సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
చిప్ప శ్రీను మృతదేహం
ఇల్లెందు గ్రామీణం, న్యూస్టుడే: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సీఐ కరుణాకర్ తెలిపిన ప్రకారం.. వజ్జవారిగుంపు గ్రామానికి కొన్నేళ్ల క్రితం సుజాత అనే మహిళ తన భర్తతో కలిసి వచ్చింది. వీరికి ఓ కుమార్తె. భర్త కొన్నేళ్ల క్రితం ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్న చిప్ప శ్రీను(43)తో ఆమె మూడేళ్లుగా సహజీవనం సాగిస్తోంది. కొన్ని రోజులుగా శ్రీను మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి గొడవ జరిగింది. అనంతరం శ్రీను మెడకు సునీత తాడు బిగించి హత్యచేసింది. ఘర్షణ క్రమంలో తాను నెట్టేయటంతో ప్రమాదవశాత్తు తలకు మంచం తగిలి చనిపోయినట్టు సుజాత నమ్మబలికింది. దీనిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి గురువారం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో శవపరీక్ష నిర్వహించారు. చెవికి గాయంతోపాటు మెడకు తాడు బిగించిన ఆనవాళ్లు గుర్తించారు. పోలీసుల విచారణతో ఎట్టకేలకు తానే హత్యచేసినట్టు సునీత అంగీకరించింది. శ్రీను కుటుంబీకుల వివరాలు తెలియరాలేదు. ఆధార్ కార్డులో కొత్తగూడెం వాసి అని ఉంది. అక్కడ విచారించినా సంబంధీకుల వివరాలు తెలియకపోవటంతో శవపరీక్ష అనంతరం సుదిమళ్ల కార్యదర్శి మహ్మద్ అజాహర్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది శ్రీను అంత్యక్రియలు నిర్వహించారు.
అస్వస్థతతో లారీలోనే ప్రాణాలొదిలిన డ్రైవర్
పాల్వంచ గ్రామీణం, న్యూస్టుడే: లారీ డ్రైవర్పై మృతిపై గ్రామీణం ఠాణాలో గురువారం కేసు నమోదైంది. రాజస్థాన్ రాష్ట్రం నసీరాబాద్ తాలుకా లవేరా గ్రామానికి చెందిన మహావీర్ ప్రసాద్ (58) లారీ డ్రైవర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్గఢ్ నుంచి తమిళనాడులోని నైవేలికి రైలు పట్టాలను ట్రక్కులో లోడు చేసుకుని ఏప్రిల్ 26న బయలుదేరాడు. గత నెల 30న పాల్వంచ మండలం కేశవాపురం చేరుకున్నాడు. అదే రోజు రాత్రి స్థానికంగా లారీని నిలిపి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై 10 గంటల సమయంలో లారీలోనే ప్రాణాలు విడిచాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారొచ్చి మృతదేహాన్ని పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువులు గురువారం మృతదేహాన్ని తీసుకెళ్లారు. వారి ఫిర్యాదుతో గ్రామీణం ఏఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ మృతికి వడదెబ్బ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్కారు బడుల తడబాటు..!
[ 14-06-2024]
బడులు తెరిచే రోజు పండగ వాతావరణం కల్పిస్తాం.. పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం.. ఇందుకోసం సంసిద్ధత కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం.. బడులు లేని గ్రామాలు ఉండవు.. విద్యార్థులకు సకల వసతులు సమకూర్చుతామని అధికారులు పదేపదే చెప్పినా ఆచరణలో విఫలమయ్యారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. -
గోదావరి జలాలతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం
[ 14-06-2024]
గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను సస్యశ్యామలం చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటిపారు దలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరందించటానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. -
రైతులకు న్యాయం చేస్తాం: మంత్రులు
[ 14-06-2024]
సీతారామ ప్రాజెక్టు అనుసంధాన కాలువ భూనిర్వాసితులు ఏ ఒక్కరూ నష్టపోకుండా నీళ్లు రాకముందే అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
‘ఆశా కార్యకర్తలకు పరీక్షలు నిర్వహించొద్దు’
[ 14-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు పరీక్షలు నిర్వహించాలని యోచించటం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మా విష్ణువర్ధన్, కల్యాణం వెంకటేశ్వరరావు అన్నారు. -
మదింపుపై రెట్టింపు సన్నద్ధం
[ 14-06-2024]
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబడి పెరగాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయ భూములు, ప్లాట్లు, స్థలాల మార్కెట్ విలువ పెంచాలని, తద్వారా రిజిస్ట్రేషన్ల సమయంలో ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది. -
2.44 కుటుంబాలకు గృహ జ్యోతి
[ 14-06-2024]
వేసవి అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్తు వినియోగం గత మూడు నెలల్లో ఎక్కువగా ఉంది. అందుకే జీరో బిల్లు పొందే వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. వాతావరణం చల్లబడటంతో జూన్ నుంచి జీరో బిల్లు పొందేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. -
పాత ఇంటికి ‘వంద’నం
[ 14-06-2024]
అది ఓ చిన్న పల్లెటూరు.. ఇప్పటికే చాలా మంది పాతతరం నాటి ఇళ్లను ఖాళీ చేసి వారి పిల్లలు ఉద్యోగాలు చేస్తున్న చోటకు వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
అరుదైన దాతలు
[ 14-06-2024]
రక్తం.. మానవ శరీరం కోల్పోయినా, తగ్గిపోయినా, పాడైపోయినా దాని విలువ నిండు ప్రాణం.. రక్తం పంచుకుని పుట్టకున్నా ఆపదలో ఉన్నవారికి రక్తం పంచి, వారి ఆయువును పెంచే మహదవకాశం మనకే.. మనుషులకే ఉంది.. అందుకే రక్తదాతను ‘ప్రాణదాత’కు పర్యాయపదంగా పిలుస్తాô. -
పూసుగుప్ప అడవుల్లో బూబీట్రాప్స్ వెలికితీత
[ 14-06-2024]
చర్ల మండలంలోని మారుమూల పూసుగుప్ప అడవుల్లో భద్రతా బలగాలు మరోమారు మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీట్రాప్స్ను గుర్తించి వెలికితీశారు. ఈనెల 10వ తేదీన ఇక్కడి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, చర్ల పోలీసులు పెద్దఎత్తున బూబీట్రాప్స్ను గుర్తించి వెలికితీసిన విషయం తెలిసిందే. -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. మహిళ దుర్మరణం
[ 14-06-2024]
పెళ్లి వేడుకకు వెళ్లి సంతోషంగా తిరిగొస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పాల్వంచ మండలంలోని మొండికట్ట వద్ద ఓ మూలమలుపులో సంఘటన చోటుచేసుకుంది. -
అటకెక్కిన కరకట్టల నిర్మాణం
[ 14-06-2024]
గోదావరి పరివాహకంలోని గ్రామాలకు ముంపు ముప్పు నివారణకు తలపెట్టిన కరకట్టల నిర్మాణం అటకెక్కింది. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల పరిధిలో గోదావరికి రెండువైపులా కరకట్టల నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.