logo

తెదేపా ప్రచార రథంపై దాడి

తెదేపా కడప అసెంబ్లీ ప్రచార రథంపై అల్లరిమూక దాడికి పాల్పడింది. పార్టీ అభ్యర్థి మాధవి ప్రచార రథం కడప నగరంలోని 3వ డివిజన్‌ పరిధిలోని రామాంజనేయపురంలో ఆదివారం వెళ్తుండగా వైకాపాకు చెందిన కొందరు అడ్డుకున్నారు.

Published : 29 Apr 2024 03:58 IST

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే: తెదేపా కడప అసెంబ్లీ ప్రచార రథంపై అల్లరిమూక దాడికి పాల్పడింది. పార్టీ అభ్యర్థి మాధవి ప్రచార రథం కడప నగరంలోని 3వ డివిజన్‌ పరిధిలోని రామాంజనేయపురంలో ఆదివారం వెళ్తుండగా వైకాపాకు చెందిన కొందరు అడ్డుకున్నారు. దీంతో తెదేపా, వైకాపా వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.  ఓ వ్యక్తి ప్రచార రథంపై రాయి విసరడంతో అద్దాలు పగిలిపోయాయి. పోలీసులకు సమాచారం అందడంతో వారొచ్చి ఇరువర్గాలకు సర్దిచెప్పారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాయకుడు అమీర్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఓటమి భయంతోనే ప్రచార వాహనంపై వైకాపా నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో తెదేపాకు వస్తున్న స్పందనలో కడప ఎమ్మెల్యే కొట్టుకుపోతారని, ఆయన మూడో స్థానానికే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు