ఆకాశమే హద్దు!
ఆకాశమే హద్దుగా ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. చంద్రయాన్-3ని విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన ఇస్రో పలు కీలక, భారీ ప్రయోగాలు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది.
కీలక ప్రాజెక్టులపై ఇస్రో దృష్టి
ముందున్న ఆరు భారీ ప్రయోగాలు
2024లోగా పూర్తిచేసేలా అడుగులు
శ్రీహరికోట, న్యూస్టుడే: ఆకాశమే హద్దుగా ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. చంద్రయాన్-3ని విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన ఇస్రో పలు కీలక, భారీ ప్రయోగాలు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. కీలకమైన ఆదిత్య-ఎల్1ను ఆగస్టులో ప్రయోగించనుండగా వచ్చే ఏడాదిలో నిసార్, స్పాడెక్స్, మంగళయాన్-2, గగన్యాన్ తోడు శుక్రయాన్-1 ప్రయోగం చేపట్టడంపైనా దృష్టి కేంద్రీకరించారు. ఎప్పటికప్పుడు వాణిజ్య ప్రయోగాలు నిర్వహిస్తూనే కీలకమైన వీటి కోసం శాస్త్రవేత్తలు అహరం శ్రమించనున్నారు.
ఆదిత్య-ఎల్1
వచ్చేనెలలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.378 కోట్లు. ఆదిత్య-ఎల్1 సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరి-క్లాస్ ఇండియన్ సోలార్ మిషన్. అంతరిక్ష నౌకను భూమికి 1.5 మిలియన్ కి.మీ. దూరంలోని సూర్య-భూమి వ్యవస్థలోని లాంగ్రేజియన్ పాయింట్1 (ఎల్1) చుట్టూ హ్యాలో కక్ష్యలో ఉంచడానికి ప్రణాళికలు చేశారు. ఈ కక్ష్యలో ఉంచిన ఉపగ్రహం ఎటువంటి గ్రహణం లేకుండా సూర్యుడిని నిరంతరం వీక్షించే వీలుంది. ఇది సౌర కార్యకలాపాలను నిరంతరం గమనిస్తూ అధిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆదిత్య-ఎల్1లోని నాలుగు పేలోడ్లు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన మూడు పేలోడ్లు ఎల్1 వద్ద కణాలు, క్షేత్రాల అధ్యయనాలు నిర్వహిస్తాయి.
స్పాడెక్స్
2024 మూడో త్రైమాసికంలో ప్రయోగించే వీలున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.124 కోట్లు. స్పాడెక్స్ లేదా స్పేస్ డాకింగ్ ప్రయోగం.. మానవ అంతరిక్ష యానం, అంతరిక్షంలో ఉపగ్రహ సేవలు, ఇతర ప్రాక్సిమ్ కార్యకలాపాలతో అనువర్తనాల పరిధితో ఆర్బిటల్ రెండెజౌస్, డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, ఇతర సామీప్య కార్యకలాపాలకు సంబంధించిన సాంకేతికతలకు ఇస్రో అభివృద్ధి చేసిన జంట అంతరిక్ష నౌక మిషన్. ఇందులో రెండు ఐఎంఎస్ తరగతి (200 కిలోలు) ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటి ఛేజర్, మరోటి టార్గెట్. రెండు అంతరిక్ష నౌకలనూ కొద్దిగా భిన్నమైన కక్ష్యలోకి చొప్పించనున్నారు.
గగన్యాన్
ప్రాజెక్టుకు రూ.9,023 కోట్లు కేటాయించారు. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ 2024లో చేపట్టనున్నారు. ముందుగా మానవ రహిత ‘జీ1 మిషన్’ 2023 నాలుగో త్రైమాసికంలో పూర్తిచేయనున్నారు. రెండో మానవ రహిత ‘జీ2 మిషన్’ 2024 రెండో త్రైమాసికంలో చేపట్టనున్నారు. ‘హెచ్1 మిషన్’గా పిలిచే మానవ అంతరిక్ష యానాన్ని 2024 నాలుగో త్రైమాసికంలో చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
మంగళయాన్-2
2024 రెండో త్రైమాసికంలో ప్రయోగించే ఈ కీలక ప్రాజెక్టుకు రూ.600 కోట్లకు పైగా ఖర్చుకానుంది. మంగళయాన్-2 మార్స్ ఆర్బిటర్ మిషన్ భారతదేశానికి చెందిన రెండో మిషన్. ఇందులో హైపర్ స్పెక్ట్రల్ కెమెరా, హై-రిజల్యూషన్ ప్యాం క్రోమాటిక్ కెమెరా, ప్రారంభ మార్టిన్ క్రస్ట్, ఇటీవలి బసాల్ట్లు, బౌల్డర్ ఫాల్స్ను అర్థం చేసుకోవడానికి రాడార్ ఉంటాయి.
శుక్రయాన్-1
ఈ ప్రయోగానికి రూ.వెయ్యి కోట్ల వరకు అవసరమని ఇస్రో నివేదించింది. శుక్రయాన్-1గా పిలిచే ఇస్రోకు చెందిన వీనస్ మిషన్ 2024 డిసెంబరులో ప్రయోగించేలా ప్రణాళికలు రూపొందించారు. భూమి నుంచి శుక్రుడికి సరైన లాంచ్ విండోలు ప్రతి 19 నెలలకోసారి మాత్రమే అందుబాటులో ఉంటాయి. లిఫ్ట్ఆఫ్లో అవసరమైన ఇంధనం మరింత తగ్గించే అవకాశమున్న లాంచ్ విండోలు ప్రతి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఈ మిషన్ ప్రయోగానికి అవసరమైన అధికారిక ఆమోదం కోసం శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.
నాసా-ఇస్రోల నిసార్
ఈ ఉపగ్రహానికి రూ.12,296 కోట్లు కేటాయించారు. 2024 జనవరిలో ప్రయోగించే వీలుంది. నాసా, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న లో-ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీ ఇది. షార్ నుంచి ఎల్వీఎం-3 వాహకనౌక ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. ఇది 12 రోజుల్లోనే మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేస్తుంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు సహా భూపర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్ష సంపద, జీవపదార్థం, సముద్రమట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల్లో మార్పులను అర్థం చేసుకోవడానికి ప్రాదేశికంగా, తాత్కాలికంగా స్థిరమైన డేటాను అందించనుంది. నాసా ఎల్-బ్యాండ్ పేలోడ్ను, ఇస్రో ఎస్-బ్యాండ్ సార్ పేలోడ్ను సమకూరుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందజేత
[ 01-06-2024]
తిరుమల ఎస్వీ అన్నప్రసాద్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందజేశారు. -
రైలుబండి రద్దవుతోంది.. వేసవిలో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
[ 01-06-2024]
వేసవి సెలవుల్లో కీలకమైన రైళ్లు రద్దు కావడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. -
పోలీసుల ‘అధికార పక్ష’పాతం.. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా బైండోవర్లు
[ 01-06-2024]
ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. -
ప్రజలు ఏమైపోతే మనకేంటి?
[ 01-06-2024]
ప్రజలకు తాగడానికి మంచి నీటిని అందించడం మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ప్రధాన కర్తవ్యం. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ప్రజలకు తాగడానికి శుద్ధిజలాలలను అందిస్తామని చెప్పింది. -
రెచ్చిపోవద్దు.. రెచ్చగొట్టొద్దు
[ 01-06-2024]
జిల్లాలో పోలింగ్ సమయంలో వైకాపా నాయకుల దౌర్జన్యాలు, దాడులు షరామామూలుగా జరిగిన విషయం విదితమే. -
ఫీజు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు
[ 01-06-2024]
చిత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థి మార్కుల మెమో కోసం వెళ్తే ఫీజు మొత్తం చెల్లించావని, చక్కటి మార్కులు సాధించావని, ఈ నేపథ్యంలో అదనంగా మరికొంత నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
అధికారిక ఫలితాలొచ్చే వరకు సంయమనం పాటించండి
[ 01-06-2024]
ఎగ్జిట్పోల్స్ వచ్చినా.. అధికారిక ఫలితాలు వచ్చే వరకు ఓర్పు పాటించాలని, అందరూ నిబంధనలు పాటిస్తూ.. పోలీసులకు సహకరించాలని ఎస్పీ మణికంఠ చందోలు కోరారు. -
కందిపప్పు లేనట్లే
[ 01-06-2024]
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెలా బియ్యం కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేస్తున్నామని.. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప.. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులున్నాయి. -
ఏడు కంపెనీల బలగాలు.. 2,540 మంది పోలీసులు
[ 01-06-2024]
‘ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. -
శిక్షణ.. నిరీక్షణ
[ 01-06-2024]
మహిళలకు ఉన్నత విద్యను అందించడమే కాకుండా వారి అభ్యున్నతికి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ కృషి చేస్తోంది. -
నేటి నుంచి తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు
[ 01-06-2024]
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రానికి సమీపంలోని ఆకాశగంగ, శ్రీ బేడి ఆంజనేయస్వామి, జాపాలిలో శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలను శనివారం నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. -
చోరీ కేసు ఛేదించిన పోలీసులు
[ 01-06-2024]
మండల పరిధి ఊరినాయనపల్లె గ్రామంలోని చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ ప్రకటన చేయనన్న అల్లు అర్జున్
-
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
-
ఏ విషయమైనా.. ఎవరికీ అతిగా చెప్పేందుకు ప్రయత్నించను: జస్ప్రీత్ బుమ్రా
-
తెలంగాణలో 10వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్రాజ్
-
ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన యూనియన్ బ్యాంక్.. లేటెస్ట్ రేట్లు ఇవే..
-
గంభీర్ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్ చేయగలడు: గంగూలీ