పొరపాటుతో స్వతంత్రం.. తారుమారు
చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి కేఎస్ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది.
2004లో మారిన సమీకరణలు
నాగర్కర్నూల్, న్యూస్టుడే : చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి కేఎస్ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది. దీంతో పరిస్థితులు అనుకూలించకుండా పోయాయి. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్, తెరాస పొత్తులో భాగంగా కలిసి పోటీ చేశాయి. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని తెరాసకు కేటాయించారు. తెరాస అభ్యర్థిగా కేఎస్ రత్నంను కేటాయించారు. బీఫాంను తీసుకొచ్చిన కేఎస్ రత్నం ఎవరైనా ఎత్తుకెళ్తారనే భయంతో తన కూతురి బ్యాగ్లో ఉంచారు. ఈ క్రమంలోనే బీఫాం జత చేయకుండా ఒకటి పార్టీ తరఫున, మరోటి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశాడు. బీఫాం జత చేయటం మరిచిపోయినట్లుగా గుర్తించి తర్వాత బీఫాంను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇవ్వడానికి వెళ్లాడు. అప్పటికే సమయం దాటిపోయిందని తీసుకోలేదు. పార్టీ తరఫున వేసిన నామినేషన్ను తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ను ఆమోదించారు. తప్పని పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగానే రంగంలోనే నిలువాల్సి వచ్చింది. టెంకాయ గుర్తుతో ప్రచారం చేశారు. అదే గుర్తుకు ఓటు వేయాలని కేసీఆర్, తెరాస నాయకులు అప్పట్లో ప్రచారం చేశారు. కేఎస్ రత్నంకు 3,05,396 ఓట్లు వచ్చాయి. తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మంద జగన్నాథం 99,650 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మరో స్వతంత్ర అభ్యర్థికి అధికంగా ఓట్లు..: 2004లో ఎన్నికల్లోనే మరో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన భగవంతుకు ఊహించకుండా భారీగా ఓట్లు వచ్చాయి. భగవంతు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న భగవంతుకు విమానం గుర్తు కేటాయించారు. అదే సమయంలో కొల్లాపూర్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులను అక్కడ నిలుపలేదు. కాంగ్రెస్ టిక్కెట్లు దక్కకపోవడంతో కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు, పరిగిలో హరీశ్వర్రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. వారిద్దరికి విమానం గుర్తు వచ్చింది. అసెంబ్లీకి ఒక గుర్తుకు, పార్లమెంటుకు మరో గుర్తుకు వేయాలని చెబితే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి, పార్లమెంటుకు విమానం గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేసుకున్నారు. దీంతో లోక్సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన భగవంతుకు 1,19,813 ఓట్లు వచ్చాయి. ఫలితాల తర్వాత స్వతంత్ర అభ్యర్థికి భారీగా ఓట్లు వచ్చాయని ఆశ్చర్యం వ్యక్తమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి: డీకే అరుణ
[ 16-06-2024]
పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. -
పాలమూరుకు కొత్త పాలనాధికారులు
[ 16-06-2024]
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఐఏఎస్ల బదిలీల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ఆయా జిల్లాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఏఎస్ అధికారులు కలెక్టర్లుగా వస్తున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
నాన్నా వందనం.. విజయం నీకంకితం!
[ 16-06-2024]
తల్లి బిడ్డను నవమాసాలు మోస్తే.. తండ్రి పాతికేళ్లు మోస్తాడు. కలలో, మెలకువలో పిల్లల గురించే ఆలోచిస్తాడు. సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఎంత ఖర్చయినా భరిస్తాడు. -
జనరంజకంగా ప్రజాపాలన
[ 16-06-2024]
రాష్ట్రంలో ప్రజాపాలన జనరంజకంగా కొనసాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పర్యటించారు. -
చిన్నపొర్ల ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 16-06-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. చిన్నపొర్ల ఘటనకు సంబంధించి శనివారం ఆయన ఇక్కడ ఠాణా వద్ద విలేకరులతో మాట్లాడారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన మహబూబ్నగర్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఠాణా ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన తౌసిఫ్ అన్వర్ అలీ(20) దేవరకద్ర సమీపంలోని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. -
భవనాలు శిథిలం.. సమస్యలు అనేకం
[ 16-06-2024]
భాషాభివృద్ధికి, స్వాతంత్య్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన గ్రంథాలయాలు అవసాన దశకు చేరుతున్నాయి. రెండు దశాబ్దాలుగా లైబ్రేరియన్ల నియామకం లేకపోవడంతో జిల్లాలో ఉన్న ఒకరిద్దరికి మూడు, నాలుగు గ్రంథాలయాలకు ఇన్ఛార్జిలుగా నియమించారు. -
సీట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ
[ 16-06-2024]
ఈ చిత్రం శనివారం మధ్యాహ్నం ధన్వాడ కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న మరికల్ ఆంగ్ల మాధ్యమ కేజీబీవీ వద్ద కనిపించింది. ఆరో తరగతి ప్రవేశాల కోసం పిల్లల్ని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు ఎలాగైనా ప్రవేశం కల్పించాల్సిందిగా ప్రత్యేకాధికారి రాజ్యలక్ష్మికి విన్నవిస్తుండగా తీసింది. -
సుంకేశుల నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
వర్షాల ప్రభావంతో తుంగభద్ర నదికి వరద ప్రవాహం పెరగడంతో రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి 2 గేట్లను ఎత్తి శనివారం నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జలాశయానికి 18,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. -
గత కలెక్టర్పై భూ అక్రమాల ఆరోపణ
[ 16-06-2024]
జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి పనిచేసిన సమయంలో భూ అక్రమాలకు పాలడ్డారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఓఎస్డీ హరిప్రసాద్కు శనివారం సచివాలయంలో ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల
-
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
-
నొక్కేద్దాం.. దొరికితే చూద్దాం.. జేబులు నింపేసుకున్న ఇంటి దొంగలు