ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు
ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
సూర్యాపేటలోని ఎన్టీఆర్ నగర్లో మిషన్ భగీరథ పైపులైన్ నుంచి లీకవుతున్న నీరు
సూర్యాపేట పురపాలిక, న్యూస్టుడే: ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. సిలికాన్ సిటీ నీటి సమస్యతో కేప్టౌన్ నగరం పేరు తెరమీదకు తీసుకొస్తున్నారు. అక్కడ ఆరేళ్ల కింద తలెత్తిన నీటి సంక్షోభం ప్రపంచంలోనే తీవ్రమైనదిగా పరిగణిస్తుంటారు. ప్రస్తుతం బెంగళూరు నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరముంది.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని గ్రామాలు, అయిదు పురపాలికల్లో జల వనరులు అడుగంటుతున్నాయి. దీనికి తోడు నీటి వృథా అవుతున్నాయి. ఇప్పటికే అక్కడక్కడ నీటి వనరుల్లో కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూగర్భ జలమట్టం పడిపోవడం, అడుగుంటుతున్న జలాశయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయాలపై అధికారగణం అప్రమత్తం.. ప్రజలు చైతన్యమై నీటి వృథాని అరికట్టడానికి సిద్ధం కావాల్సిన తరుణమిది. జిల్లాలో నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతానికి తీవ్ర కరవు పరిస్థితులు లేవనే ధీమాలో ఉన్నా.. రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలను దరిదాపుల్లోకి రానీయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని గ్రామాలతో పాటు పురపాలికల్లో ప్రతి పౌరుడు రోజుకు ఒక లీటరు నీటిని పొదుపు చేసినా.. అది నీటి బ్యాంకులో రోజుకు 54,08,800 లీటర్లు ఆదా అవుతుంది.
కారణాలేంటి..
నీటి సంక్షోభం తలెత్తినా దానికి మానవ తప్పిదాలే కారణమన్నది సుస్పష్టం. వాతావరణం మార్పులకు గురి కావడానికి మనిషి కొనసాగిస్తున్న కార్యకలాపాలే కారణం. ముఖ్యంగా జిల్లాలోని అయిదు పురపాలికల్లో చెరువులను ఆక్రమించి ప్లాట్లుగా మార్చటం.. నీటి వనరుల సంరక్షణ చేపట్టకపోవడంతో వేసవిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలకు చర్యలు తీసుకోకపోవటంతో వాన నీరింకే పరిస్థితి లేకుండా పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూముల విలువ పెంపునకు కసరత్తు
[ 18-06-2024]
భూముల మార్కెట్ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో క్షేత్రస్థాయిలో సబ్రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని సర్కారు పెద్దల ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
రూ. 90 కోట్లతో నీలగిరి వేదిక
[ 18-06-2024]
నల్గొండలో నిర్మించతలపెట్టిన కళాభారతి నిర్మాణ ఆకృతితోపాటు పేరు కూడా నీలగిరి వేదికగా మారింది. నల్గొండ నడిబొడ్డున రోడ్ల భవనాలశాఖ, నీటిపారుదలశాఖ కార్యాలయాల స్థలంలో గత భారాస ప్రభుత్వం కళాభారతి నిర్మించాలని నిర్ణయించింది. -
చేనేత సంఘాల ఎన్నికలకు ముహూర్తమెప్పుడో..?
[ 18-06-2024]
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించడంతో కార్మికులు హర్షం ప్రకటిస్తున్నారు. ఆ సంఘాల సభ్యులు నూతన పాలక వర్గాలను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
ఇసుకాసురుల ఇష్టారాజ్యం
[ 18-06-2024]
ఇసుక కొరతను తీర్చేందుకు నార్కట్పల్లి మండలంలో ఇసుక డిపోల ఏర్పాటుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. -
ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేయాలి: జూలకంటి
[ 18-06-2024]
కేంద్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను పక్కాగా అమలు చేయాలని మాజీ శాసనసభ సభ్యుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటిరంగారెడ్డి అన్నారు. -
ఆరుద్రపైనే ఆశలు
[ 18-06-2024]
నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. మృగశిర కార్తెకంటే ముందే నైరుతి పలకరిస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో వానాకాలం సాగుపై రైతులు ఆశ పడ్డారు. -
ఎస్పీగా శరత్చంద్ర పవార్
[ 18-06-2024]
రాష్ట్ర యాంటి నార్కోటిక్ బ్యూరో ఇన్ఛార్జిగా పని చేస్తున్న శరత్ చంద్ర పవార్ నల్గొండ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం సోమవారం కేటాయించింది. -
తొలి మెట్టు.. భవితకు ఆయువుపట్టు
[ 18-06-2024]
పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఆ విషయాన్ని గ్రహించిన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి ఇటీవల రాజపేటలోని బాలుర, బాలికల పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు సుమారు గంట పాటు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. -
మళ్లీ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ
[ 18-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా ప్రజాపాలన కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. లోక్సభ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం..
[ 18-06-2024]
పెళ్లి చేసుకుందామనుకున్న ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. -
సూర్యాపేట ఎస్పీ బదిలీ
[ 18-06-2024]
సూర్యాపేట నూతన ఎస్పీగా 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సన్ప్రీత్ సింగ్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆలస్యమైతే విద్యుత్తు ముప్పు
[ 18-06-2024]
రానున్న రోజుల్లో విద్యుత్తు ముప్పు తప్పేలా లేదు. వానాకాలం సాగుకు సమస్యలు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సకాలంలో పరిష్కరించకపోతే రైతులు రోడ్డెక్కే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. -
కవులు, కళాకారులకు నిలయం మోత్కూరు
[ 18-06-2024]
కవులు, కళాకారులు, గాయకులు, ఉద్యమకారులకు నిలయం మోత్కూరు అని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. -
తీరని వారధి కష్టాలు
[ 18-06-2024]
వానాకాలం వచ్చిందంటే జిల్లాలోని పలుచోట్ల వాగులపై ఉన్న లోలెవల్ కాజ్వేలు ప్రమాదకరంగా మారుతున్నాయి. వర్షాలకు వరద పోటెత్తి రోజుల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
విశాఖలో జరిగిన ఆ కిడ్నాప్.. ఇప్పటికీ ఓ మిస్టరీ!
-
అమెరికాను కలసికట్టుగా ఎదుర్కొంటాం.. కిమ్తో భేటీకి ముందు పుతిన్
-
భవారియా గ్యాంగ్ బరితెగింపు.. పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠా సవాల్
-
5 రోజుల్లో లక్ష మందిని కలిసిన ఒడిశా సీఎం
-
పిల్లలకు హెల్దీ లంచ్బాక్స్.. ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు!