హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి.
జగన్ పాలనలో తప్పని అవస్థలు
అమలుకాని వారాంతపు సెలవులు
న్యూస్టుడే, కడప నేరవార్తలు]
పోలీసు శాఖలో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఒకప్పుడు విధులు వేరు, ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. సీఎం జగన్ వారాంతపు సెలవులు ఇస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా అమలు కావడం లేదు. అధికారులను అడిగితే సిబ్బంది కొరత అంటూ మాట దాటవేస్తున్నారు. వివిధ రకాల రోగాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఉద్యోగానికి రాజీనామా చేస్తే రావాల్సిన బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. దీంతో అలానే విధులు నిర్వహిస్తున్నాం.
- కడపలో నగరంలోని ఓ కానిస్టేబుల్ ఆక్రోశం
విరామం లేకుండా విధులు నిర్వహించాలంటే కష్టంగా ఉంది. వారాంతంలో ఏదైన పని పెట్టుకోవచ్చు అనుకుంటే కుదరడం లేదు. అనునిత్యం విధులతో సతమతమవుతున్నాం. అత్యవసరమైతే సెలవు పెట్టుకోవాల్సి వస్తోంది. అది కూడా దొరకాలంటే కష్టంగా ఉంది. చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికైనా వారాంతపు సెలవులివ్వాలి.
- ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలోని ఓ కానిస్టేబుల్ ఆవేదన
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. 11 సర్కిల్ కార్యాలయాలు, అప్గ్రేడ్ ఠాణాలు 15, ఠాణాలు 47, ఒక సీసీఎస్, మూడు ట్రాఫిక్, ఒక దిశ ఠాణాలున్నాయి. 24 గంటలపాటు విధులు నిర్వహించే వీరికి జగన్ ప్రభుత్వంలో కష్టాలు తప్పడంలేదు. ప్రతి ఉద్యోగికి వారాంతపు సెలవు అనేది హక్కు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పోలీసులకు వారాంతపు సెలవును మంజూరు చేస్తామని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ ఆ ఊసే మరిచారు. పోలీసు సిబ్బందిని అనారోగ్యాల పాల్జేశారు. ఫలితంగా వారాంతపు సెలవుల్లేక సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతుండడమే కాకుండా రోగాల బారిన పడుతున్నారు. ట్రావెలింగ్ అలవెన్సులు, డీఏలు పూర్తిగా ఇవ్వడం లేదు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేతనాలు సక్రమంగా సమయానికి వేయకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సిబ్బంది సిబిల్ స్కోర్ దెబ్బతిని రుణాలిచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రావడం లేదు. దీనికితోడు సరెండరు లీవులు, అడిషనల్ సరెండర్ లీవులు ఇవ్వడం లేదు. తాము అధికారంలోకి వస్తూనే సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం మాట తప్పడంతో ఉద్యోగుల భవిష్యత్తుకు గ్యారెంటీ లేకుండా పోయింది. జీపీఎఫ్ రుణాలు, ఏపీజీఎల్ఐసీ రుణాలు పూర్తిగా రావడం లేదు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో మెడికల్ లీవులు కూడా తీసుకోలేని పరిస్థితి. సిబ్బందికి న్యాయపరంగా రావాల్సిన బకాయిలు కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ది రాక్షస గుణం... పేదల ప్రాణాలు పణం..!
[ 03-05-2024]
నిప్పులు చెరుగుతున్న భానుడి భగభగలతో పండుటాకులు విలవిలలాడిపోయారు... ప్రాణాలు హరిస్తున్న వడగాలులతో అల్లాడిపోయారు... భరించలేని ఉక్కపోతతో నిలువునా ఉడికిపోయారు... ఇదీ జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల వద్ద గురువారం పింఛనుదారుల దయనీయ పరిస్థితి. -
ఆ ముగ్గురు మారీచులతో కడప నాశనం!
[ 03-05-2024]
ముగ్గురు మారీచులు కలిసి కడప నగరాన్ని సర్వనాశనం చేశారంటూ తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. -
నాయకులారా... బడి దుస్థితి చూడరా
[ 03-05-2024]
మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె గ్రామంలో సుమారు 45 సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన స్థలంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభించారు. -
కొండాపురంలో రైళ్లు నిలిపేలా కృషి
[ 03-05-2024]
కొండాపురం రైల్వే నిలయంలో అన్ని రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. -
రాచమల్లుకు ఓటుతో బుద్ధి చెప్పండి
[ 03-05-2024]
రైతు కంట కన్నీరు వచ్చేలా మోసం చేసిన వారు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ కోవకే చెందిన ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదురెడ్డి రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల శనగ రైతులను మోసం చేశారని, విజ్ఞులైన ఓటర్లారా ఎమ్మెల్యేకు ఓటుతో బుద్ధి చెప్పాలని గురువారం విడుదలైన కరపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఎంపీగా షర్మిలకు, ఎమ్మెల్యేగా పుట్టాకు ఓటేయండి: డీఎల్
[ 03-05-2024]
రాష్ట్రం కోల్పోయిన ప్రత్యేక హోదా సాధనకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొట్లాడుతున్నారని, ఆమెకే ఓటు వేయాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు. -
ఒక్కఛాన్స్ అన్న జగన్... జనం పాలిట విలన్
[ 03-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ పాదయాత్రలో జనం ముందుకు వచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే వారి పాలిట విలన్గా మారారని తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి విమర్శించారు. -
ప్రచారభేరి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో దోపిడీ దొంగల ముఠాలను తయారు చేసి వనరుల విధ్వంసానికి పాల్పడిందని 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెల్లిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే పరిపాలనలో అనుభవ శీలి అయిన చంద్రబాబు మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూటమి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. -
గడికోట... ఓ భూబకాసురుడు!
[ 03-05-2024]
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఓ భూబకాసురుడని, రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో భూములను కాజేసి సుమారు రూ.200 కోట్లు కాజేశారని తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. -
తెదేపాకు గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబుకు కడపకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు