అయిదేళ్లూ.. మద్యం ఏరులై పారించారు..
ఎక్కడా బెల్టుషాపు లేకుండా చేస్తాం.. ఒక్క అవకాశమిస్తే పూర్తిగా మద్యం నిషేధించి 2024లో మళ్లీ ఓటు ఆడిగేందుకు మీ ముందుకు వస్తానని జగన్మోహన్రెడ్డి ఆనాడు అన్నారు.. రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లందరూ ఆదంతా వాస్తవమనుకున్నారు.
పోలీసు అధికారులకు పట్టుబడిన సారా (పాతచిత్రం)
మాట తప్పను.. మడమ తిప్పను.. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్రంలో పూర్తిగా మద్యం లేకుండా చేస్తాను..
ఇదీ 2019 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్రెడ్డి ప్రతి సభలోనూ చెప్పిన మాటలు
న్యూస్టుడే, రాజమహేంద్రవరం నేరవార్తలు
ఎక్కడా బెల్టుషాపు లేకుండా చేస్తాం.. ఒక్క అవకాశమిస్తే పూర్తిగా మద్యం నిషేధించి 2024లో మళ్లీ ఓటు ఆడిగేందుకు మీ ముందుకు వస్తానని జగన్మోహన్రెడ్డి ఆనాడు అన్నారు.. రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లందరూ ఆదంతా వాస్తవమనుకున్నారు. ఐదేళ్లు గడిస్తేగాని వాస్తవం అర్థంకాలేదు.. ప్రభుత్వంలోకి వచ్చాక.. దశలవారీగా మద్యపాన నిషేధమన్నారు.. పైగా ధరలు పెంచి మద్యానికి దూరం చేస్తామని కొత్తభాష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి కేవలం అయిదు నక్షత్రాల హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏరులై పారుతోంది. అన్నిచోట్లా విరివిగా దుకాణాలు, బార్లు వెలిశాయి. ఏ వీధిలో చూసినా బెల్టు షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అసలు బ్రాండ్లను తరిమేసి వింత పేర్లతో కొత్తకొత్త రకాలు తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇష్టానుసారం ధరలు పెంచి రోజువారీ కూలీలు, సామాన్యుల వెన్ను విరిచారు. కల్తీమద్యం అమ్మకాలకు అనుమతులిచ్చి మధ్యతరగతి ప్రజానీకాన్ని అనారోగ్యం పాల్జేశారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని ఒక్కో సీసాపై మూడింతల ధర పెంచారు. మద్యనిషేధ]ం మాట దేవుడెరుగు.. జగన్ సర్కారుకు అదే ప్రధాన వనరుగా మారిపోయింది.
అబ్కారీని కాదని.. సెబ్ ఏర్పాటు..
మద్యం అక్రమ రవాణా నియంత్రణకు రాష్ట్రంలో అబ్కారీ(ఎక్సైజ్) శాఖ ఉంది. దానిని కాదని ప్రభుత్వం సెబ్ ఏర్పాటు చేసింది. రెండు శాఖలు సమన్వయంతో పనిచేసినా అక్రమ రవాణా నియంత్రించలేకపోయారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాల్లో పలు రకాలు విక్రయిస్తుండగా.. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో నాసిరకాన్ని కూడా కల్తీచేసి ప్రాణాలతో చలగాటం మాడుతున్నారు. జిల్లాలో గత నాలుగు నెలలుగా చేసిన దాడుల్లో 1400 పైగా కేసులు నమోదు చేసి వేల లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నారు. సారాబట్టీలకు కొదవే లేదు. రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలోని ఒకప్పుడు లంకలకే పరిమితమైన సారాబట్టీలు నేడు పిడింగొయ్యి, హుకుంపేట గ్రామ శివారుల్లో వెలిశాయి నగరంలోని పాతసోమాలమ్మ గుడి, మేదరపేట ప్రాంతాల్లో సారా ఏరులై పారుతోంది. ఆయా ప్రాంతాల్లో నిత్యం ఒకరిద్దరు.. మద్యంతోనో, సారాతోను పోలీసులకు పట్టుబడుతుంటారు. దీని నియంత్రణకు చేస్తున్న ప్రయాత్నాలన్నీ నీరుగారిపోతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీరు రాదు.. నారు పడదు!
[ 18-06-2024]
ప్రకృతి విపత్తులు.. వరదల నుంచి పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని కొన్నేళ్లుగా యంత్రాంగం చెబుతున్నా ఆ దిశగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదు. వైకాపా అయిదేళ్ల పాలనలో కాలువల నిర్వహణ ఊసేలేదు. -
వెంకన్న పరిణయం.. భక్తజన పరవశం
[ 18-06-2024]
దివ్య మనోహరమూర్తిని చూసి నింగీనేలా మురిసింది. భక్తజనం గోవిందనామస్మరణతో ఆ ప్రాంతం వైకుంఠాన్ని తలపించింది. -
అసంపూర్తి పనులతో పిట్ అప్పగింత
[ 18-06-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లోని రెండవ నంబరు ప్లాట్ఫామ్ ఆధునికీకరణ పనులు పూర్తికాకుండానే సంబంధిత రైల్వే ఇంజినీరింగ్ అధికారులు పిట్ అప్పగించేశారు. రెండోసారి గడువు కూడా ముగిసినప్పటికీ ఇక్కడ పనులు అసంపూర్తిగానే మిగిలాయి. -
వరదలొస్తేనే ఎత్తిపోతలు!
[ 18-06-2024]
గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎగువ ప్రాంతంలో జరిగే పోలవరం ప్రాజెక్టు పనుల వల్ల ఎత్తిపోతల పథకాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జలవనరులశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. -
వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను పరిష్కరిస్తాం: పురందేశ్వరి
[ 18-06-2024]
ఉత్తరాది నల్లరేగడి నేలల్లో సాగుచేసే వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని, దిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హామీ ఇచ్చారు. -
రామోజీ సేవలు చిరస్మరణీయం
[ 18-06-2024]
కేబుల్ రంగంలో రామోజీరావు సేవలు మరవలేనివని రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు అన్నారు. -
రాజమహేంద్రికి ‘భారత్ గౌరవ్’ రైలు
[ 18-06-2024]
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో అయోధ్య-కాశీ యాత్ర పేరిట ఈ నెల 8న సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన భారత్ గౌరవ్ పర్యాటక రైలు పది రోజుల యాత్రను ముగించుకుని తిరిగొచ్చింది. -
పోలవరం గట్లకు అక్రమార్కుల తూట్లు
[ 18-06-2024]
పోలవరం కాలువ గట్లను కొల్లగొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. సెలవుదినాలు, రాత్రివేళల్లో యథేచ్ఛగా గ్రావెల్ను తరలిస్తున్నారు. కళ్లెదుటే కాలువగట్లు మాయమవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. -
పేదోడి పేరు చెప్పి.. పెద్దలు దోచేశారు
[ 18-06-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో పేదోడి పేరు చెప్పి వైకాపా పెద్దలు భారీగా అవినీతికి పాల్పడ్డారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అరోపించారు. -
అయిదేళ్లూ.. దోచేశారు
[ 18-06-2024]
వైకాపా అయిదేళ్లపాలనలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి తవ్వకాల్లో చేసిన అవినీతిదందా అంతా ఇంతాకాదు... ‘ఈనాడు’ పలు కథనాల ద్వారా అక్రమ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చినా కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు స్పందించిన పాపాన పోలేదు. -
మాజీ మంత్రి వేణు ఆధ్వర్యంలో..భీమేశ్వరాలయంలో భారీగా అవినీతి
[ 18-06-2024]
రాష్ట్ర మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ద్రాక్షారామ భీమేశ్వరాయంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఇందుకు సహకరించిన ఏ ఒక్కరూ ఆలయంలో ఉండరని ఆయన హెచ్చరించారు. -
వైకాపా బడాయి.. రైతన్నకు బకాయి..
[ 18-06-2024]
అన్నదాతలకు సాగుకోసం అవసరమైన అన్ని వసతులు కల్పించామని, వారు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గొప్పలు చెప్పిన వైకాపా సర్కారు రైతులు అమ్మిన ధాన్యానికి సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేసి చాపచుట్టేసింది. -
పోలవరానికి పునరంకితం
[ 18-06-2024]
‘పోలవరం ఆంధ్రుల జీవనాడి..దీని ద్వారా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తా..ప్రాజెక్టు నాకు ప్రాణంతో సమానం’ అంటూ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించడంతో పోలవరానికి పూర్వవైభవం రానుందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ ఐసీయూలో పేలిన వెంటిలేటర్ బ్యాటరీ..
-
ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణలో మార్పులు
-
నాలెడ్జ్ సిటీలో పోకిరీల ఆగడాలు.. బైకులతో పోలీసులను ఢీకొట్టేందుకు యత్నం
-
దేశమంతా చంద్రబాబు వైపు చూస్తోంది: కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
-
రుషికొండపై వైకాపా కుప్పిగంతులు!
-
రుషికొండ ప్యాలెస్ గుట్టు బయటపెడతాం: మంత్రి నారా లోకేశ్