అభ్యర్థులను చూసి ఓటు వేయండి
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.
తెలంగాణచౌక్ (కరీంనగర్), న్యూస్టుడే: కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లో ఎంపీ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులు సంజయ్ సమక్షంలో భాజపాలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియదని, అలాంటి అభ్యర్థికి ఎవరు ఓటు వేస్తారని సంజయ్ ప్రశ్నించారు. ఇక భారాస పార్టీ పోటీయే కాదని ఆరోపించారు. మూడు పార్టీల అభ్యర్థులను బేరీజు వేసి, ప్రజల కోసం ఎవరు కొట్లాడతారో, ఎవరు అభివృద్ధి చేస్తారో చూసి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. విద్యార్థులు, యువత, రైతులు, ఇలా వివిధ వర్గాల సమస్యలపై పోరాటం చేశానని చెప్పారు.ప్రజా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లి వచ్చానన్నారు. మరో వైపు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల నిధులు తెచ్చానని అన్నారు. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని స్పష్టం చేశారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భాజపాను గెలిపించాలని కోరారు. సాయంత్రం కమలాపూర్లో సీతారామచంద్ర స్వామి రథోత్స వంలో పాల్గొని, పట్టు వస్త్రాలు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు