింసించారు.
ప్రశాంత విశాఖలో ఎంపీ కుటుంబానికే భద్రత కరవైన పరిస్థితులు తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. జగన్ రుషికొండలో నిర్మించిన రాజసౌధానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. గతేడాది రాత్రి సమయంలో ఇంటికి వస్తున్న మహిళా కమిషన్లోని ఓ సభ్యురాలి సోదరిపై మద్యం మత్తులో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడం ఉలిక్కిపడేలా చేసింది. ఇటీవల ఓ కీలక నేత ఇంట్లోకి చొరబడి ఆయన సతీమణి గొంతుపై కత్తిపెట్టి నగలు తీసుకెళ్లిన ఘటన కూడా కలకలం రేపింది.
అమ్మో ఎన్ని ఘటనలో
గతేడాది మే 30న ఓ వివాదాస్పద భూమిలో కాపలాదారుగా పనిచేస్తున్న మహిళను కొందరు బలవంతంగా బయటకు లాక్కొచ్చి షెడ్డు కూల్చేశారు. ఆమెను నిర్బంధించి ఫోన్ లాక్కొని తెల్లవారుజాము వరకు భయ భ్రాంతులకు గురి చేశారు.
నేవీ అధికారి కుమార్తెపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. 9వ తరగతి చదువుతున్న బాలిక నగ్న వీడియోలు తీసి బెదిరించి ఓ అటెండర్ అత్యాచారం చేశారు. ఆ వీడియోలు స్నేహితులకు చేరవేయగా, వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు. అటెండర్ను అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘోరమైన ఘటన గతేడాది జులైలో వెలుగులోకి వచ్చింది.
గతేడాది ఫిబ్రవరి 19న అర్ధరాత్రి రంగిరీజు వీధిలో ఓ కుటుంబం వెళుతుండగా.. గంజాయి మత్తులో కొందరు యువకులు మహిళ దుస్తులు చింపి క్రూరంగా ప్రవర్తించారు.
- 2019 డిసెంబరులో కొమ్మాదిలోని వికలాంగులకాలనీలోఅద్దెకు ఉంటున్న వ్యక్తికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఒక రోజున ఇంటికి పిలవగా, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో ఆ వ్యక్తి...మహిళను హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కేశాడు. ఏడాదిన్నర తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.
- భీమిలి పరిధిలో ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే కేరళకు చెందిన వ్యక్తి అత్యంత కిరాతంగా ఓ మహిళను హత్య చేశాడు. తనకు పరిచయం ఉన్న మహిళతో గొడవ జరగ్గా... భవనం పైనుంచి తోసేశాడు. కిందపడిన ఆమె కొన ఊపిరితో ఉండటంతో గొంతు నొక్కడంతోపాటు, శరీరంపై పలుచోట్ల కత్తితో గాయాలు చేసి చంపి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు.
తగరపు వలసకు చెందిన ఓ మహిళకు ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఓ రోజు ఆటోలో ఓ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా, తన ఒంటిపై ఉన్న బంగారం కొంత ఇవ్వాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఆ మహిళను హత్య చేసి గెడ్డలో పడేశాడు.
నగరంలో నిఘా ఏదీ:
మద్యం, గంజాయి మత్తులో మహిళలపై కొందరు పట్టపగలే దాడులకు తెగబడుతున్నారు. బహిరంగంగానే బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నా నిఘా కళ్లు పసిగట్టలేకపోతున్నాయి. మహిళలపై వేధింపులు...వారిపై కత్తులతో దాడులు జరుగుతున్నా నిరోధించలేక పోతున్నారు. ఘటనల తీరును పరిశీలించాలన్నా నగరంలో వందల సంఖ్యలో సీసీ కెమెరాలు మూలకు చేరిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనకు ‘దక్షిణం’ జై!
[ 03-05-2024]
యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు దక్కాలంటే వైకాపా ప్రభుత్వం కూలిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పేర్కొన్నారు. -
జగమొండి.. పథకాలకు గండి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసింది. ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలు గుప్పించిన జగన్ వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. -
నేడు బాలకృష్ణ రోడ్షో
[ 03-05-2024]
సినీ నటుడు బాలకృష్ణ రోడ్షో శుక్రవారం సాయంత్రం నగరంలో జరగనుందని తెదేపా వర్గాలు తెలిపాయి. -
ఆలయ భూమి హాంఫట్
[ 03-05-2024]
గ్రామదేవతకు భక్తులు అందించిన భూమిని నాయకులతో కలిసి ఒకరు కారుచౌకగా కొట్టేశారు. -
మౌలిక వసతులతో ఇళ్లిస్తాం: అయ్యన్న
[ 03-05-2024]
కూటమి విజయం ఖాయం. అధికార పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే నర్సీపట్నంలోని టిడ్కో గృహ సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. -
జగన్కు యూఎల్సీ ఝలక్..!
[ 03-05-2024]
నగరంలోని యూఎల్సీ (పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం) ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూముల్లో వెలిసిన ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నీరుగారి పోయింది. -
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం
[ 03-05-2024]
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
అధ్వాన రహదారులతో అనకాపల్లి జిల్లా
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
కూటమితో బీసీలకు రాజ్యాధికారం: శ్రీభరత్
[ 03-05-2024]
ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపాను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెదేపా కూటమితోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా కూటమి అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: గంటా
[ 03-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో దుర్మార్గ వైకాపా సర్కారును తరిమికొట్టి సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన చారిత్రక అవసరం అందరిపైన ఉందని భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. -
నేటి నుంచి నిజరూప దర్శనం టికెట్ల విక్రయం
[ 03-05-2024]
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవోపేతంగా జరగనుంది. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : గణబాబు
[ 03-05-2024]
ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
పట్టాదారు పుస్తకం మీద సీఎం బొమ్మ ఉంటే ఏం?: బొత్స
[ 03-05-2024]
రైతుల పట్టాదారు పాసు పుస్తకం మీద సీఎం చిత్రం ఉంటే అది చట్టపరంగా చెల్లకపోవడమంటూ ఏమీ లేదు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ భూ హక్కుదారులను అపహాస్యం చేశారు. -
అవయవదానంతో దాతృత్వం చాటారు!
[ 03-05-2024]
చనిపోయిన వ్యక్తి అవయవదానానికి ముందుకు వచ్చి ఆ కుటుంబ సభ్యులు దాతృత్వం చాటారు. -
నకిలీ నోట్లు, బంగారం ముఠా గుట్టురట్టు
[ 03-05-2024]
తక్కువ కాలంలో డబ్బు, బంగారం సంపాదించాలని ఆశపడే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లు, బంగారంతో మోసగిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేసినట్లు మధురవాడ ఏసీపీ గురువారం తెలిపారు. -
‘సిద్ధం’ తాయిలాల టోకెన్లకు ఘర్షణ
[ 03-05-2024]
విశాఖ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ సిద్ధం సభకు సిద్ధం చేసిన టోకెన్లపై ఆ పార్టీలోనే ఇద్దరు నాయకులు తీవ్రంగా ఘర్షణ పడటంతో పాటు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం