ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు.
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు. ప్రధాని పర్యటనపై విమానాశ్రయ ఉద్యోగులు, వివిధ శాఖలతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనలో విధులు నిర్వహించే శాఖలకు పలు సూచనలు చేశారు. నిబంధనల మేరకు కాన్వాయ్, జిల్లా పరిధిలో పర్యటన ఏర్పాట్ల గురించి వివిధ శాఖల తొలుత ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. విమానాశ్రయంలో లైఫ్ సపోర్ట్ వైద్య సదుపాయాలు, గన్నవరం సీహెచ్సీ, డా.పిన్నమనేని వైద్యశాలలో అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. వీఐపీ లాంజ్, విద్యుత్తు సదుపాయం, ఇతర వసతుల కల్పన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని మోదీ.. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్తారు. విజయవాడ పర్యటన ముగించుకున్న అనంతరం తిరిగి విమానాశ్రయం చేరుకొని ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్తారని పేర్కొన్నారు. డీఎంహెచ్వో గీతాభాయ్, ఆర్డీవో పద్మావతి, తహసీల్దార్ పవన్కుమార్, ఏపీడీ ఎమ్ఎల్కే.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు
[ 01-06-2024]
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు
[ 01-06-2024]
నగరంలో డయేరియా మరణాలు ఆందోళనకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
మండలంలో హనుమాన్ చాలీసా పారాయణం
[ 01-06-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా నాగాయలంక మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. -
కలుషిత నీటితో 9కి చేరిన మృతుల సంఖ్య
[ 01-06-2024]
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. -
సరిలేరు మీకెవ్వరు.. సగర్వంగా పదవీ విరమణ చేసిన ఏబీవీ
[ 01-06-2024]
వైకాపా సర్కారు కుట్రపూరితంగా చేసిన అక్రమ సస్పెన్షన్పై సుదీర్ఘ న్యాయపోరాటం చేసి విజయం సాధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో సగర్వంగా పదవీ విరమణ చేశారు. -
కలల మోముపై కాలకూటం
[ 01-06-2024]
ప్రజారోగ్య పరిరక్షణ.. ప్రభుత్వ యంత్రాంగాల ప్రధాన బాధ్యత. ఎక్కడ ఏ చిన్న కష్టమొచ్చినా వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలి.. -
పైపులైన్లలో అవినీతి తప్పు..!
[ 01-06-2024]
మంచినీటి పైపులు, యూజీడీ నిర్వహణకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. పనులు అసంపూర్తిగానే మిగిలాయి. నిరుడు ఏకంగా రూ.25.48 కోట్లు ఖర్చు చేశారు. నగరంలో 1.60 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. -
విత్తనాలపై ప్రైవేటు పెత్తనం..!
[ 01-06-2024]
‘రైతులకు అన్ని రకాల సేవలందించేందుకు ప్రత్యేకంగా ఆర్బీకేలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఆధునిక పరికరాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తాం. -
నాయీబ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిపై వైకాపా వర్గీయుల దాడి
[ 01-06-2024]
తెదేపా కార్యకర్త, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిపై పాత కక్షల నేపథ్యంలో వైకాపా వర్గీయులు దాడి చేసిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యనమలకుదురుకు చెందిన దాక్షారపు సూర్యనారాయణ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. -
కార్పొరేషన్ పాపం.. తీర ప్రాంతాలకు శాపం
[ 01-06-2024]
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామలింగేశ్వరనగర్లో నిర్వహిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు(ఎస్టీపీ) ప్రభావం పెనమలూరు మండలంలో నదీ తీరప్రాంతాలపై తీవ్రంగా ఉంది. -
కాటేస్తున్న జలం
[ 01-06-2024]
విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. తీవ్ర అస్వస్థతకు గురై రోజూ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. -
ఎన్నికల నిర్వహణ ఖర్చుల వివరాలు ఇవ్వండి!
[ 01-06-2024]
పెడన నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ అధికారుల మధ్య విభేదాలకు దారి తీసింది. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన ఖర్చులను తమకు సమాచార హక్కు చట్టం కింద తెలియజేయాలని కోరుతూ... -
బైండోవర్ అతిక్రమించిన వారిపై కేసులు
[ 01-06-2024]
ఎన్నికల వేళ సత్ప్రవర్తన కలిగి ఉంటానని తహసీల్దారు కోర్టులో వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చి తిరిగి ఎన్నికల గొడవల్లో కేసులు నమోదైనవారికి జరిమానాలు, జైలు తప్పవని గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్ హెచ్చరించారు. -
విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు
[ 01-06-2024]
గ్రామాల్లో అనధికార మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది అదనపు ఆదాయానికి అలవాటు పడడంతో ఎక్కడికక్కడే గొలుసు దుకాణాలు వెలుస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్
-
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
-
మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు..
-
వాట్సప్లో ట్రేడింగ్ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా
-
క్రికెట్ VS బేస్బాల్.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్
-
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే