Bengaluru vs Gujarat: దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
ఐపీఎల్-2024లో బెంగళూరు జట్టుకు హ్యాట్రిక్ విన్. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బెంగళూరు: ఐపీఎల్-2024లో బెంగళూరు హ్యాట్రిక్ విజయం సాధించింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. 148 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు.. 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది బెంగళూరు. కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు) విధ్వంసం సృష్టించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో జోష్ లిటిల్ 4, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.
డుప్లెసిస్ విధ్వంసం.. వరుస వికెట్లతో ఉత్కంఠ
లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు అదిరే ఆరంభం లభించింది. మోహిత్ శర్మ వేసిన తొలి ఓవర్లో రెండు, చివరి బంతులను విరాట్ కోహ్లీ స్టాండ్స్లోకి పంపాడు. తర్వాత డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లిటిల్ వేసిన రెండో ఓవర్లో వరుసగా 4, 4, 6, 2, 0, 4 బాదేసి 20 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో వరుసగా 4,6 కొట్టాడు. ఈ క్రమంలోనే 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లిటిల్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన డుప్లెసిస్.. అదే ఓవర్లో ఐదో బంతికి షారుక్ ఖాన్కు క్యాచ్ ఇచ్చాడు.డుప్లెసిస్ ఔటైన తర్వాత మ్యాచ్ మలుపులు తిరిగింది. బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ నెలకొంది. విల్ జాక్స్ (1), రజత్ పటిదార్ (2), కామెరూన్ గ్రీన్ (1), గ్లెన్ మ్యాక్స్వెల్ (4) పెవిలియన్కు క్యూ కట్టారు. కాసేపటికే కోహ్లీ కూడా వెనుదిరిగాడు. ఈ దశలో దినేశ్ కార్తిక్ (21; 12 బంతుల్లో 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (15; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఆదుకున్న షారుక్, మిల్లర్..
గుజరాత్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లు వృద్ధిమాన్ సాహా (1), శుభ్మన్ గిల్ (2), సాయి సుదర్శన్ (6) సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యారు. 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్ను షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో 3 ఫోర్లు. 2 సిక్స్లు), రాహుల్ తెవాటియా (35; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. రాహుల్ తెవాటియా (35; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమై స్కోరు చేసింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టారు.కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్లకు తలో వికెట్ దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!