logo

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు.

Updated : 26 Nov 2022 17:42 IST

దెందులూరు : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. దెందులూరు మండలం గోపన్నపాలెంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అదేవిధంగా ఆయా వివరాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి దశలవారీగా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సర్పంచి నాగమల్లేశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు లీలా నవకాంతం, ఎంపీపీ సుమలత, ఎంపీటీసీ సభ్యులు ప్రభుదాసు, అంజలి, పలు శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని