వేసవి శిక్షణ... తప్పని నిరీక్షణ!
ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది.
నిరాశతో మగ్గిపోతున్న క్రీడాకారులు
పట్టించుకోని అధికార యంత్రాంగం
ఫుట్బాల్ సాధన చేస్తున్న చిన్నారులు
ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది. ఏటా మే 1వ తేదీ నుంచి జరిగే వీటిని ఈ ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా మే 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రకటించినా ఇంతవరకు అతీగతీ లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 50 మంది వివిధ క్రీడల శిక్షకులతోపాటు క్రీడాకారులు శిబిరాల ఎప్పుడు నిర్వహిస్తారా అని నిరీక్షిస్తున్నారు. కనీసం డీఎస్ఏ నుంచి ఎలాంటి సమాచారం లేదని వారంతా వాపోతున్నారు.
న్యూస్టుడే, కడప క్రీడలు: ఎన్నికలు ముగిసినా ఎలాంటి స్పష్టత లేని కారణంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటి విధి విధానాలు సంబంధిత అధికారులకు నేటికీ అందలేదు. దీనికి తోడు పాఠశాలల్లోని ప్లే ఫీల్డ్స్ (క్రీడా మైదానాలు) అధ్వానంగా తయారయ్యాయి. శిక్షణ శిబిరాలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారనే వాటిపై స్పష్టత కరవైంది.
గత ఎన్నికలకు అడ్డురాని కోడ్ ఇప్పుడొచ్చిందా?
వేసవి శిబిరాల్లో పాల్గొనే శిక్షకుడికి గౌరవ వేతనం రూ.2 వేలు, క్రీడా సామగ్రికి రూ.6 వేలు నుంచి రూ.8 వేలు, మైదానం నిర్వహణ ఖర్చు కింద రూ.వేయి నిధులు కేటాయిస్తారు. గతేడాది ఉమ్మడి కడప జిల్లాలో వంద శిబిరాలు ఏర్పాటు చేయగా, ఈ ఏడాది వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో 50 చొప్పున శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. వీటన్నంటికీ నిధులిచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేదని క్రీడా నిపుణులు చెబుతున్నారు. 2019 సాధారణ ఎన్నికలప్పుడు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు ఎవరూ అడ్డు చెప్పలేదని, ఏటా ఈ శిబిరాలను నిర్వహించారని, ఈసారి ఎందుకు ఈ ఎన్నికల కోడ్ కారణం చెప్పి ఆటలను అడ్డుకుంటున్నారని క్రీడారంగం నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క వేసవి శిబిరాలు ఏర్పాటు చేసే ముందు జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ అధికారులు క్రీడా సంఘాల ప్రతినిధులు, ఒలింపిక్ సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంతవరకు నిర్వహించలేదు. స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఏపీ (శాప్) సౌజన్యంతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో ఏటా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించాలని వారంతా విన్నవిస్తున్నారు.
డీఎస్ఏ నిర్లక్ష్యంతో సందిగ్ధంలో క్రీడాకారులు
వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో గుర్తింపు లేని క్రీడాసంఘాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం అనేక క్రీడలకు రెండు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకున్నా ఏ సంఘానికి గుర్తింపు ఉందో, ఏ సంఘానికి లేదో కూడా చెప్పలేని దుస్థితిలో జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఉంది. కనీసం వాటి గుర్తింపు పత్రాలు సైతం సంస్థ వద్ద లేకపోవడం గమనార్హం. వేసవి శిబిరాల నిర్వహణలో ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చేయాల్సిన సూచనలు, క్రీడా ప్రణాళిక విడుదల చేయకపోవడం గమనార్హం.
అన్ని క్రీడాంశాలకు అవకాశం కల్పించాలి
నేను ఖోఖో క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు చేశాను. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అసలు శిక్షణ శిబిరం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. నానాటికీ పెరుగుతున్న వేసవి క్రీడా శిక్షణ ఆదరణకు అనుగుణంగా శిబిరాల సంఖ్యను కూడా పెంచాలి.
పవన్కుమార్, ఖోఖో
సీనియర్ క్రీడాకారుడు చర్యలు తీసుకుంటాం
ఇంతవరకు శాప్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నిధులూ మంజూరు కాలేదు. రాగానే వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తాం. లేదంటే కలెక్టర్ ద్వారా స్థానికంగా ఉన్న నిధులతోనైనా రెండు, మూడు రోజుల్లో క్రీడా శిబిరాలను నిర్వహించేవిధంగా చర్యలు తీసుకుంటాం.
జనార్దనరెడ్డి, జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు, డీఎస్ఏ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు మంచి పాలనను అందించాలి
[ 13-06-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మంచి పాలనను అందించాలని బద్వేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.డి. విజయజ్యోతి తెలిపారు. -
నవ్యాంధ్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను...’’ మాట ప్రతిధ్వనించిన అద్భుత ఘడియలవి. లక్షలాది గొంతుకల జయజయధ్వానాలు.. నవ్యాంధ్ర సారథికి మది మదినా నీరాజనాలు.. ప్రతి ఆంధ్రుడు ఎదురుచూసిన మధుర క్షణాలు... -
మొదటిసారి గెలిచి.. మంత్రిగా మెరిసి!
[ 13-06-2024]
మండిపల్లి రాంప్రసాద్రెడ్డి... ఆయనకు ఆమాత్యపదవంటూ మంగళవారం అర్ధరాత్రి దాటాక అధికారిక ప్రకటన... చక్కర్లు కొడుతున్న వార్తతో అందరిలో అనుమానాలు... అవునా? అంటూ ఆరాలు... నిజమంటూ నిర్ధారించుకున్న తర్వాత సంబరాలు... అనూహ్యమైన పరిణామాలతో ఆమాత్య పదవి కైవసం చేసుకున్న మండిపల్లికి అదృష్టం తలుపు తట్టింది. -
మోగనున్న బడి గంట!
[ 13-06-2024]
వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కొత్త విద్యాసంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 1,642 ప్రాథమిక, 142 ప్రాథమికోన్నత, 310 ఉన్నత పాఠశాలలు తెరుచుకోనున్నాయి. -
ఇంత బరితెగింపా!
[ 13-06-2024]
గత ఐదేళ్లుగా ఆక్రమణల దందా సాగించిన వైకాపా నేతలు తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. కడప నగర నడిబొడ్డున జిల్లా పరిషత్తుకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని ఏకంగా హోటల్ నిర్మాణమే చేపట్టారు. -
ఇసుక డిపోల మూసివేత!
[ 13-06-2024]
వైకాపా ప్రభుత్వంలో పెద్దఎత్తున అక్రమాలకు వేదికగా నిలిచిన ఇసుక వ్యవహారంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. -
గుర్తింపు లేని కళాశాలలపై చర్యలకు డిమాండు
[ 13-06-2024]
రాయలసీమ వ్యాప్తంగా గుర్తింపు లేని జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
నీట్లో అవకతవకలపై న్యాయ విచారణకు డిమాండు
[ 13-06-2024]
నీట్ ఫలితాల్లో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కడపలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. -
వెంకన్నతో ఆటలే... జగన్ ఓటమికి నాంది
[ 13-06-2024]
వైకుంఠ వాసుడితో ఆడిన ఆటలే జగన్ కొంపముంచాయని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
మదనపల్లె బోధనాసుపత్రిలో ఈసీటీ సేవలు
[ 13-06-2024]
మదనపల్లె ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రిలో మానసిక రోగుల కోసం ఈసీటీ విభాగాన్ని బుధవారం ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎస్ రాజు తెలిపారు. -
వైకాపా అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు
[ 13-06-2024]
గత అయిదేళ్ల పాలనలో వైకాపా అరాచకాలను ఎదుర్కొన్న ప్రజలకు అండగా ఉంటామని తంబళ్లపల్లె తెదేపా నేత జయచంద్రారెడ్డి, ట©ఎస్ఎన్వీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టా దొరస్వామినాయుడు అన్నారు. -
మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
[ 13-06-2024]
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని బుధవారం తెదేపా నాయకులు, అధికారులు, ఉద్యోగులు విజయవాడలో కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ రాక మరింత ఆలస్యం
-
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సెట్లో ప్రమాదం.. నటుడికి గాయం
-
వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు: ఏపీ మంత్రి నిమ్మల
-
మంత్రులకు శాఖల కేటాయింపు.. కొనసాగుతున్న చంద్రబాబు కసరత్తు
-
ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ నాగరాజు
-
అమెరికాతో మ్యాచ్.. స్పెషల్ గెస్ట్ చేతులమీదుగా సిరాజ్కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు