AP News: ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. నా భార్య వదిలేసి వెళ్లిపోయింది..
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో ఉన్న తనని కాదని మొహంచాటేసి వెళ్లిపోయిందని గుంటూరుకు చెందిన బాధితుడు సోమవారం అర్బన్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఆమె తన వెంట తీసుకెళ్లిన తన కుమార్తెను
భార్యపై భర్త ఫిర్యాదు
నెహ్రూనగర్, న్యూస్టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో ఉన్న తనని కాదని మొహం చాటేసి వెళ్లిపోయిందని గుంటూరుకు చెందిన బాధితుడు సోమవారం అర్బన్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఆమె తన వెంట తీసుకెళ్లిన తన కుమార్తెను అప్పగించాలని కోరాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ‘2001లో ఓ ఫైనాన్స్ కన్సల్టెంట్ కంపెనీ పెట్టి వ్యాపారం చేశాను. ఆ సమయంలో ఓ మహిళ పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకుంది. మాకు పాప జన్మించింది. నేను ఆదాయపు పన్ను చెల్లింపుదారుడిని కావడంతో వాటి ఆధారంగా ఆమె తన తమ్ముడికి ఓ బ్యాంకులో రూ. 48 లక్షలు రుణం తీసుకొని చెల్లించలేదు. 2013లో నాకు పక్షవాతం వచ్చింది. దీంతో ఏ వ్యాపారం చేయలేకపోయాను. ఆమె ఓ ప్రభుత్వశాఖలో పని చేస్తుంది. 2016లో వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ నా కుమార్తెను తీసుకొని వెళ్లిపోయింది. నన్ను చూసుకోవటానికి నా అన్నవాళ్లు ఎవరూ లేరు. నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. ఆమెతో విడాకులు ఇప్పించి నా కుమార్తెను ఇప్పించాలని కోరాను’ అని పేర్కొన్నారు. సదరు ఫిర్యాదుపై అధికారులు విచారణకు ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు