Siddipet: ‘గూగుల్’లో రోడ్డుంది.. నీళ్లలోకి లారీ వెళ్లింది!
‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో హిమాలయా ల్లోని దూద్కాశీకి వెళ్లడానికి చరవాణిలో గూగుల్ పటాన్ని చూస్తూ హీరో వెళ్తుంటాడు..
యువకుల సాయంతో గౌరవెల్లి ప్రాజెక్టులో తప్పిన ప్రమాదం
ప్రాజెక్టు నీటిలో చిక్కుకున్న లారీ
అక్కన్నపేట(హుస్నాబాద్ గ్రామీణం), న్యూస్టుడే: ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో హిమాలయాల్లోని దూద్కాశీకి వెళ్లడానికి మొబైల్లో గూగుల్ మ్యాప్ చూస్తూ హీరో వెళ్తుంటాడు.. మ్యాప్ ఆధారంగా వెళ్తే భారీ కొండ అంచుకు చేరతాడు.. కానీ అనుకున్న చోటు కనబడదు. ఇది సరదాగా తీసిన సన్నివేశమైనా సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి జలాశయం విషయంలో ‘గూగుల్’ తప్పుదారి పట్టించి, ప్రమాదంలోకి నెట్టేసింది. అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలో ఓ లారీ చిక్కుకుంది. బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు ఈ ఘటన జరిగింది.
తమిళనాడుకు చెందిన లారీ మంగళవారం రాత్రి చేర్యాల మీదుగా హుస్నాబాద్ వస్తోంది. డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్యకు దారిపై సరైన అవగాహన లేదు. ఫోన్లో గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా వస్తున్నారు. నందారం స్టేజీ దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్ చూపింది. చీకట్లో లారీని నడుపుతూ అలాగే వెళ్లారు. వాన వల్ల నిలిచిన నీరు అనుకున్నారు. ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది. లారీ క్యాబిన్ వరకు నీళ్లు ఉన్నాయి. కొద్దిగా లోపలికి వస్తున్నాయి. వాహనం పనిచేయడం ఆగింది. వారిద్దరూ కిందకు దిగి మెల్లగా సమీపంలోని రామవరం వచ్చారు.
గ్రామస్థులకు తెలపగా ఎంపీటీసీ సభ్యుడు లింగాల శ్రీనివాస్, గుడాటిపల్లి సర్పంచి బద్దం రాజిరెడ్డి, యువకులు వోలాద్రి మహేశ్, లింగాల చందు, రచ్చ సత్యనారాయణ వెళ్లారు. లారీకి తాళ్లు కట్టి వెనక్కు లాగడంతో అతికష్టం మీద బయటకు వచ్చింది. వాస్తవంగా నందారం స్టేజీ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను అక్కడి నుంచి బైపాస్రోడ్డు ద్వారా మళ్లించారు. స్టాపర్లు రోడ్డు పక్కన పడిపోయాయి. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా దారి పూర్తిగా మూసేయాలని స్థానికులు కోరుతున్నారు.
వాహనాన్ని బయటకు తేవడానికి సహకరించిన వారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాన లేక.. అన్నదాత ఆందోళన
[ 19-06-2024]
వరుణుడు మబ్బుచాటునే దోబూచులాడడంతో కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమయి 17 రోజులవుతున్నా ఆశించిన స్థాయిలో చినుకు లేక నిరాశే ఎదురవుతోంది. -
కొరవడిన వసతులు.. విద్యార్థుల అవస్థలు
[ 19-06-2024]
పేద విద్యార్థుల భవితకు బాటలు వేసేందుకు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. -
అర్జీల స్వీకరణ.. సవరణకు కార్యాచరణ
[ 19-06-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. -
పోలీసులను సస్పెండ్ చేయాలి: ఎంపీ రఘునందన్రావు
[ 19-06-2024]
బక్రీద్ పండుగకు ముందు జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో జరిగిన ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. -
నగదు రహితం.. పారదర్శకం
[ 19-06-2024]
ఓ వైపు పొదుపు, మరోవైపు రుణాలు తీసుకొని వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు. తీసుకున్న రుణాలను వాయిదాల రూపంలో పక్కాగా చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పాలనాధికారి ప్రాంగణం.. పర్యావరణ హితం
[ 19-06-2024]
ప్లాస్టిక్ వినియోగం.. అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకు కారణంగా మారుతోంది. ఈ తరుణంలోనే హాని కలిగించే ప్లాస్టిక్ను సంపూర్ణంగా నిషేధించేందుకు సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి సంకల్పించారు. -
చిరువ్యాపారి దారుణహత్య
[ 19-06-2024]
కాగితాలు, ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ సామగ్రి ఏరుకుంటూ జీవించే చిరువ్యాపారి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి భార్య, అతడి తమ్ముడి కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన జడ్పీ
[ 19-06-2024]
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రామాల అభివృద్ధికి, కనీస సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. -
ఫలించనున్న రైతుల నిరీక్షణ
[ 19-06-2024]
ఒకటి కాదు...రెండు కాదు... ఏకంగా 35 ఏళ్లుగా ఎదురుచూసిన రైతుల నిరీక్షణ ఫలించనుంది. ఉమ్మడి మనూరు మండలంలో సుమారు రూ.30 కోట్ల వ్యయంతో 6వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యంతో మంజీర నదిపై అయిదు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. -
అనుమతి లేని ఆసుపత్రి సీజ్
[ 19-06-2024]
హత్నూర మండలం చింతల్చెరులో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ ఆసుపత్రిని మంగళవారం సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి గాయత్రిదేవి తెలిపారు. -
అధ్యాపకులు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థుల నిరసన
[ 19-06-2024]
వైద్య కళాశాలలో కొంతమంది ఆధ్యాపకులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం విద్యార్థినులు నిరసనకు దిగారు. -
కొనుగోళ్లు ముగిశాయి.. పైసలు అందాయి..
[ 19-06-2024]
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. అకాల వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కేంద్రాల నిర్వాహకులు, అధికారులు కల్సి ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లను విజయవంతం చేశారు. -
కేజీబీవీల్లో ప్రవేశాల జోరు
[ 19-06-2024]
నాణ్యమైన విద్య.. చక్కటి వసతి.. అనుబంధంగా వృత్తి విద్యా కోర్సులు.. అర్హత కలిగిన బోధనా సిబ్బందితో జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) కొనసాగుతున్నాయి. -
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
[ 19-06-2024]
విద్యుత్తు తీగలను ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు ప్రక్రియలో భాగంగా సిద్దిపేట గ్రామీణ మండలంలోని చిన్నగుండవెల్లి, ఇర్కోడు, వెంకటాపూర్, తోర్నాల విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో... -
భవారియా గ్యాంగ్ సిద్దిపేట జిల్లాకొచ్చిందా!
[ 19-06-2024]
వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లతో కలకలం రేపిన భవారియా గ్యాంగ్ సభ్యులు ఎటువైపు పరారయ్యారో పోలీసులకు అంతుచిక్కడం లేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో యువకుడిని కారుతో ఢీకొట్టిన వైకాపా ఎంపీ కుమార్తె!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/06/24)
-
పక్షుల్లా ప్రవర్తిస్తున్న చైనా యువత.. ఎందుకో తెలుసా?
-
క్యాప్షన్ కోరిన శ్రద్ధా కపూర్.. విహార యాత్రలో నోరా ఫతేహి
-
స్మార్ట్ ఛార్జింగ్ కేస్తో జేబీఎల్ ఇయర్బడ్స్.. ధర ఎంతంటే?
-
మా విషయంలో మీ జోక్యం ఎందుకు? చైనాపై తైవాన్ కీలక వ్యాఖ్యలు