జిల్లా అభివృద్ధే సీఎం రేవంత్రెడ్డి అభిమతం
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు
నేరడిగొండ: మాట్లాడుతున్న మంత్రి సీతక్క
నేరడిగొండ, న్యూస్టుడే: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెమట తుడుచుకునే రుమాలుపై జీఎస్టీ విధిస్తూ వీధి వ్యాపారుల, పేదల పొట్ట కొడుతూ సంపదను పెద్దలకు దోచిపెడుతుందని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడె గజేందర్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, అధికార ప్రతినిధి పసుల చంటి, బోథ్ బ్లాక్ అధ్యక్షుడు ప్రపుల్చందర్రెడ్డి, మండల కన్వీనర్ వసంత్రావు తదితరులు పాల్గొన్నారు.
తలమడుగు: జడ్పీటీసీ గోక గణేశ్రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తలమడుగులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తలమడుగు పులాజీబాబా ధ్యానమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. సొనాల(బోథ్): నిర్మల్లో ఆదివారం నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడె గజేందర్ అన్నారు. సొనాలలో శనివారం ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ అరుణ్కుమార్తో కలిసి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
గుడిహత్నూర్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే గ్రామ పంచాయతీలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు దౌలత్రావు అన్నారు. మచ్చాపూర్, డొంగ్రగావ్ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నార్నూర్ : మాజీ సర్పంచి గజానంద్నాయక్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండంలోని నార్నూర్, రాజులగూడ, మాన్కాపూర్, గంగాపూర్ గోండ్గూడ, తండా, తాడిహత్నూర్, జామ్డా, గుంజాల గ్రామాల్లో తోటి నాయకులతో ప్రచారం చేశారు.
ఆదిలాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి సీతక్క అన్నారు. పట్టణంలోని ప్రజాసేవాభవన్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు మేకల మధుకర్, సంజయ్ కుమార్, డి.నాగేశ్వర్, డీఎస్పీ శర్మ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, వెంకట్ కుమార్, షేక్ మునీర్, రవీందర్, ముజాహిద్, హుస్సేన్, నరేందర్, రాము, ఇమ్రాన్, భగవాండ్లు, ప్రశాంత్, కౌశిక్, మహ్మద్ సాబీర్, సద్దాం బిన్, నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉట్నూరు గ్రామీణం: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని టీపీసీసీ ఆదివాసీ రాష్ట్ర కన్వీనర్ నాగాపూర్ మాజీ సర్పంచి సునీల్ జాదవ్ కోరారు. నాగాపూర్, ఎక్స్రోడ్, శ్యాంనాయక్తండాల్లో ‘కాళ్లు మొక్కుతా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి’ అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంద్రవెల్లి : కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ముకాడే ఉత్తం, నాయకులు ఇంద్రవెల్లిలో ప్రచారం నిర్వహించారు.
భీంపూర్: దనోర, వడూర్లలో కాంగ్రెస్ శ్రేణులు శనివారం ఇంటింటి ప్రచారం చేశాయి. మండల కన్వీనర్ అశోక్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ అర్బన్: కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి పట్టణంలోని దుర్గానగర్, శంకర్గుట్టలో ప్రచారం చేశారు.
బోథ్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. బోథ్తో పాటు పొచ్చర, కౌఠ, సొనాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆడె గజేందర్లతో కలిసి శనివారం రాత్రి ప్రచారం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బక్రీదు ప్రార్థనల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ
[ 17-06-2024]
బక్రీద్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సూచించారు. -
తాంసిలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
[ 17-06-2024]
తాంసి మండలం గోట్కూరి, వడ్డాడి, తాంసి, కప్పర్ల, పొన్నారి గ్రామాల్లో బక్రీద్ను పురస్కరించుకొని ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థన చేశారు. -
ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్ ఖాయం!
[ 17-06-2024]
చేతిలో మొబైల్ ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్లను క్లిక్ చేసుకుంటూ పోతే మన చరవాణి హ్యాక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు మన ఫోన్ నెంబరుతో ఇతరులకు సందేశాలు పంపించే ప్రమాదం ఉంది. -
కీలక సమయం.. జాగ్రత్తలే ప్రధానం
[ 17-06-2024]
వానాకాలం సీజన్ మొదలైనా వర్షాల జాడలేదు. ఏ విత్తనాలు విత్తుకోవాలి, మొక్కలను ఎలా కాపాడుకోవాలి, కలుపు మందు ఎప్పుడు పిచికారీ చేయాలి. ఎరువులు ఎలా వేయాలి, ఎంత వేయాలి, తెగుళ్ల నివారణకు ఏ మందులు వాడాలి. -
బాడుగకు కాడెడ్లు
[ 17-06-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. చాలా మంది రైతులు విత్తనాలు విత్తుకోగా, మరికొంత మంది విత్తుకునేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. యాంత్రికీకరణ పెరిగిన నేపథ్యంలో కొంతకాలంగా దుక్కులు దున్నడం, చదును చేసే పనులను అన్నదాతలు ట్రాక్టర్ల సాయంతోనే పూర్తి చేస్తున్నారు. -
కొత్త కార్డులు.. సన్న బియ్యం
[ 17-06-2024]
అర్హులందరికీ కొత్త రేషన్కార్డుల మంజూరు త్వరలోనే ఉంటుందని, దీనిపై రాష్ట్ర కేబినెట్ సమావేశంలో విధివిధానాలను రూపొందించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తాజాగా వెల్లడించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
త్యాగానికి గుర్తు ‘బక్రీద్’
[ 17-06-2024]
ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే పండగల్లో మొదటిది ఈద్ ఉల్ ఫితర్(రంజాన్). రెండోది ఈద్ ఉల్ అజా(బక్రీద్). రంజాన్లో దైవాన్ని సంతుష్ట పర్చటానికి అత్యంత కఠిన ఉపవాసాలు చేయటంతో పాటు దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. -
గొర్రెలు లేవు.. డబ్బులు వెనక్కి!
[ 17-06-2024]
గొల్ల కుర్మ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మొదటి విడత పంపిణీ సవ్యంగా జరిగినా రెండో విడతలో కొంత మందికే అందించారు. -
గోంది అటవీప్రాంతంలో పులి కదలికలు?
[ 17-06-2024]
మండలంలోని గోంది అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లలున్న ఆడ పులి అడ ప్రాజెక్టు కాలువ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకుని సమీప ప్రాంతాల్లో సంచరిస్తోంది. -
నిధులపై ఆశలు.. పరిష్కారానికి అడుగులు
[ 17-06-2024]
అనధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) పెండింగ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని ఈనెల 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై గతంలో కదలిక వచ్చినా సార్వత్రిక ఎన్నికల కారణంగా మళ్లీ మొదటికొచ్చింది. -
మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వర్షం
[ 17-06-2024]
రుతుపవనాల విస్తరణ ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు గడిచిన వారంతో పోలిస్తే క్రమంగా తగ్గుతుండటంతో జిల్లా వాసులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. -
ఏఆర్టీ కేంద్రం ఏర్పాటుకు కసరత్తు
[ 17-06-2024]
హెచ్ఐవీ బాధితులకు మంచిరోజులు వస్తున్నాయి. జిల్లాలో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్యకళాశాలతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఏఆర్టీ(యాంటీ రిట్రో వైరల్ థెరఫీ) కేంద్రం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. -
దారి కష్టాలు తీరేనా?
[ 17-06-2024]
ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వానాకాలంలో కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. గతసంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు రెంకోనివాగు పొంగిపొర్లడంతో పాఠశాలకు వెళ్లే తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. -
ప్రవేశాలకు పెరిగిన పోటీ
[ 17-06-2024]
సాధారణంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పెద్దగా పోటీ కనిపించదు. చాలా చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కొన్ని చోట్ల పాఠశాలలు ఎత్తేసే పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈవీఎంలపై మస్క్ అనుమానాలు.. శామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు
-
11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్గా విఫలమయ్యాం: బాబర్ అజామ్
-
కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!
-
నెల్లూరు జిల్లాలో కారుపై పెద్దపులి దాడి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప