విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు.
చైతన్యబాబు (పాత చిత్రం)
పెదపాడు, న్యూస్టుడే: పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పండు చైతన్యబాబు(28) గ్రామంలోని మంతెన శివప్రసాదరాజుకు చెందిన చేపల చెరువుకు కాపలాదారుగా పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం చెరువు గట్టుపై విద్యుత్తు తీగ తెగిపడి ఉండటాన్ని గమనించక కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కొనికి వీఆర్వో అల్లు వీరవెంకట వరప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బాలసాయి (పాత చిత్రం)
ముదినేపల్లి, న్యూస్టుడే: రొయ్యల చెరువుపై పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఇది. స్థానికుల కథనం ప్రకారం.. ముదినేపల్లిలో రొయ్యల చెరువుపై కోల్కతాకు చెందిన షైపుల్లా, ముదినేపల్లి మండలం అన్నవరానికి చెందిన బొర్రా బాలసాయి(22) పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం స్విచ్ వేస్తుండగా షైపుల్లా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడ్ని కాపాడే క్రమంలో అక్కడే ఉన్న బాలసాయి దగ్గరకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందగా, షైపుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవనాడికి జవసత్వాలు
[ 17-06-2024]
వైకాపా ప్రభుత్వ అసమర్థతతో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో జవసత్వాలు రానున్నాయి. కుంటుపడిన నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. -
నిత్యం సాధన చేస్తూ.. ప్రశంసలు పొందుతూ..
[ 17-06-2024]
నిత్యం సాధన చేస్తూ.. వినూత్నంగా యోగా ప్రదర్శనలిచ్చి నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. యోగా సాధనతో లక్ష్యాలను సాధించడం, ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని నిరూపిస్తున్నారు. -
కల్తీ ఆహారం.. ప్రజారోగ్యం పణం!
[ 17-06-2024]
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమతుల్లేని దుకాణాలు.. కల్తీ ఆహారం.. నామమాత్రంగా తనిఖీలు, అరకొరగా నమూనాల సేకరణ.. ఫలితాల వెల్లడిలో జాప్యం.. వెరసి ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. -
పేదల లేఅవుట్లో ఇనుము దొంగలు!
[ 17-06-2024]
పేదల లేఅవుట్లో గుత్తేదారు నిర్మించి ఇవ్వాల్సిన ఇళ్లు పూర్తి చేయలేదు. నిర్మాణాల కోసం తీసుకొచ్చిన ఇనుము మాత్రం చోరీకి గురవుతోంది. వెలుగులు నింపేందుకు అమర్చిన విద్యుత్తు పరివర్తకాలు సైతం ఎత్తుకుపోయారు. -
సంతానం లేనివారికి దత్తత ఓ వరం!
[ 17-06-2024]
జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో సమగ్ర బాలల పరిరక్షణ సంస్థ ద్వారా ఏలూరులో శిశు గృహం నిర్వహిస్తున్నారు. అనాథలు, వివిధ కారణాలతో నిరాశ్రయులైన చిన్నారులను అక్కున చేర్చుకుని అలనాపాలనా చూస్తున్నారు. -
వచ్చేవారం నుంచే.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక!
[ 17-06-2024]
యలమంచిలి మండల కేంద్రానికి చెందిన 10 మంది లబ్ధిదారులు తమకు కేటాయించిన పేదల లేఅవుట్ శ్మశానవాటికలో ఉందని ఆయా స్థలాలను మార్చి వేరేచోట పట్టాలివ్వాలని 2023 సెప్టెంబర్లో అప్పటి కలెక్టర్ నిర్వహించిన మండలస్థాయి -
అన్నదాతలను ఆదుకోవడమే చంద్రబాబు లక్ష్యం: మంత్రి
[ 17-06-2024]
రైతాంగాన్ని ఆదుకునే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెద్దపీట వేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
హత్యకు దారి తీసిన ఘర్షణ
[ 17-06-2024]
అప్పు చెల్లించే విషయంలో జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం పడాల గ్రామం విజయదుర్గ ఆలయం పక్క రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కొప్పర్తి రాంబాబు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగాన్వేషణలో తోడుగా.. లింక్డిన్లో కొత్త ఏఐ టూల్స్
-
ఘోర రైలు ప్రమాదం.. మృతులకు రైల్వేశాఖ ఎక్స్గ్రేషియా ప్రకటన
-
విశాఖలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నలకు ఘన స్వాగతం
-
జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి: కేంద్ర న్యాయశాఖ మంత్రి
-
క్రోమ్లో కొత్త సదుపాయం.. ఆండ్రాయిడ్ యూజర్లు ఇక వెబ్ పేజీలు వినొచ్చు
-
కరెంటు షాక్ ఇచ్చి.. దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు!