ముంచేస్తున్నా.. ముందు చూపేది?
రాజమహేంద్రవరంలో రెండ్రోజుల క్రితం కురిసిన వర్షానికి ఓ లాడ్జి ముంపులో చిక్కుకుంటే అందులో వ్యక్తులను మొదటి అంతస్తులో కిటికీ నుంచి బయటకు తెచ్చారు. గత ఏడాది వర్షాల సమయంలో సుమారు నెలపాటు కొన్ని ప్రాంతాల్లో పడవల్లో జనం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి.
వరద నీటి ముంపులో కొత్త కాకినాడ కూడలి
రాజమహేంద్రవరంలో రెండ్రోజుల క్రితం కురిసిన వర్షానికి ఓ లాడ్జి ముంపులో చిక్కుకుంటే అందులో వ్యక్తులను మొదటి అంతస్తులో కిటికీ నుంచి బయటకు తెచ్చారు. గత ఏడాది వర్షాల సమయంలో సుమారు నెలపాటు కొన్ని ప్రాంతాల్లో పడవల్లో జనం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. కాకినాడలోనూ 2021లో ఇదే దుస్థితి పలుచోట్ల చోటు చేసుకుంది. గట్టిగా గంటపాటు వర్షం పడితే రెండు నగరాల్లోనూ పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకుని గంటల తరబడి జనం అవస్థలు పడుతున్నారు. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు వరద భయంతో నగరాలు వణికిపోతున్నాయి. ఏటా ముంపు వెంటాడుతున్నా.. పాలకులు, అధికారులు దీని నివారణకు శాశ్వత చర్యల దిశగా దృష్టిసారించడం లేదనే ఆవేదన జనం నోట వినిపిస్తోంది.
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్ నగరంలో శాశ్వత ముంపు నివారణకు చర్యలు చేపట్టడం లేదు. 20 నుంచి 30 మి.మీ వర్షపాతం నమోదైతే చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోతోంది. 17 ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. మేజర్, మైనర్ డ్రెయిన్లలో పూడిక పూర్తిస్థాయిలో తొలగించక చిన్నపాటి వర్షానికే ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. నగరంలో రోజూ 41.64 మిలియన్ లీటర్ల వృథా నీరు డ్రెయిన్లలోకి వెళుతోంది. భవిష్యత్తులో ఇది 52.35 మిలియన్ లీటర్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృథా నీరు సముద్రంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ముంపు చోటుచేసుకుంటోంది.
ఇలాచేస్తే..
కాకినాడ
- నగరంలోని అన్ని డ్రైయిన్ అవుట్లెట్స్ ఉప్పుటేరు కాలువలో కలుస్తున్నాయి. దీని వెంబడి కచేరిపేట, పాతబస్టాండు, ప్రేజరుపేట, వెంకటేశ్వరకాలనీ మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ముంపు తప్పించేందుకు ఉప్పుటేరుకు రక్షణ నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలి.
- 14 కి.మీ.మేర విస్తరించిన రైల్వే డ్రైయిన్ కల్వర్టులు వెడల్పు చేయాలి.
- మెయిన్ రోడ్డులో నాలుగు కల్వర్టులను 2002లో పునర్ నిర్మించారు. ఇంకా 12 కల్వర్టులు వెడల్పు చేయాలి.
- రమణయ్యపేట నుంచి ఉప్పుటేరు వరకు ఉన్న పీడబ్ల్యూడీ కాలువను మనుగడలోకి తేవాలి. ఆక్రమణలు తొలగించాలి.
- చీడీలపొర కాలువ ఆక్రమణలు తొలగించాలి.
- మెయిన్రోడ్డు, సినిమారోడ్డులో డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నీరు పారడంలేదు. అలంకరణ కోసం ప్లాట్ఫారాలు కట్టారు. వీటిలో పూడిక తొలగించాలి.
- జగన్నాథపురం బాలయోగి విగ్రహం నుంచి మహాలక్ష్మీ నగర్ మీదుగా మేజర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలి.
ప్రతిపాదన అటకెక్కి..
భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు 15 ఏళ్ల కిందట సర్వే చేశారు. సముద్ర మట్టానికి నగరం దిగువన ఉండటంతో సాధ్యపడదని తేల్చారు. పంపింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదించినా వ్యయాన్ని భరించలేమని దాన్ని పక్కన పెట్టారు.
కాలువ నిర్మాణాలు పూర్తికాక...
- ముంపు నివారణకు అమృత్ ఫేజ్-2 నిధులతో తలపెట్టిన కాలువల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. రెండేళ్ల క్రితం మొత్తం 20.36 కి.మీ మేర నిర్మించాలనే ఉద్దేశంతో పనులు చేపట్టగా ఇప్పటి వరకూ 11.84 కి.మీ మేర మాత్రమే కాలువలు పూర్తయ్యాయి.
- రైల్వే స్టేషన్ నుంచి సాయిబాబా ఆలయం వరకూ నిర్మించాల్సిన 4.2 కి.మీ కాలువ, 532 మీటర్లు మాత్రమే పూర్తి చేయగలిగారు.
- కాతేరు నుంచి నల్లా ఛానల్ అనుసంధానంగా 2.3 కి.మీ నిర్మించాల్సిన కాలువ నిర్మాణ పనులు ఆసలు ఆరంభించలేదు.
- కోటగుమ్మం నుంచి ఆవ ఛానల్ వరకూ 1.7 కి.మీ కాలువ ఇప్పటి వరకూ 250 మీటర్లు మాత్రమే పనులు జరిగాయి.
ఈ ప్రాంతాల్లో సమస్య
రాజమహేంద్రవరం
- ఛానల్కు ఆనుకొని ఉన్న ఆర్యాపురం, తుమ్మలావ, రామచంద్రరావుపేట, ఆదెమ్మదిబ్బ, జయరామ్, నటరాజ్ థియేటర్, గోకవరం బస్టాండ్ వెనుక వీధులన్నీ నీట మునిగిపోతున్నాయి. నల్లా ఛానల్ వద్ద ఎన్ఆర్సీపీ ప్లాంటు ఉన్నప్పటికీ నీటిని పంపింగ్ చేయడంలో ఆలస్యమవుతుండడమే ఇందుకు కారణం. వర్షాకాలంలో నీటి ఒత్తిడిని తట్టుకునేలా ఆర్యాపురం వద్ద చెరువు ఏర్పాటు చేయగా.. నిర్వహణ లేకపోవడం సమస్యగా మారింది.
- కంబాలచెరువు ఆధునికీకరణకు గత ఏడాది రూ.5 కోట్లతో తలపెట్టిన పనులు పూర్తికావాల్సి ఉంది.
- కోటిపల్లి బస్టాండ్, ఆల్కట్ గార్డెన్స్, రైల్వేస్టేషన్ మీదుగా అమృత్ నిధులు రూ.7 కోట్లతో ప్రధాన కాలువ నిర్మించాలని ప్రతిపాదించినా స్థలం కోసం రైల్వే శాఖకు సుమారు రూ.10 కోట్లు వరకూ చెల్లించాల్సి రావడంతో ఆగిపోయింది.
- నేతాజీనగర్, రామకృష్ణానగర్, చైతన్యనగర్, ఆవ ప్రాంతంలో ముంపు నివారణకు రూ.4 కోట్లతో పంపింగ్ కేంద్రాలు ఏర్పాటు ప్రతిపాదన టెండర్ల దశలోనే నిలిచిపోయింది.
భూగర్భ డ్రైనేజీ అవసరం
ముంపు సమస్య నివారణకు భూగర్భ కాలువ వ్యవస్థ ఏర్పాటు అవసరం. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గతంలోనే దీన్ని సూచించింది. పటిష్ఠమైన కాలువ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.ఎస్టీపీ ఏర్పాటు చేసి మురుగు నీటిని శుద్ధిచేసి భూగర్భ కాలువల ద్వారా ధవళేశ్వరం తర్వాత నదిలో కలపాలని గతంలోనే ప్రతిపాదించారు. ఇప్పటి వరకూ పాలకులు దీనిపై దృష్టి సారించడం లేదు.
పతంజలి శాస్త్రి, జాతీయ పర్యావరణ శాస్త్రవేత్త
దశలవారీగా చేస్తున్నాం...
నగరంలో ముంపు నివారణలో భాగంగా కాలువల ఆధునికీకరణకు రూ.200 కోట్లు వరకూ ఖర్చవుతుందని అంచనా వేశాం. దశల వారీ పనులు చేస్తున్నాం. ఆల్కట్ గార్డెన్స్, పేపరుమిల్లు రోడ్డు, కోరుకొండ రోడ్డు, మెయిన్ రోడ్డు మీదుగా కాలువ విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కంబాలచెరువు పార్కు పనులు చివరి దశలో ఉన్నాయి. తుమ్మలావ ప్రాంతాల్లో కాలువ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.
దినేష్కుమార్,కమిషనర్, రాజమహేంద్రవరం కార్పొరేషన్
ఏటా ఆందోళనే
ఏటా ఆగస్టు నుంచి డిసెంబరు వరకు వరద భయంతో వణికిపోతున్నాం. ఉప్పుటేరుకు సమీపంలో మా నివాసాలున్నాయి. 2021లో వచ్చిన వరదలకు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. పిల్లలకు పాలు తెచ్చుకోడానికి పడవలపై వెళ్లాల్సి వచ్చింది. తిండికి తీవ్ర ఇబ్బంది పడ్డాం. ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపాలి.
ఓలేటి ధనలక్ష్మి, ప్రేజరుపేట
అన్ని చర్యలు చేపడుతున్నాం..
ముంపు నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 44 కి.మీ మేర మేజర్ డ్రెయిన్లలో పూడిక తొలగించాం. 48వ డివిజన్లో రూ.10 లక్షలతో పూడికతీత పనులు పూర్తి చేశాం. మిగతా నిధులకు కలెక్టర్కు నివేదించాం. ఉప్పుటేరు కాలువకు రక్షణ గోడ అంశం పెండింగ్లో ఉంది. స్మార్ట్సిటీలో ప్రతిపాదనలు చేశాం. ముంపుబారిన పడుతున్న 17 ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాం.
పి.సత్యకుమారి, పర్యవేక్షక ఇంజనీరు, కాకినాడ కార్పొరేషన్
రాజమహేంద్రవరంలో ప్రధాన రహదారి సమీపంలో ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్ విజయం కోరుతూ.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి
[ 01-06-2024]
ఎన్నికల్లో పవన్కల్యాణ్ గెలవాలని కోరుతూ తూర్పుగోదావరికి చెందిన ఓ యువతి మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి స్థానికంగా ఆర్ఎంపీ వైద్యం చేస్తుంటారు. -
ఏ కాలువ చూసినా మేటలు.. మైదానాలే
[ 01-06-2024]
రైతుల కష్టాలు పట్టించుకున్నది లేదు.. సాగునీటి పారుదల వ్యవస్థ నిర్వహణపై ప్రణాళిక లేదు.. నిధులు విదిల్చిందీ లేదు.. వైకాపా ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఇది. రబీ పూర్తయిన తరువాత లాకులు, స్లూయిస్లు, ఇతర నిర్మాణాల నిర్వహణతో పాటు కాలువల్లో పూడికతీత చేపట్టాల్సి ఉన్నా విస్మరించింది. -
పింఛను సొమ్ముకు యాతన పడాల్సిందే..
[ 01-06-2024]
పింఛను కోసం ఈసారీ లబ్ధిదారులు అవస్థలు పడాల్సిన పరిస్థితే. అసలే రోహిణీ కార్తె.. ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఉండగా.. ఇలాంటి తరుణంలో బ్యాంకుల వరకు వెళ్లి పింఛను డబ్బుల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం మళ్లీ కల్పించింది. -
నిన్న కందిపప్పు.. నేడు గోధుమ పిండి
[ 01-06-2024]
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై అందించే నిత్యావసర సరకులను కుదించుకుంటూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత నెలకు గోధుమ పిండిలోనూ కోత పెట్టింది. రేషన్లో ఇచ్చేది నాలుగు రకాల సరకులే అయినప్పటికీ వాటిలో బియ్యం మినహా మిగతావి అరకొరగానే సరఫరా చేస్తూ వచ్చింది. -
ఫలితం.. ఉత్కంఠభరితం
[ 01-06-2024]
ఓటరు తీర్పు వెల్లడయ్యే రోజు సమీపిస్తోంది.. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులతోపాటు.. ఓటేసినవారిలో సైతం ఉత్కంఠ నెలకొంది. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. ఈనెల 4న ఓట్ల లెక్కింపు- ఫలితాల వెల్లడి ప్రక్రియ చేపట్టనున్న విషయం తెలిసిందే. -
నాణ్యతకు నీళ్లొదిలేశారు..
[ 01-06-2024]
నాసిరకం నీటిని విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నిర్వాహకులపై ఎట్టకేలకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఉమ్మడి జిల్లాలో ప్రమాణాలకు తిలోదకాలిస్తూ జోరుగా నీటి వ్యాపారం సాగిస్తున్న వైనంపై మే 27న ‘ఊరూవాడ జలమాఫియా’ శీర్షికన ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. -
విద్యుత్తు కోతలపై కదం తొక్కిన జనం
[ 01-06-2024]
ఓ పక్క భానుడి భగభగలతో జనం అల్లాడుతుంటే మరోపక్క విద్యుత్తు కోతలతో విలవిల్లాడుతున్నారు. విద్యుత్తు కోతలపై జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రజలు కదం తొక్కారు. వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలంలో చాలా గ్రామాలకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరఫరా నిలిచిపోయింది. -
మండుటెండకు మరెందరు బలికావాలో..?
[ 01-06-2024]
ప్రతి నెలా ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా.. పింఛను డబ్బుతో మందులు, నిత్యావసరాలు కొనుక్కోవాలని ఆశగా ఎదురుచూసే పండుటాకులకు ఈ నెల కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. సామాజిక భద్రతా పింఛను డబ్బులు తీసుకునేందుకు రెండు నెలలుగా లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
చౌకబారు మాటలు.. పేదల కడుపుమాడ్చే చేతలు
[ 01-06-2024]
పేదల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని గొప్పలు చెప్పుకొన్న జగన్మోహన్రెడ్డి సర్కారు పేదలకు అందించే నిత్యావసరాల్లో కోతలు విధిస్తూ వారిపై ఆర్థిక భారం మోపింది. -
పొగాకు వినియోగం క్యాన్సర్కు కారకం
[ 01-06-2024]
ఏటా క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారిలో 25 శాతం మంది పొగాకు వినియోగదారులే ఉంటున్నారని డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి తెలిపారు. శుక్రవారం అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పొగాకు వినియోగ వ్యతిరేక దినం నిర్వహించారు. -
గోధుమపిండికి ఎగనామం
[ 01-06-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల పాలన ముగింపు దశకు వచ్చినా రేషన్ సరకుల పంపిణీలో కోతలు విధిస్తూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో చౌక దుకాణాల ద్వారా 14 సరకులను పంపిణీ చేయగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక మూడు సరకులకే పరిమితం చేశారు. -
నిప్పులుచెరిగే ఎండలో బ్యాంకులకు వెళ్లాల్సిందే..!
[ 01-06-2024]
రోహిణ కార్తెతో ఎండలు మండుతున్నాయి. కాకినాడ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్న సమయాల్లో వృద్ధులు, నడివయస్కులు, దివ్యాంగులు పింఛను కోసం ఇంటి నుంచి బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. -
తెలుగుతల్లి.. తల్లడిల్లి..
[ 01-06-2024]
పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. మహామహులకు విద్యనందించిన ఈ సాహిత్య పీఠం ఉనికిని కాపాడుకోవడానికి నానాపాట్లు పడుతోంది. -
ఉష్.. ఉక్కిరిబిక్కిరి
[ 01-06-2024]
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కబోతతో ప్రజల ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి 7 దాటినా వేడి గాలులు వీస్తునే ఉన్నాయి. చిన్నారులు, వృద్ధులతోపాటు బయట తిరిగేవారు డీహైడ్రేషన్, వడదెబ్బకు గురై అనారోగ్యం బారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!
-
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం
-
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
-
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవచ్చు : కాంగ్రెస్ వర్గాలు
-
ధోనీ స్క్వాడ్ అలా.. రోహిత్ సేన ఇలా..