పోరు.. ఖరారు
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి.
లోక్సభకు 23.. శాసనసభకు 133
నామినేషన్ల ప్రక్రియ పూర్తి
ఆయా స్థానాలకు బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు వెల్లడి
మాట్లాడుతున్న కలెక్టర్ ప్రవీణ్కుమార్, చిత్రంలో ఎస్పీ కృష్ణకాంత్ పటేల్
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. మొత్తం 18,12,980 మంది ఓటర్లు 2014 సార్వత్రిక సమరంలో తమ ఓటుహక్కు వినియోగించుకుని 156 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు.
తిరుపతి (కలెక్టరేట్), న్యూస్టుడే: జిల్లా పరిధిలో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ పర్యవేక్షణలో ఆయా నియోజకవర్గాల ఆర్వోలు పూర్తిచేశారు. సోమవారం ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్తో కలిసి కలెక్టర్ ఆ వివరాలు వెల్లడించారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి 23 మంది అభ్యర్థులు, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి 133 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు తెలిపారు. జిల్లాలో ప్రధాన నియోజకవర్గాలైన తిరుపతిలో అత్యధికంగా 46 మంది పోటీలో నిలవగా, చంద్రగిరిలో 24 మంది అభ్యర్థులు తలపడనున్నట్లు చెప్పారు. వచ్చేనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.1.51 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూస్తామన్నారు. కేంద్రం నుంచి మరో నాలుగు అదనపు భద్రతా బృందాలు రానున్నాయన్నారు.
- సర్వీసు ఓటర్ల సంఖ్య: 24,596
- 85 సంవత్సరాలు నిండిన ఓటర్లు: 7,924
- జిల్లాలోని పోలింగ్ స్టేషన్లు : 2,140
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 696
- పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన దరఖాస్తులు: 22,416
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటి ఆశలతో.. కొలువుదీరిన వేళ
[ 13-06-2024]
జగనాసుర పాలనతో రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా నవ్యాంధ్ర పరుగులిడేందుకు రంగం సిద్ధమైంది. -
అధికారుల్లో చలనం కరవు
[ 13-06-2024]
వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో తాగునీటి పైపులైన్లు మురుగునీటి కాలువల్లో ఉన్నాయని ‘ఈ నెల 1న ప్రజలకు ఏమైంతే మనకేంటి’’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. -
నవ్యాంద్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
పిల్లలు పనిలో కాదు.. బడిలో ఉండాలి
[ 13-06-2024]
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని శిక్షణ సహాయ కలెక్టర్ హిమవంశీ పిలుపునిచ్చారు. -
చంద్రోత్సాహం
[ 13-06-2024]
వీధులన్నీ జనసంద్రమయ్యాయి.. అభిమానం పోటెత్తింది.. నేతలు, కార్యకర్తలు, ప్రజలు రోడ్లెక్కి పండుగ చేశారు.. ఎక్కడికక్కడ ఎల్ఈడీ తెరలపై ప్రభుత్వ కార్యాలయాల్లో అభిమాన నేత నారా చంద్రబాబు నాయుడి నాలుగోసారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని వేకళ్ల వీక్షించారు. -
జన్మభూమి కోసం
[ 13-06-2024]
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా జన్మభూమిపై మమకారాన్ని చాటారు.. ఒక్క ఓటే కదాని ఊరుకోక, తమకెందు కులే అని బాధ్యతారాహిత్యంగా ఉండలేక వ్యయప్రయాసలకోర్చి సొంతూళ్ల బాట పట్టారు. -
ముగిసిన గంగమ్మ జాతర
[ 13-06-2024]
స్థానిక సంతపేట సమీపంలోని తిమ్మసముద్రంలో గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. ప్రజలు ఊరేగింపుగా వచ్చి గంగమ్మకు సారెను సమర్పించారు. -
ప్రమోద క్షణాలు
[ 13-06-2024]
-
రాతమారని.. ప్రభుత్వ బడులు
[ 13-06-2024]
ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల తీరు దారుణంగా ఉంది. ఈ ఏడాది సైతం అవే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నాడు-నేడు పేరిట ఐదేళ్లు గారిడీ చేయగా చాలా బడులకు తాగునీరు అందుబాటులో లేని దుస్థితి. -
తిరుమలకు సీఎం చంద్రబాబు.. ప్రొటోకాల్ పాటించని అధికారులు
[ 13-06-2024]
శ్రీవారి దర్శనం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సిమెంట్ వ్యాపారంలో అదానీ దూకుడు.. అంబుజా చేతికి పెన్నా సిమెంట్
-
ఇటలీకి పయనమైన ప్రధాని మోదీ.. మూడో హయాంలో తొలి విదేశీ పర్యటన
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ రాక మరింత ఆలస్యం
-
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సెట్లో ప్రమాదం.. నటుడికి గాయం
-
వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు: ఏపీ మంత్రి నిమ్మల