భగ్గుమన్న ఉద్యోగులు!
ఉద్యోగులు, పింఛను దారులకు నష్టం చేకూర్చేలా ఉన్న 11వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు, పోలవరం, తణుకు తదితర ప్రాంతాల్లో గురువారం ఆందోళనలు,
కొయ్యలగూడెంలో ఆందోళన చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది
ఉద్యోగులు, పింఛను దారులకు నష్టం చేకూర్చేలా ఉన్న 11వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు, పోలవరం, తణుకు తదితర ప్రాంతాల్లో గురువారం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పలు చోట్ల జీవో ప్రతులకు దహనం చేశారు. పీఆర్సీల చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు. వీరికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి. - న్యూస్టుడే, నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు, పోలవరం, తణుకు
ఏలూరులో గృహ నిర్బంధంలో ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్ హరనాథ్
నాయకుల గృహ నిర్బంధం
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: కొత్త పీఆర్సీ జీవోలపై నిరసన కార్యక్రమానికి వెళ్లనీయకుండా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్ ఆర్.ఎస్. హరనాథ్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణను ఏలూరులో, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోపిమూర్తిని భీమవరంలో గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో గురువారం నిర్వహించిన ఐకాస రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వీరికి అవకాశం లేకుండా చేశారు.
కలెక్టరేట్ వద్ద ....
పోలీసుల మోహరింపు
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో పోలీసులు ఎక్కడికక్కడ మోప ారించారు. పాతబస్టాండ్ సెంటరు, తంగెళ్లమూడి, ఫైర్స్టేషన్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ వద్ద ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ఆదేశాల మేరకు ఏలూరు ఏఎస్పీ, ఏలూరు ఇన్ఛార్జి డీఎస్పీ దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగ సంఘాల నేత హరినాథ్ను ఆయన నివాసం వద్ద పోలీసులు గృహ నిర్బంధం చేయటంతో ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.
ఐటా మద్దతు
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే: ఫ్యాప్టో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడికి ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ (ఐటా) సంపూర్ణ మద్దతు తెలిపింది. ముట్టడిలో ఐటా రాష్ట్ర అధ్యక్షుడు యస్. అబ్దుల్ రజాక్, జిల్లా అధ్యక్షుడు రిజ్వాన్ అహమ్మద్, కార్యదర్శి యం.డి.ముజాహిద్ పాల్గొన్నారు.
అరెస్టులు అప్రజాస్వామికం
ఏలూరు టూ టౌన్, న్యూస్టుడే: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలటూ శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టులు చేయటం అప్రజాస్వామ్యకమని పంచాయితీరాజ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు జి శ్రీధర్ రాజు, కార్యదర్శి గోపాలకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పీఆర్సీ 2020 ప్రక్రియలో పాల్గొనొద్దు
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే: ఏపీటీఎస్ఏ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పీఆర్సీ 2020 ప్రక్రియలో ఖజానా ఉద్యోగులు పాల్గొనరాదని జిల్లా అధ్యక్షుడు యు.వి. పాండురంగారావు, కార్యదర్శి కె. సత్యనారాయణ ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర సంఘానికి మద్దతుగా ఒకే మాట ఒకే బాటగా ఉండాలని, అధికారుల నుంచి ఏవిధమైన ఒత్తిడి వచ్చిన జిల్లా నాయకత్వానికి తెలియచేయాలని కోరారు.
నరసాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద పింఛనుదారుల సంఘ సభ్యుల..
కొవ్వూరులో జీవో ప్రతుల దహనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు