అనిశా వలలో ట్రాన్స్కో జలగ!
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు.
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు
రూ.32 వేలు తీసుకుంటుండగా పట్టివేత
వెంకటరత్నం, ట్రాన్కో ఏఈ
అంగళ్లు (కురబలకోట), న్యూస్టుడే : నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు. కురబలకోట మండలంలో మంగళవారం జరిగిన ఈ ఉదంతం వివరాలను కడప ఏసీబీ డీఎస్పీ వి.గిరిధర్ మీడియాకు తెలిపారు. తెట్టు పంచాయతీ చింతపల్లెకు చెందిన మధుకర్రెడ్డి, అతని తండ్రి రాజారెడ్డి, చిన్నాన్న రఘునాథరెడ్డి రైతులు. వీరికి సర్వే నంబరు 659-2లో 14 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయ పనుల నిమిత్తం గతేడాది నవంబరు 23న రెండు విద్యుత్తు సర్వీసులకు సంబంధించి రూ.23,300 చొప్పున రూ.46,600 చెల్లించారు. కనెక్షన్లు ఇవ్వాలని అంగళ్లులోని విద్యుత్తు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేక పోయింది. ఈ క్రమంలో గట్టిగా అడిగితే లంచం ఇవ్వనిదే కనెక్షన్లు మంజూరు చేయనని ఏఈ వెంకట రత్నం చెప్పారు. రెండు కనెక్షన్లకు సంబంధించి రూ.35 వేలు లంచం డిమాండు చేయగా అంత ఇచ్చుకోలేమని బతిమాలుకున్నారు. ఇంతలో సర్దుకున్న ఏఈ ఎట్టకేలకు రూ.32 వేలకు బేరం కుదుర్చుకున్నా,రు. ఏఈ ఇచ్చిన సమాధానం చరవాణిలో రికార్డు చేసి సమాచారాన్ని కడపలోని అనిశా అధికారులను అందజేసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. వారి సూచన మేరకు అడిగిన డబ్బు ఇస్తానని, ఎక్కడికి రావాలో చెప్పాలని ఏఈకి ఫోన్ చేయించగా మంగళవారం కదిరి రోడ్డులోని ఓ కళాశాల ఎదురుగా ఉన్న టీ స్టాల్ వద్దకు రావాలని సూచించారు. దీంతో వల పన్నిన అనిశా అధికారులు డబ్బులు తీసుకుంటున్న ఏఈని అక్కడే కాపు కాసి పట్టుకున్నారు. ట్రాన్స్కో కార్యాలయానికి తరలించి విచారణ అనంతరం ఏఈపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దగ్గర పడింది
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సమయం దగ్గరపడింది. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు పూర్తిచేసింది. -
సమస్యాత్మక గ్రామాల్లో హై అలెర్ట్
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో హై అలెర్ట్ ప్రకటించారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. -
ఈదురుగాలుల భీభత్సం!
[ 03-06-2024]
జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ఉద్యాన తోటలకు అపార నష్టం వాటిల్లగా, విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలు నేలకొరగగా, రేకుల ఇళ్లు దెబ్బతిన్నాయి. -
విధుల్లో విద్యుత్తు సిబ్బంది అలసత్వం
[ 03-06-2024]
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న విద్యుత్తు సిబ్బందిపై ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. వారం వారం సమీక్షలు, వస్తున్న ఫిర్యాదులు, పరిష్కారాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. -
గ్రామీణులకు తప్పని దాహం కేకలు
[ 03-06-2024]
జిల్లాలో గ్రామ పంచాయతీలు 557 ఉండగా ఆవాస పల్లెలు 1,911 ఉన్నాయి. గ్రామాల్లో జనాభా 12,51,364 మంది ఉన్నారు. వీరికి స్వచ్ఛమైన సురక్షిత నీరు అంందించడానికి బహుళ గ్రామాల తాగునీటి పథకాలు 13, ఎంపీడబ్ల్యూఎస్ 550, పీడబ్ల్యూఎస్ 1,033, నేరుగా 1,158, చేతి పంపులు 6,715 ఉన్నాయి. -
ఏజెంట్లు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. -
ప్రభుత్వ స్థలం కబ్జా!
[ 03-06-2024]
స్థానిక కొత్తపల్లె పంచాయతీలో సామాజిక ప్రయోజనాలకు కేటాయించిన ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. -
చుట్టూ నీరు... మధ్యలో బస్టాండు
[ 03-06-2024]
చిన్నపాటి వర్షం కురిసినా కడప ఆర్టీసీ బస్టాండుకు మునిగిపోతోంది. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. -
యథేచ్ఛగా పెట్రోల్, డీజిల్ విడి విక్రయాలు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ భద్రతా చర్యలు చేపట్టింది. ఈనెల 10వ తేదీ వరకు ఎక్కడా పెట్రోల్, డీజిల్ లూజు విక్రయాలతో పాటు క్రాకర్స్ విక్రయాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. -
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 918 మంది సిబ్బంది
[ 03-06-2024]
జిల్లాలో ఈనెల 4వ తేదీ జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 918 మంది సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. -
వైకాపా పాపం.. ప్రజలకు శాపం
[ 03-06-2024]
వైకాపా ప్రభుత్వ పాపం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. బాధ్యతను గుర్తెరిగి కీలక ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
సజ్జల చెప్పారని... అలాగే చేయాలని...!
[ 03-06-2024]
ప్రభుత్వ సలహాదారు, వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భార్య గెలవాలని.. హీరో పొర్లు దండాలు: వీడియో వైరల్
-
మామిడి కాయల బస్తాల్లో తరలిస్తున్న గంజాయి పట్టివేత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
పాక్కు రహస్యాలు చేరవేసిన కేసు.. బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్కు జీవిత ఖైదు
-
బౌలర్లు అప్పుడు సత్తా చాటారు.. ఇప్పుడేం చేస్తారో?
-
20 రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏలోకి: ఎమ్మెల్యే రవి రాణా