హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది.
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. మన వరంగల్లో ఇటీవల హోటళ్ల మధ్య పోటీ పెరిగింది. ఇందులో నిలదొక్కుకోవడానికి నిర్వాహకులు వినూత్న పోకడలు అవలంబిస్తున్నారు. వింత పేర్లతో ఆహారప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆకర్షణీయమైన అలంకరణలతో కొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. అరణ్యం, జైలు, రైల్వే ప్లాట్ఫాం, సముద్రతీరం, గుహలు, పల్లె వాతావరణం, పార్కు, ప్రేమికుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గదుల్లో విందు చేస్తున్నట్లు ఏర్పాట్లు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
న్యూస్టుడే, రంగంపేట, ఎన్జీవోస్కాలనీ
పొట్ట పెంచుకుందాం..
కాకతీయ వైద్య కళాశాల ఎదురుగా రంగంపేట సెంటర్లో ఇటీవల ఏర్పాటైన ‘పొట్ట పెంచుకుందాం..’ అనే రెస్టారెంట్ కూడా అదే కోవలోకి వస్తుంది. ‘ఈ పేరుతో ఎక్కడైనా రెస్టారెంట్లు ఉన్నాయా? అని గూగుల్లో సెర్చ్ చేశామని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో ఉందని.. తెలంగాణలో ఎక్కడా లేదని నిర్ధారణకు వచ్చాక ఇక్కడ ఏర్పాటు చేశామని నిర్వాహకుడు హరికృష్ణ తెలిపారు.
పట్టభద్రుల ఉపాధి బాట..
హనుమకొండ ప్రాంతానికి చెందిన హరికృష్ణ, సుభాష్, ప్రదీప్ ముగ్గురు యువకులు హంటర్రోడ్ మాస్టర్జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. స్వయం ఉపాధి కోసం అన్వేషించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఈవెంట్లు తదితర శుభకార్యాల్లో కెమెరా అద్దెకు తెచ్చుకొని ఫొటోలు, వీడియోలు తీశారు. రెండేళ్లలోనే సుమారు రూ.4 లక్షలతో సొంతంగా కొత్త కెమెరా తీసుకొని నయీంనగర్లో ‘ఫొటోల అబ్బాయి’ పేరుతో స్టూడియో ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో వరంగల్ రంగంపేటలో ‘పొట్ట పెంచుకుందాం’ పేరుతో రెస్టారెంటు ప్రారంభించారు.
జైలు మండి
ఆహా..
వరంగల్ నగరంలో పాపడం, జైలు మండి, అరణ్యం, రైల్వే ప్లాట్ఫాం నెంబర్ 65, వైట్హౌస్, జమీందార్, హార్ట్స్పాట్, లేట్నైట్, సెకండ్ వైఫ్, అరిటాకు భోజనం, పచ్చి పులుసు, ప్రకృతి, పల్లె రుచులు, హాట్ కిచెన్ గురూ, నాటుకోడి.. చిట్టిగారె, నల్లిబొక్క.. మటన్ ముక్క, ఉల్టా.. పల్టా తదితర పేర్లతో భోజన ప్రియులను ఆకర్షిస్తున్నారు.
అరణ్యం హోటల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
23,57,331 మంది ఓటేశారు..!
[ 15-05-2024]
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. -
పరిహారం చెల్లించరు.. పనులు ప్రారంభించరు!
[ 15-05-2024]
రామప్ప నుంచి లక్నవరం జలాశయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం భూ సేకరణ చేయనున్న స్థలమిది. -
అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతం
[ 15-05-2024]
అందరి సహకారంతో ములుగు జిల్లాలో లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పోలింగ్ నిర్వహణపై ఆమె ప్రకటన విడుదల చేశారు. -
ప్రకటన బోర్డులు భద్రమేనా..!
[ 15-05-2024]
ఇటీవల ముంబయి మెట్రో నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈదురుగాలుల బీభత్సానికి ఘట్కోపర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం భారీ హోర్డింగ్ నేలకూలడంతో పది మందికి పైగా మరణించగా.. 80 మంది వరకు గాయపడ్డారు. -
కాస్త విశ్రాంతి..!
[ 15-05-2024]
రెండు నెలలుగా సాగిన లోక్సభ ఎన్నికల పోరులో అభ్యర్థులు తీరిక లేకుండా పనిచేశారు. ఎన్నికల షెడ్యూలు వచ్చిన నాటి నుంచి టికెట్టు కోసం పార్టీల అధిష్ఠానాలను ప్రసన్నం చేసుకోవడం, -
ఎవరి అంచనాలు వారివే..!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ సోమవారం ముగియడంతో ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. -
ఫలితం నిక్షిప్తం.. భద్రత కట్టుదిట్టం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను.. సాధారణ పరిశీలకురాలు స్వాగత్ రణ్వీర్చంద్, -
పెరిగిన వినియోగం..బిల్లుల భారం
[ 15-05-2024]
మండే ఎండలు.. భరించలేని ఉక్కపోత.. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఏప్రిల్, మే మొదటి వారంలో కరెంటు వినియోగం బాగా పెరిగింది. -
పట్టణ ఓటర్లు..పట్టించుకోలే!
[ 15-05-2024]
అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంత ఓటర్ల కంటే.. గ్రామీణుల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది.. వంద శాతం పోలింగ్ జరిగేందుకు ప్రభుత్వం పట్టణ ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా నిర్లిప్తత వీడలేదు.. -
పది విద్యార్థులకు ఆదర్శ కళాశాలల ఆహ్వానం
[ 15-05-2024]
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపి, రానున్న 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఆదర్శ కళాశాలలు ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. -
క్రాస్ ఓటింగ్.. ఎవరికి లాభమో..?
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి.. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమెంది. మూడు రాజకీయ పార్టీల నేతలు సుమారుగా నెల రోజుల పాటు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. -
ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో.. అంతంత మాత్రమే!
[ 15-05-2024]
ఓటర్లందరు ఓటు వేసేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయి. -
ఎమ్మెల్యేలతో మమేకమై పనిచేస్తా
[ 15-05-2024]
పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో తన విజయం కోసం ఎంతో కృషి చేశారని, తాను గెలిస్తే వారితో మమేకమై నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ అన్నారు. -
ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం
[ 15-05-2024]
ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ తాను రుణపడి ఉంటానని ఎంపీ, భారాస అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. -
పేరు పేరునా కృతజ్ఞతలు
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తాను ఎంపీగా విజయం సాధించాలనే లక్ష్యంతో పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు కృషి చేశారని భాజపా అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!