విమానాశ్రయం.. మరింత ఆలస్యం!!
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా, సాంస్కృతిక రాజధానిగా పేరు పొందిన ఓరుగల్లుకు విమానాశ్రయం కలగానే మిగులుతోంది. ఇదిగో అదిగో అంటూ కాలయాపనే కానీ, విమానాలు ఎగిరేందుకు మోక్షమెప్పుడు కలుగుతుందో తెలియని పరిస్థితి.
మరో 253 ఎకరాలు అవసరమంటున్న యంత్రాంగం
ఉన్న భూమిలోనే ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా, సాంస్కృతిక రాజధానిగా పేరు పొందిన ఓరుగల్లుకు విమానాశ్రయం కలగానే మిగులుతోంది. ఇదిగో అదిగో అంటూ కాలయాపనే కానీ, విమానాలు ఎగిరేందుకు మోక్షమెప్పుడు కలుగుతుందో తెలియని పరిస్థితి. తాజాగా వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కలిసి మరో 253 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇప్పుడున్న భూమికి అదనంగా సేకరణ జరిపితేనే బోయింగ్ లాంటి పెద్ద విమానాలు ఎగిరేందుకు సాధ్యమవుతుందని వివరించారు. మరింత భూమి కావాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కోరినట్టు సమాచారం. పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన వరంగల్కు విమానాశ్రయం లేకపోవడం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని చెప్పాలి. ఎప్పటికప్పుడు విమానాశ్రయం ప్రస్తావన తెరపైకి వస్తోందే కానీ, ఏర్పాటులో ముందడుగు పడకపోవడంతో ఈ ప్రాంతంలో ప్రజలు నిరాశ చెందుతున్నారు.
పెద్ద రన్వే కోసం..
వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్’ పథకం కింద ఉన్న స్థలంలోనే అనుమతించాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కోరింది. మామునూరులో 670 ఎకరాల విమానాశ్రయ స్థలం అందుబాటులో ఉంది. 1970-77 మధ్య వాయిదూత్ విమానాలు ఇక్కడ నడిచాయి. మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినకు వెళ్లినప్పుడు విమానాశ్రయం మంజూరు చేయాలని కోరారు. భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ రెండేళ్ల కిందట స్థానికంగా మట్టి నమూనా సేకరించి.. పరీక్షలు కూడా చేపట్టింది. గతేడాది ఉడాన్ పథకంలో భాగంగా పర్యాటక ప్రాంతాల సమీపంలో ఉన్న పాత విమానాశ్రయాలను(బ్రౌన్ ఫీల్డ్) పునరుద్ధరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. వరంగల్ను ఆ జాబితాలో చేర్చి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మొదటి దశ కింద సమగ్ర ప్రాజెక్ట నివేదిక (డీపీఆర్) రూపొందించి ఇవ్వాలని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీని కోరినట్లు సమాచారం. కానీ ఇప్పుడు బోయింగ్ లాంటి పెద్ద విమానాలు తిరగాలంటే, పెద్ద రన్వే కోసం అదనంగా భూసేకరణ కావాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ఎంతో అభివృద్ధి
రామప్ప ఆలయానికి వారసత్వ గుర్తింపు లభించింది. ఇప్పటికే వరంగల్ స్మార్ట్సిటీగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ పరిశ్రమలు నెమ్మదిగా వస్తున్నాయి. ఓరుగల్లు నుంచి దేశీయంగా విమాన ప్రయాణికులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎయిర్పోర్టు రావడం వల్ల అభివృద్ధి శరవేగంగా జరిగే వీలుంది. వరంగల్ చుట్టూ అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సాకారం కానుంది. వరంగల్లో 1200 ఎకరాల భూమి ఇస్తే పూర్తి స్థాయిలో ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తామని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గతంలో చెప్పారు.
చొరవ చూపితేనే..
రెవెన్యూ అధికారులు గూగుల్ మ్యాప్ ఆధారంగా సర్వే కూడా చేశారు. స్థానిక నాయకులు దీనిపై దృష్టి పెట్టి ప్రత్యేక సమీక్ష సమావేశం చేపట్టలేదు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు కేంద్రం ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి, వెంటనే భూసేకరణ చేపట్టేందుకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేలా చొరవ చూపాలి. అప్పుడే విమానాశ్రయం కల సాకారమవుతుంది. కానీ ఏడాదికోసారి సాదాసీదాగా సమీక్షలు నిర్వహించి వదిలేస్తే మరికొన్నేళ్లయినా మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరణ కాదనే చెప్పాలి.
ఎప్పుడేం జరిగిందంటే?
* 2007లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియాతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. అభివృద్ధి కోసం నీరు, విద్యుత్తు, రోడ్లు, ఇతర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంది.
* 2007-08లో వరంగల్్, కడప విమానాశ్రయాల అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరయ్యాయి.
* 2008లో మామునూరు రన్వేను ఎయిర్పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సందర్శించారు.
* 2008-09లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప, వరంగల్ విమానాశ్రయాల అభివృద్ధి కోసం రూ.59 కోట్లు మంజూరు చేసింది.
* 2020 - ఏఏఐ వరంగల్లో మట్టి నమూనాలు సేకరించింది. వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు తేలింది.
* 2022 - రాష్ట్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద ఉన్న స్థలంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
[ 02-05-2024]
నేతలు ఎన్నికల ప్రచారంలో చేసే ఉపన్యాసాలను పరిశీలిస్తే అంశం ఒకటే అయినా వారు వెల్లడించే విషయాలు భిన్నంగా ఉంటాయి. ఏప్రిల్ 24న హనుమకొండ మడికొండలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గత ఆదివారం వరంగల్ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ఒకే అంశంపై చేసిన విమర్శలు విభిన్నంగా ఉన్నాయి. -
గులాబీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ రోడ్షో
[ 02-05-2024]
మానుకోటలో జై తెలంగాణ నినాదాలు మరోసారి మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో అడుగుపెట్టగానే ఆనాడు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన జై తెలంగాణ నినాదాలు దారి పొడవునా మార్మోగాయి. -
మన అభ్యర్థులంతా బంగారు కొండలే..!
[ 02-05-2024]
భారతీయులందరికీ బంగారం అంటే ఎంతో మక్కువ. అందుకే పండగలు, పెళ్లిళ్లు, ఏ ప్రత్యేక సందర్భంలోనైనా పసిడి కొనుగోలు చేసేందుకు అమితంగా ఇష్టపడతారు. తమ ధగధగల నగలను ఎదుటి వారికి చూపేందుకు ఇష్టపడతారు. ఇందుకు లోక్సభ బరిలో ఉన్న మన అభ్యర్థులు అతీతమేం కాదు. -
‘బాలరాముడి పేరుతో భాజపా రాజకీయం’
[ 02-05-2024]
అయోధ్యలో రామాలయం పేరుతో ప్రధాని మోదీ, భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరంగల్ జిల్లా ఓసిటీ(ఓరుగల్లు సిటీ)లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు. -
దేశం గర్వించేలా మోదీ పాలన
[ 02-05-2024]
కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పర్వతగిరి, ఏనుగల్లు గ్రామాల్లో కార్నర్ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. -
ప్రత్యేక కార్యాచరణ.. పటిష్ఠ పర్యవేక్షణ
[ 02-05-2024]
జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి, జిల్లా విద్యాశాఖ ప్రణాళికబద్ధంగా నిరంతరం పర్యవేక్షణ, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలాంటి పటిష్ఠ చర్యలతో ఈ విద్యాసంవత్సరం (2023-24)లో జిల్లా పదోతరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు. -
ఎండు గంజాయి పట్టివేత
[ 02-05-2024]
ఓ వ్యక్తి వద్ద ఎండు గంజాయి పట్టుకున్న ఘటన డోర్నకల్లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెలువరించారు. -
‘మత ఘర్షణలు సృష్టించేందుకు భాజపా, భారాస ప్రయత్నం’
[ 02-05-2024]
కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు భాజపా, భారాస లోపాయికారి ఒప్పందం చేసుకొని మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు నియోజకవర్గాల లోక్సభ ఎన్నికల నిర్వహణ మానిటరీ కమిటీ కో-ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి ఆరోపించారు. -
బాలలతో పని చేయించడం నేరం
[ 02-05-2024]
14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని సీనియర్ సివిల్ న్యాయమూర్తి సి.సురేష్ అన్నారు. మే డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో న్యాయమూర్తి మాట్లాడారు. -
పంచాయతీలకు గూడు కరవు..!
[ 02-05-2024]
జిల్లా పరిధిలో మంజూరైన భవనాల్లో ములుగు, వెంకటాపూర్ మండలాల్లోనే ఏడు పనులు పూర్తి కాగా, 34 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లులు సకాలంలో అందకపోవడంతో గుత్తేదారులు అర్థాంతరంగా వదిలేశారు. ఉన్నతాధికారులు చొరవ చూపితేనే పనులు పూర్తి కానున్నాయి. -
సైబర్ మోసాల నియంత్రణకు కృషి
[ 02-05-2024]
జిల్లాలో సైబర్ సెక్యూరిటీ కేసులను చేదించే దిశగా పోలీసు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. సైబర్ క్రైం నియంత్రణలో భాగంగా బుధవారం ములుగులో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కార్యాలయాన్ని (ములుగు జిల్లా కోఆర్డినేషన్ సెంటర్) ఆయన ప్రారంభించి మాట్లాడారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం హనుమకొండలోని చైతన్య డీమ్డ్ వర్సిటీలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఏపీవోలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
కార్మిక పక్షపాతి కేసీఆర్
[ 02-05-2024]
మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ కార్మిక పక్షపాతి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. -
భానుడి భగభగలు..
[ 02-05-2024]
జిల్లాలో ఏప్రిల్ మాసం మొదటి నుంచే వేసవి ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక మే నెల ప్రారంభం కావడంతో బుధవారం నుంచే భానుడు మండుతున్నాడు. -
ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం
[ 02-05-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే వేడుకలను జనగామ జిల్లా కేంద్రంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
సత్తాచాటిన గురుకుల విద్యార్థులు
[ 02-05-2024]
జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ, గురుకుల విద్యాలయాల విద్యార్థులు పదో తరగతిలో ప్రతిభ చాటారు. జయశంకర్ జిల్లాలో మొత్తం 28 వరకు గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. -
పైసలిస్తేనే దస్త్రం కదిలేది!
[ 02-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం తీరు మారడం లేదు. భవన నిర్మాణ అనుమతుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పైసలిస్తే సరి.. లేదంటే కొర్రీలు పెడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. -
విజ్ఞానం.. వినోదం.. ఆధ్యాత్మికం
[ 02-05-2024]
పదోతరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.. విద్యార్థులకు ఉపశమనం లభించింది. తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం అయ్యే వరకు ఈ వేసవి సెలవులను విద్యార్థులను సద్వినియోగం చేసుకోవాలి. -
71,245 మంది అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు
[ 02-05-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటుంటాం. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద దరావతు (డిపాజిట్) చేయాల్సి ఉంటుంది. -
రెండు నియోజకవర్గాలకు రహదారే సరిహద్దు
[ 02-05-2024]
ఈ చిత్రంలో ఉన్నది ఒకే గ్రామంగా కనిపిస్తున్నప్పటికీ ఇవి జంట గ్రామాలు. మధ్యలో సరిహద్దుగా ఉన్న సీసీ రోడ్డు.. రెండు పంచాయతీలు, రెండు జిల్లాలు, రెండు శాసనసభ నియోజకవర్గాలు, రెండు లోక్సభ నియోజకవర్గాలను వేరు చేస్తోంది. -
ఉద్యోగాల పేరుతో టోకరా కేసు.. మరో నిందితుడి అరెస్టు
[ 02-05-2024]
రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో హనుమకొండ సుబేదారి పోలీసులు మరో నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..