logo

రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీయేను గెలిపించండి

వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా తయారైందని, భావితరాల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని సినీ హీరో నారా రోహిత్‌ అన్నారు

Published : 07 May 2024 05:56 IST

కైకలూరులో నారా రోహిత్‌, కామినేని ప్రచారం

కైకలూరు, న్యూస్‌టుడే: వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా తయారైందని, భావితరాల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని సినీ హీరో నారా రోహిత్‌ అన్నారు. కైకలూరు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కామినేని శ్రీనివాస్‌, పుట్టా మహేష్‌ యాదవ్‌ల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక ముఖ్యమంత్రి జగన్‌ అబద్దాలతోనే ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు కైకలూరు ఎన్డీయే కార్యాలయం నుంచి కామినేని శ్రీనివాస్‌తో కలిసి సంత మార్కెట్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు, తాలూకా, మాగంటి కూడలిలో ర్యాలీ నిర్వహించారు. సినీ నటులు కారుమంచి రఘు, మహేష్‌, నాయకులు త్రినాధరాజు, పూల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని