‘అమ్మేసిన స్థలంలో వైకాపా కార్యాలయమా?’
విజయనగరం ఎమ్మెల్యే, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆక్రమణలతో పాటు ఆయన వద్ద స్థలాలు కొనుక్కున్నవారినీ వేధిస్తున్నారని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు
మాట్లాడుతున్న కాళ్ల గౌరీశంకర్
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: విజయనగరం ఎమ్మెల్యే, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆక్రమణలతో పాటు ఆయన వద్ద స్థలాలు కొనుక్కున్నవారినీ వేధిస్తున్నారని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. విజయనగరంలో శనివారం ఆయన మాట్లాడుతూ నగరంలోని ఆర్అండ్బీ రైతు బజారు నుంచి మహరాజా ఆసుపత్రికి వెళ్లే దారిలో వైకాపా కార్యాలయం ఉన్న స్థలాన్ని కోలగట్ల వీరభద్రస్వామి 2019లో కొంతమందికి అమ్మేశారని, ఇప్పటికీ కొనుగోలుదారులకు అందజేయలేదని ఆరోపించారు. ఆయన మాటల్లో.. ఐదేళ్లుగా అక్కడే కార్యాలయాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. అప్పట్లో అయిదుగురు వ్యక్తులకు అమ్మారని, అందులో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్రాజు సైతం ఉన్నారన్నారు. 3 నెలల్లో స్థలాన్ని అప్పగిస్తానని ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యేతో పరీక్షిత్ రాజు కుమ్మక్కై కొనుగోలుదారులను వేధిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. వాలేసి
[ 18-06-2024]
భూమి లేని నిరుపేదలకు గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై పెద్దలు కన్నేసి గద్దల్లా వాలిపోయారు. గత ప్రభుత్వం అసైన్డ్ భూములకు యజమాన్య హక్కు కల్పించనుందని తెలిసి వాటి అమ్మకాలు, కొనుగోళ్లు చట్ట ప్రకారం చెల్లవని తెలిసినా అనధికార లావాదేవీలతో గుంజుకున్నారు. -
నాటి వైభవం.. చంద్రన్నతో సాధ్యం
[ 18-06-2024]
మన్యంలోని గిరిశిఖర గ్రామాల్లో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు గతంలో తెదేపా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సాలూరులో గిరిజన గర్భిణుల వసతి గృహం ఏర్పాటు చేసింది. -
ప్రక్షాళన జరగాలి.. సహకారం అందాలి!!
[ 18-06-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్) రైతులే సభ్యులు. గతంలో సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారే పాలకవర్గాలను ఎన్నుకునేవారు. దీంతో మెరుగైన సేవలు అందేవి. -
వర్షాలు మిగిల్చిన విధ్వంసం
[ 18-06-2024]
గత రెండు రోజులుగా మన్యంలో కురుస్తోన్న వర్షాలతో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద తాకిడికి పలు రహదారులు కొట్టుకుపోయాయి. పాచిపెంట మండలంలో తారురోడ్లు ఛిద్రమయ్యాయి. -
వైకాపా విధానాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 18-06-2024]
పట్టణవాసుల నెత్తిపై బండలా మారిన చెత్తపన్నును కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈమేరకు అన్ని జల్లాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘంలో పన్ను విధించేవారు. -
వర్షం పడితే చెరువే
[ 18-06-2024]
సీతానగరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పలు చోట్ల చెరువులా మారింది. వైకాపా అయిదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. -
ఇంటిపై పిడుగుపాటు
[ 18-06-2024]
పాచిపెంట మండల కేంద్రంలోని ఓ ఇంటిపై పిడుగు పడింది. సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. -
గెడ్డగూడ ఘాట్లో వ్యాన్ బోల్తా
[ 18-06-2024]
సీతంపేట మండలం గెడ్డగూడ సమీపంలోని ఘాట్ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృత్యువాత
[ 18-06-2024]
అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతిచెందిన ఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్ వివరాల మేరకు.. స్థానిక బంగారమ్మ కాలనీకి చెందిన అనూష అలియాస్ తనూజ(22)కు నాలుగు నెలల కిందట వివాహమైంది. -
రైలు ప్రమాదంలో తెగిపడిన కాళ్లు
[ 18-06-2024]
అనుకోని ప్రమాదంలో ఓ వ్యక్తి తన రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలిసేలోపే తన శరీరం నుంచి తెగిపడడంతో అతడి రోదన వర్ణనాతీతంగా మారింది. -
మద్యం దుకాణం వద్ద ఘర్షణ ముగ్గురికి కత్తి పోట్లు
[ 18-06-2024]
నగరంలోని పూల్బాగ్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు.