లక్ష మెజార్టీతో గెలుపు ఖాయం
ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.
రాహుల్గాంధీ సభను జయప్రదం చేయండి: మంత్రి సీతక్క
నిర్మల్ అర్బన్, న్యూస్టుడే: ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు. శనివారం నిర్మల్లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్మల్లోని క్రషర్గ్రౌండ్లో చేపట్టనున్న జనజాతర బహిరంగ సభకు పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ హాజరుకానున్నారని చెప్పారు. రాహుల్ ప్రధానమంత్రి కావడానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉమ్మడి ఆదిలాబాద్ అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మొదటిసారి ఇంద్రవెల్లికి వచ్చారని గుర్తు చేశారు. ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్లో నిర్వహించిన సభల్లో ఇచ్చిన హామీలను పార్లమెంటు ఎన్నికల్లో విజయం అనంతరం నెరవేర్చనున్నారని చెప్పారు. ఆదివాసీ ఆడబిడ్డ, ప్రజా సమస్యలపై నిర్విరామంగా పోరాటం చేసే ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. సంపద పెంచడం.. ప్రజలకు పంచడమే కాంగ్రెస్ లక్ష్యమని వెల్లడించారు. భాజపా ప్రలోభాలు, భయాందోళనలను సృష్టిస్తోందని విమర్శించారు. బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రావణ్కుమార్రెడ్డి, కార్యదర్శి సత్తు మల్లేష్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోడు భూముల్లో సాగుకు అవకాశం కల్పించాలి
[ 18-06-2024]
రైతులు సాగు చేసుకుంటున్న పొడు భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటకుండా సాగు చేసుకునేందుకు వీలు కల్పించాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామా రూపేష్ రెడ్డి కోరారు. -
వర్షం కురవాలని కప్పతల్లి ఆటలు
[ 18-06-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం ఆగ్రోస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్షం కురవాలని కప్పతల్లి ఆటలు ఆడారు. -
పోలీసు జాగిలం తారకు విధుల నుంచి విశ్రాంతి
[ 18-06-2024]
బాంబులు, మందు గుండు సామాగ్రి కనుగొనడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు జాగిలం తార మంగళవారం పదవి విరమణ చేసింది. -
రిమ్స్లో అరుదైన శస్త్రచికిత్స
[ 18-06-2024]
రిమ్స్ వైద్యులు మంగళవారం ఆరుదైన శస్త్ర చికిత్స చేశారు. అదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకాపూర్కు చెందిన రంజన(30) గత రెండేళ్లుగా కడుపు ఉబ్బి కడుపునొప్పితో బాధపడుతోంది. -
సికిల్ సెల్ అవగాహన దినోత్సవానికి ఏర్పాట్లు
[ 18-06-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో బుధవారం ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం నిర్వహించటానికి వైద్య శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
[ 18-06-2024]
జిల్లాలో సోమవారం బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
గృహజ్యోతికి దూరం.. బిల్లు భారం
[ 18-06-2024]
జిల్లాలో 2.67 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉండగా ఇందులో గృహావసరాలకు సంబంధించిన కనెక్షన్లు 2.04 లక్షలు ఉన్నాయి. -
బల్దియాలో అవిశ్వాస రాజకీయం
[ 18-06-2024]
ఆదిలాబాద్ పట్టణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వైస్ ఛైర్మన్ జహీర్ రంజానిపై అవిశ్వాసానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. -
అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్ధులకు శాపం
[ 18-06-2024]
వేసవి సెలవుల అనంతరం ప్రారంభమైన గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అసౌకర్యాలు నెలకొన్నాయి. తాగునీరు, ప్రహరీ, గదులకు మరమ్మతులు, మరుగుదొడ్లు, విద్యుత్తు సౌకర్యం కల్పించే పనులు కొన్ని చోట్ల కొనసాగుతుండగా.. -
ప్రకృతి సోయగం ఆస్వాదిస్తే ఆనందం
[ 18-06-2024]
ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో నిలదొక్కుకునేందుకు జనాలు తీవ్ర ఒత్తిడి, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకు వారు తమ జీవన శైలిని మార్చుకుంటున్నారు. -
క్రీడా పాఠశాల ఎంపికకు వేళాయె..
[ 18-06-2024]
ఆటలను కెరీర్గా చేసుకోవాలనే పిల్లలకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) సువర్ణ అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చింది. -
పులుల ఆవాసం.. కావాలి ప్లాస్టిక్ రహితం
[ 18-06-2024]
కవ్వాల్ పులులు సంరక్షణ కేంద్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తే వన్యప్రాణులకు మేలు కలుగుతుంది. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్ వరకు వెళ్లే ప్రయాణికులు, కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో ఉన్న పుణ్యక్షేత్రాల వద్దకు వెళ్లే భక్తులు విసిరివేసే ప్లాస్టిక్తో ఇబ్బందులు తప్పడం లేదు. -
ప్రత్యేక ముద్ర.. సేవల్లో ముందంజ!
[ 18-06-2024]
రెండున్నరేళ్లుగా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన కొల్లు సురేష్కుమార్.. సోమవారం సైబరాబాద్ బాలానగర్ డీసీపీగా బదిలీ అయ్యారు. -
ఎడతెగని నిరీక్షణ!
[ 18-06-2024]
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ అడుగడుగునా అవాంతరాలతో ఉత్కంఠ రేపుతోంది. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం -
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం కసరత్తు
[ 18-06-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటువైపు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఐబీలోని సమీకృత మార్కెట్ నిర్మాణ స్థలంలో తొలుత ఎంసీహెచ్ను నిర్మించాలని భావించారు. -
చెరువు మట్టి.. అక్రమంగా కొల్లగొట్టి
[ 18-06-2024]
చెరువు మట్టి తరలింపు వ్యవహారం అక్రమార్కులకు వరంగా మారింది. మండలంలోని చెరువుల్లో జేసీబీల సహాయంతో వందల ట్రాక్టర్ల మట్టి తరలిస్తూ అక్రమ సంపాదనకు కొందరు తెరలేపారు. -
చెరువు ఆక్రమణల ఆదరువు
[ 18-06-2024]
భూగర్భజలాల పెంపునకు దోహదం చేయడంతోపాటు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో నిర్మల్ను పాలించిన రాజులు తవ్వించిన చెరువుల శిఖం ఆక్రమించి కొంతమంది యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారు. -
చెట్లు కాదు.. కొమ్మలే తొలగింపు
[ 18-06-2024]
విద్యుత్తు లైన్లు, చెట్లు కలిసిపోయి గాలి వీచినప్పుడు కొమ్మలు తీగలకు రాసుకుని షార్ట్సర్క్యూట్ ఏర్పడి సరఫరాలో అంతరాయాలు తలెత్తుతుంటాయి. మైదాన ప్రాంతాల్లో తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించినంత తేలికగా అటవీ ప్రాంతాల్లో సాధ్యం కాదు. -
పసిప్రాయం.. యాచిస్తోంది
[ 18-06-2024]
కలం పట్టి అక్షరాలు రాయాల్సిన బాల్యం చేతులు చాచి యాచిస్తోంది. బడికెళ్లి విద్యాబుద్ధులు నేర్వాల్సిన చిన్నారులు యాచనకు అలవాటుపడుతున్నారు. -
భారీ వర్షం.. అన్నదాత హర్షం
[ 18-06-2024]
వరుణుడి జాడ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు భైంసా పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్మార్ట్ ఛార్జింగ్ కేస్తో జేబీఎల్ ఇయర్బడ్స్.. ధర ఎంతంటే?
-
కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..వివాదంలో కాంగ్రెస్ నేత
-
చిరంజీవికి రాజ్యసభ సీటంటూ ప్రచారం.. సుస్మిత ఏమన్నారంటే?
-
ఏపీలో సంక్షేమ పథకాలకు మళ్లీ ఒకప్పటి పేర్లు
-
‘పీఎం-కిసాన్’ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు
-
దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం