పోలీసులకు ఒక్కరోజే..!
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఎన్నికకు ఏర్పాట్లు
5 నుంచి 7 వరకు నిర్వహణ
తిరుపతి(నేరవిభాగం), న్యూస్టుడే: ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరగనుంది. జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన 26,498 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసు సిబ్బంది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అర్హులను గుర్తించి సంబంధిత ఎన్నికల అధికారులకు జాబితాను నివేదించింది. ఈనెల 5వ తేదీన పోలీసులకు, 6, 7వ తేదీల్లో ఇతర శాఖల ఉద్యోగులు పోలింగ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. విభిన్న ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసులకు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఇవ్వడంపై విమర్శలు నెలకొంటున్నాయి. అందరూ ఓటింగ్లో పాల్గొనాలంటే మూడురోజులూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద టర్న్ డ్యూటీలకు తిరుపతి జిల్లా నుంచి 20 మందిని ఒకటి రెండు రోజుల్లో పంపనున్నారు. వీరు ఓటింగ్కు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ప్రజా సేవకు అంకితం
[ 14-06-2024]
చదువుకునే రోజుల్లో దేవుడికి మొక్కు చెల్లించుకునేందుకు శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు నడిచి వచ్చే వాళ్లమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. -
పంచ సంతకాలు.. ఘన ప్రయోజనాలు
[ 14-06-2024]
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకున్న రోజే ఐదు పథకాలపై సంతకాలు చేయడంతో జనం ఉబ్బితబ్బిబవుతున్నారు. -
మోగిన బడి గంట..
[ 14-06-2024]
వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమయ్యాయి. పిల్లల కేరింతలతో పై తరగతుల్లోకి ఆడుగుపెట్టారు. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 14-06-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా గురువారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి కృష్ణతేజ అతిథిగృహం వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
ఆ సమ్మోహన శక్తి ఎవరు?
[ 14-06-2024]
జడ్పీ పూర్వ సీఈవో ప్రభాకర్రెడ్డి హయాంలో చోటుచేసుకున్న నిధుల దుర్వినియోగం విచారణ వ్యవహారం ఒక్క అడుగు ముందుకు కదల్లేదు.. లోకాయుక్త ఆదేశాలతో విచారణ అధికారిగా నియమితులైన జిల్లా ఆడిట్ అధికారి.. -
ఖరారు కాని టెండర్లు.. తొలగని వ్యర్థాలు
[ 14-06-2024]
స్థానిక మామిడి కాయల మార్కెట్ యార్డు దుర్గంధభరితంగా మారింది. దీంతో వ్యాపారులు, రైతులు, మండీ వ్యాపారులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. -
ఇంకో అవకాశం ఇస్తారా..?
[ 14-06-2024]
ఒక్క నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుందంటారు. వైకాపా నాయకుల బెదిరింపులకు భయపడి, బూటకపు హామీల్ని నమ్మి రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు ఈ సామెతను వల్లె వేస్తున్నారు. -
మోకాళ్లపై మెట్లెక్కి.. మొక్కు చెల్లించుకున్న కార్యకర్త
[ 14-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా డాక్టర్ థామస్ గెలుపొందాలని మోకాళ్లపై మెట్లు ఎక్కి మొక్కు చెల్లించుకున్నాడు మండలంలోని ఎస్ఆర్ఆర్కండ్రిగ పంచాయతీ వేపకోన గ్రామానికి చెందిన నవీన్ చౌదరి. -
చపాతి కర్రతో మోది తండ్రిని హతమార్చిన కుమార్తె
[ 14-06-2024]
తనకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం కుదిర్చారనే ఆగ్రహాంతో కన్న తండ్రిని కుమార్తే దారుణంగా హతమార్చింది. -
బుడిబడి అడుగులు
[ 14-06-2024]
వేసవి సెలవుల అనంతరం జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రభుత్వ, ప్రైవేటు బడుల తలుపులు తెరుచుకున్నాయి. -
యాప్లో సంప్రదింపులు.. ఇతర రాష్ట్రాల నుంచి యువతులు
[ 14-06-2024]
యాప్లో కస్టమర్లతో సంప్రదింపులు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి యువతులను అక్రమ రవాణా చేసే ఏజెంట్లు, ఖరీదైన స్టార్ హోటళ్లలో గదుల బుకింగ్.. ఇలా హైటెక్ విధానంలో వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నగరం పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.