మహిళా సంఘాలకు సీఎస్సీ కేంద్రాలు
పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు.
సంగారెడ్డి, జహీరాబాద్లో ఏర్పాటుకు సన్నాహాలు
సంగారెడ్డిలో పొదుపు సంఘాల సభ్యులకు శిక్షణ
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జోగిపేట: పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు పట్ణణ వినియోగదారుల సేవా కేంద్రాల(సీఎస్సీ) ఏర్పాటుకు మెప్మా రాష్ట్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా ఈ ఆదేశాలిచ్చినప్పటికీ.. అమలు కాలేదు. ఈసారి సీఎస్సీ కేంద్రాల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లక్ష జనాభా దాటిన పురపాలికల్లో మొదట అమలు చేయనున్నారు. ఎస్బీఐ, స్త్రీ నిధి విభాగాల మార్గదర్శకంలో పట్టణ వినియోగదారుల కేంద్రాలు నిర్వహించనున్నారు. తొలుత జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, మరో పట్టణం జహీరాబాద్లో నిర్వహించి.. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా ఇతర పురపాలికల్లో అమలు చేయనున్నారు.
ఎంపిక విధానమిది..: సంగారెడ్డి, జహీరాబాద్లో సీఎస్సీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అత్యధిక జనాభా ఈ పట్టణంలోనే ఉండటంతో ఎంపిక చేశారు. పట్టణ వినియోగదారుల సేవా కేంద్రాన్ని స్లమ్ స్థాయి సమాఖ్య(టీఎల్ఎఫ్)కు అప్పగిస్తారు. పట్టణంలో ‘ఎ’, ‘బి’ గ్రేడ్ స్థాయిలో ఉన్న ఎస్ఎఫ్ఎల్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో విద్యావంతులైన ఓ మహిళను ఎంపిక చేసి కేంద్రం నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. ఆమెకు ధృవపత్రం జారీ చేస్తారు. ఈ కేంద్రాన్ని ఏదైనా బ్యాంకు సమీపంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మెప్మా పీడీ, పురపాలక కమిషనర్ పరిశీలించి నిర్ణయిస్తారు. సీఎస్సీ కేంద్రం ఏర్పాటయితే మహిళా సంఘాల సభ్యులకు ఆదాయమూ సమకూరనుంది.
నిర్వహణ ఇలా..: పట్టణ వినియోగదారుల కేంద్రాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన పొదుపు ఖాతాలతో ఇతరులు కూడా ఖాతాలు ప్రారంభించవచ్చు. ఖాతాదారులకు ఏటీఎం కార్డులు సైతం జారీ చేస్తారు. మహిళా సంఘాల పొదుపు, రుణాలు, వృద్దుల ఆసరా పింఛన్లు.. ఇలా ప్రతి ఆర్థిక లావాదేవీలు ఈ కేంద్రాల ద్వారా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం సంగారెడ్డి తొలుత ఏర్పాటు చేసి.. ఆ తర్వాత జహీరాబాద్లో ప్రక్రియ చేపడతారు. సీఎస్సీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉందని డీఎంసీ మల్లీశ్వరి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పచ్చందాలకు.. ప్రత్యేక కార్యాచరణ
[ 13-06-2024]
పర్యావరణ పరిరక్షణలో వృక్షాలే కీలకం. వీటి వల్లే ఆహ్లాదకర వాతావరణంతోపాటు, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ముఖ్యంగా అడవుల్లో మొక్కలు నాటి వాటిని పెంచితే భారీ వర్షాలు కురిసి భూగర్భజలాలు పెరిగి పంటలు బాగా పండేందుకు ఆస్కారం ఉంటుంది. -
ధాన్యం మరాడించడంపై దృష్టి
[ 13-06-2024]
కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మరాడించడంపై అధికారులు దృష్టి సారించారు. నాలుగు సీజన్లకు సంబంధించి ఆయా మిల్లులకు ధాన్యం కేటాయించగా, -
చదువులమ్మ నెలవుల్లో.. చిన్నారుల చిరునవ్వులు
[ 13-06-2024]
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా చిన్నారులతో సందడి నెలకొంది. సర్కారు బడులను మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలతో అలంకరించారు. -
5 నెలలు.. 175 మరణాలు
[ 13-06-2024]
రహదారులు అభివృద్ధికి చిహ్నాలంటారు. అవే దారులపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లడం, మద్యం తాగి నడపడం, ఇష్టారీతిన వాహనాలు నిలపడం, -
ఉద్యాన సాగుకు ఊతమేదీ?
[ 13-06-2024]
విత్తు నాటగానే వరుణుడి కటాక్షం కోసం ఆకాశం వైపు చూడాలి.. మొలకెత్తింది మొదలు పంటకు చీడపీడల నివారణ.. చేను కోతకొచ్చి ఉత్పత్తులను మార్కెట్కు తరలించేదాకా అన్నదాతలకు కష్టాలే. -
సర్కారు బడుల్లోనే నాణ్యమైన బోధన
[ 13-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లోనే డీఎస్సీ అర్హతతో ఉద్యోగాలు సాధించిన అత్యున్నతమైన ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేస్తారని జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. -
లీకేజీలతో శుద్ధ జలం కలుషితం
[ 13-06-2024]
మిషన్భగీరథ పథకం నీటి సరఫరాలో నెలకొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం నేపథ్యంలో నీటి లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. -
టోల్గేట్తో ఆదాయం.. ఏదీ సదుపాయం?
[ 13-06-2024]
రహదారులు అభివృద్ధికి సూచిక. వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా ప్రయాణించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన రహదారులను నాలుగు నుంచి ఆరు వరుసలుగా నిర్మించాయి. -
పర్యావరణహితమే సంకల్పం
[ 13-06-2024]
పర్యావరణ శ్రేయస్సు.. సమాజ హితాన్ని కాంక్షిస్తూ పలువురు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. స్వార్థం చూసుకోకుండా స్వచ్ఛతలో భాగస్వామ్యమవుతూ ఇతరులకు ప్రేరణ కల్పిస్తున్నారు. -
కృత్రిమ ఇసుకతో భూమాత నిస్సారం
[ 13-06-2024]
పంటల సాగు చేపట్టాలంటే మట్టి, ఇసుకరేణువులతో కూడిన సారవంతమైన భూమి అవసరం. కొందరు మట్టి నుంచి కృత్రిమంగా ఇసుక తయారుచేసి అక్రమ దందా సాగిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కోన్ ఐస్క్రీంలో మనిషి వేలు.. ముంబయి డాక్టర్కు చేదు అనుభవం
-
ఇంగ్లండ్ను అడ్డుకొనేందుకు.. ఆసీస్ అలా చేస్తే నిషేధం తప్పదు!
-
పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
-
నీట్ పరీక్షలో ఆ 1500 మందికి గ్రేస్ మార్కులను తీసేస్తాం: సుప్రీంకు కేంద్రం వెల్లడి
-
పుణె కారు ప్రమాదం కేసు: బయటపడుతున్న డాక్టర్ క్రిమినల్ నెట్వర్క్..!
-
టీ20 వరల్డ్ కప్ సూపర్ - 8కి విండీస్.. ఇక ఇంటికే కివీస్!