విద్యుదాఘాతంతో కార్మికుడికి అస్వస్థత
గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు
పర్లాఖెముండి, న్యూస్టుడే: గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే ఠాణా పరిధిలోని గోవిందపూర్ పంచాయతీ పుతిలిపోంకలో ప్రభుత్వ మార్కెట్ కాంప్లెక్స్ పైకప్పుపై నిలుచొని పనిచేస్తున్న క్రమంలో పై నుంచి వెళ్తున్న 11కేవీ విద్యుత్తు తీగలు తగిలి అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు మోహన ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన చికిత్స కోసం బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన వ్యక్తి నజారిత్ సైబర్(22)గా తెలుస్తోంది.
గంజాయి స్వాధీనం... ముగ్గురి అరెస్ట్
నవరంగపూర్, న్యూస్టుడే: అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా నవరంగపూర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు టెంటులిఖుంటి ఠాణా పరిధిలో మెంట్రి గ్రామానికి చెందిన హఫీజ్ ఖా, బరగావ్కి చెందిన బేణుధర్ సౌర, సిరాగూడ గ్రామానికి చెందిన ఆమన్ ఖాగా గుర్తించారు. వారి నుంచి 16 కిలోల గంజాయి, ఒక స్కూటీ, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులని కోర్టుకు తరలించారు.
రిజర్వాయరులో ఇద్దరి జలసమాధి
భువనేశ్వర్, న్యూస్టుడే: ఉక్కునగరం రవుర్కెలాలో శనివారం సాయంత్రం విషాధఛాయలు అలముకున్నాయి. కోల్ నది రిజర్వాయరులో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు మునిగిపోయారు. అక్కడున్నవారు ఒకర్ని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకున్నాడు. మిగిలిన ఇద్దరు జలసమాధి అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. మృతులు ఎవరన్నది స్పష్టం కాలేదు.
నకిలీ పొల్యూషన్ పత్రాలు జారీ- ఏజెంట్ అరెస్ట్
జయపురం, న్యూస్టుడే: నకిలీ పొల్యూషన్ పత్రాలు మిల్లర్లకు ఇచ్చి వారి ద[గ్గర నుంచి రూ. లక్షలు దోచుకున్న కేసులో జయపురం టౌన్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఐఐసీ రమణి రంజన్ దొలై తెలిపిన వివరాలు ప్రకారం, స్థానిక లింగరాజ్ నగర్కు చెందిన సమీర్కుమార్ పండా 2019లో పట్టణంకి చెందిన 10 మంది మిల్లర్ల వద్ద రూ.50వేలు చొప్పున తీసుకొని పొల్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. కాల వ్యవధి ఈ ఏడాది మార్చి 31తో గడువు ముగిసింది. కొరాపుట్ కాలుష్య విభాగంలో సర్టిఫికెట్ పునరుద్ధరణ కోసం మిల్లర్లు దరఖాస్తు చేసుకోగా, ఆ పత్రాలు నకిలీవని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రైనేజీ ప్రవాహంలో బాలుడు మృతి
[ 18-06-2024]
భువనేశ్వర్లో మంగళవారం మధ్యాహ్నం విషాధ ఘటన చోటుచేసుకుంది. -
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
[ 18-06-2024]
ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షరయోధుడు రామోజీరావుకు ‘భారత రత్న’ ఇవ్వాలని వివిధ తెలుగు సంస్థలు తీర్మానించాయి. -
కిన్నెరుల తరఫున ఎస్పీకి వినతి పత్రం
[ 18-06-2024]
కిన్నెర సంఘం తరఫున మంగళవారం ఎస్పీ రోహిత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. -
ఆదివాసీలకు దేశీ విత్తనాలు పంపిణీ
[ 18-06-2024]
కోరాపుట్ జిల్లాలో అంతరించి పోతున్న సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తనాల వాడకం పనరుజ్జింపచేసేందుకు స్వచ్ఛంద సంస్థ సభ్యులు అడుగులు వేస్తున్నారు. -
నకిలీ సీబీఐ అధికారి అరెస్టు
[ 18-06-2024]
కోరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితిలో సీబీఐ అధికారిగా ప్రజలను మొసగించి, బెదిరించి దోచుకుంటున్న యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
కొత్త ప్రభుత్వం కొలువుదీరినా.. తొలగించని మోసర్కర్ బోర్డులు
[ 18-06-2024]
రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరినంతరం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 5టీ, మోసర్కార్ బోర్డులను తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
5 రోజుల్లో లక్ష మందిని కలిసిన ఒడిశా సీఎం
[ 18-06-2024]
ప్రజా సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు ఐదు నిమిషాలు కేటాయించడమంటే గగనంగా మారిపోతున్న రోజులివి. -
100 రోజుల్లో అందుతాయా..?
[ 18-06-2024]
నవీన్ సర్కార్ 25 ఏళ్లలో చేయలేక పోయిన పనులు భాజపా ప్రభుత్వం అయిదేళ్లలో పూర్తి చేయాలి. దాంతోపాటు ఎన్నికల ముందు.. -
ప్రాణాలు పోతున్నాయి..!
[ 18-06-2024]
రాయగడ జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. ఏటికేడు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. -
15 మంది బాధితుల గుర్తింపు
[ 18-06-2024]
జిల్లాలోని కాశీపూర్ సమితి డొంగశిల పంచాయతీ మునుస్పొదర్ గ్రామాన్ని పీడిస్తున్న అంతుచిక్కని వ్యాధిగ్రస్థుల సంఖ్య 15కి చేరుకుంది. -
19న బిజద సభాపక్షం భేటీ
[ 18-06-2024]
బిజద అధినేత నవీన్ పట్నాయక్ అధ్యక్షతన బుధవారం (19న) సాయంత్రం భువనేశ్వర్లోని శంఖభవన్ (బిజద కార్యాలయం)లో ఆ పార్టీ సభాపక్షం నేతల సమావేశం జరగనుంది. -
సెఫాలి కొండకు మహర్దశ
[ 18-06-2024]
మూడున్నర దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని సెఫాలి కొండపై ఉన్న రామేశ్వర ఆలయానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
పిడుగుపాటుకు ఆవులు మృతి
[ 18-06-2024]
పిడుగుపాటుకు 20 ఆవులు మృతి చెందిన ఘటన మల్కాన్గిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇలాంటి వారు పైరసీ కంటే ప్రమాదకరం: విష్వక్ సేన్
-
ఎంపీగా.. ఎమ్మెల్యేగా కొనసాగితే తప్పేంటి? ఆర్ఎల్పీ నేత వాదన
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
-
మా విషయంలో మీ జోక్యం ఎందుకు? చైనాపై తైవాన్ కీలక వ్యాఖ్యలు
-
పక్షుల్లా ప్రవర్తిస్తున్న చైనా యువత.. ఎందుకో తెలుసా?
-
రైటర్గా అలియా భట్.. ఆమె ఏం రాశారంటే?