సింహాచలం కొండపై.. ‘భూ’చోళ్లు
ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా సింహాచల దేవస్థాన భూముల ఆక్రమణకు పావులు కదిలాయి. వైకాపా పెద్దలు కొందరు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు.
ఎన్నికల వేళ చక్రం తిప్పుతున్న నేతలు
రూ.వంద కోట్ల విలువైన భూమిపై కన్ను
సర్వే పేరుతో చెట్లు కొట్టి, యంత్రాలతో కొండవాలు చదును
కళ్లప్పగించి చూస్తున్న దేవాదాయశాఖ అధికారులు
ఈనాడు-విశాఖపట్నం, అక్కయ్యపాలెం-న్యూస్టుడే: ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా సింహాచల దేవస్థాన భూముల ఆక్రమణకు పావులు కదిలాయి. వైకాపా పెద్దలు కొందరు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ పనుల వద్దకు వైకాపా నాయకులు, కార్పొరేటర్లు కొందరు వచ్చివెళుతుండటంతో ఓ కీలక నేత అండ ఉందన్న చర్చ సాగుతోంది. ఆక్రమణదారులు కన్నేసిన దాదాపు ఏడు ఎకరాల భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100కోట్లపైమాటే.
నేతల అండతో: ఉత్తర నియోజకవర్గ పరిధిలోని గణేశ్నగర్ పక్కన ఉన్న సత్యవతి లే-అవుట్ ఆనుకుని కొండను కొందరు చదును చేస్తున్నారు. సర్వే నెంబరు 275లోని సింహాచలం దేవస్థానానికి చెందిన ఈ కొండవాలును రెండు భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. తవ్వి తీసిన గ్రావెల్తో దిగువన లోతట్టు ప్రాంతం చదును చేస్తున్నారు. దేవస్థానం ఏర్పాటు చేసిన రక్షణ గోడ దాటి ఈ తంతంగం అంతా జరుగుతోంది. అక్కడ ఉన్న చెట్లను పూర్తిగా నరికేశారు. వాటిని రంపాలతో ముక్కలుగా కోసి ఆటోల్లో అక్కడి నుంచి తరలించేస్తున్నారు. పునాదుల్లో వేయడానికి రాళ్లు లారీల్లో తెచ్చి సిద్ధం చేశారు.30 అడుగుల రోడ్డుకూ ప్రణాళిక వేశారు.
ఈనాం పట్టాతో కథ నడుపుతూ: విజయనగర రాజుల ద్వారా సత్యవతమ్మ అనే మహిళకు ఈనాం పట్టా ఉన్నట్లు 7.05 ఎకరాలకు ఆర్డర్ గతంలో తెచ్చుకున్నారు. ఆ భూమిని అమ్మకాలు జరపగా, నిర్మాణాలు సైతం జరిగాయి. ఈనాం పట్టా కింద ఇచ్చిన భూమితోపాటు మరికొంత ఆక్రమించి అమ్మకాలు చేశారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. దేవాదాయశాఖలో కొందరు అధికారుల సహకారంతోనే అప్పట్లో ఈ వ్యవహారం చక్కబెట్టారనే ఫిర్యాదులందడంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారి ఆదేశాలతో సర్వే చేశారు. ఈనాం ఆర్డర్ కంటే ఎక్కువ భూమి అమ్మేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఆ ప్రదేశంలో ఎలాంటి పనులు, నిర్మాణాలు చేపట్టకుండా అప్పటి నుంచి అడ్డుకుంటున్నారు. మళ్లీ ప్రస్తుతం కొందరు అదే ఏడు ఎకరాలు ఈనాం పట్టా తెరపైకి తెచ్చి కథ నడిపిస్తున్నట్లు సమాచారం.
సర్వే పేరుతో: ఈనాం ఆర్డర్ చూపించి గతంలో దాదాపు 5 వేల గజాలు ఓ సంస్థకు విక్రయించారు. ఆ సంస్థకు ఇవ్వడానికి అక్కడ భూమి లేదు. దీంతో హద్దులు మార్చేసి ఇంకా తమ భూమి కొండవాలులో మిగిలి ఉందని చూపించడానికి సర్వే పేరుతో భారీ ప్రణాళిక రూపొందించారు. ఆ ఐదు వేల గజాల స్థలం అందులో కట్టబెట్టేందుకు చక్రం తిప్పారు. ఇందులో భాగంగా వైకాపా కీలక నాయకుడి అండతోపాటు, కొందరు అధికారులను ప్రసన్నం చేసుకుని సర్వేకు ఆర్డర్ తెచ్చుకున్నట్లు విమర్శలున్నాయి. దీనిపై దేవాదాయశాఖ ఏఈవో రమణమూర్తిని వివరణ కోరగా... 1994లో ఈనాంకు ఎన్వోసీ ఇచ్చామని, ఆ స్థలాలు అమ్మేసి ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే హద్దుల గుర్తింపునకు సర్వే నోట్ ఇచ్చామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎగ్జిట్ పోల్స్కు మించి కూటమి ఘన విజయం: మాజీ మంత్రి గంటా
[ 03-06-2024]
ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతోందని తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) అన్నారు. -
లబ్డబ్.. లబ్డబ్.. ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
[ 03-06-2024]
‘ఈసారి ఎవరొస్తారంటావ్.. సర్వేలు చెప్పినవన్నీ నిజమైపోవు.. అలాగని వాటిని నమ్మకుండా ఉండలేం. ఎప్పుడూ ఇంత టెన్షన్ చూడలేదు. వైనాట్ 175 అంటూనే పందెలు కాయడానికి మాత్రం వైకాపా వాళ్లు ముందుకు రావడం లేదు. -
కుయుక్తులపై అప్రమత్తం
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపుపై తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. విధ్వంసం.. అభివృద్ధి పాలనకు మధ్య పోరుగా ఉద్విగ్నత రేకెత్తిస్తున్న వేళ ఫలితాలపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
నిబంధనలపై పూర్తి అవగాహన
[ 03-06-2024]
పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు సూచించారు. -
భద్రత నడుమ పోస్టల్ బ్యాలట్ల తరలింపు
[ 03-06-2024]
విశాఖ లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్ బ్యాలట్లు, సర్వీసు ఓట్లతో కూడిన బాక్సులను అభ్యర్థులు, వారి తరఫున ఏజెంట్ల సమక్షంలో ఆదివారం ఉదయం తరలించారు. -
కౌంటింగ్ రోజున ట్రాఫిక్ ఆంక్షలు
[ 03-06-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి మద్దిలపాలెం ఇంజినీరింగ్ ఆర్చి గేటు నుంచి మూడో పట్టణ పోలీసుస్టేషన్కి వెళ్లే రహదారిలో సాధారణ వాహనాలకు అనుమతులు ఉండవని ఏడీసీపీ(ట్రాఫిక్) శ్రీనివాసరావు వెల్లడించారు. -
2500 మందితో ప్రత్యేక బందోబస్తు
[ 03-06-2024]
జూన్ 4న జరగనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో 2500 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జె.సి.పి. ఫకీరప్ప వెల్లడించారు. -
‘నీళ్లకుండీలు’ ఆనవాళ్లు ఎక్కడ..?
[ 03-06-2024]
ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారిలో నీళ్లకుండీలు ప్రాంతానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. -
రెండో విడత కౌంటింగ్ సిబ్బంది నియామకం
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపునకు నియమితులైన సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించారు. -
‘ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూటమికి ఫలితాలు’
[ 03-06-2024]
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూటమి ఫలితాలను సాధించబోతోందని విజయనగరం లోక్సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
[ 03-06-2024]
బీచ్రోడ్డులో వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 03-06-2024]
విస్సన్నపేట సమీపాన కల్వర్టులో ద్విచక్ర వాహనం దూసుకుపోయి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. -
భరోసా అంతంతమాత్రం
[ 03-06-2024]
పట్టణ ప్రజలకు భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) లక్ష్యం నీరుగారుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సాక్ష్యాలు సమర్పించండి.. లేదంటే..: జైరాం రమేష్కు ఈసీ హెచ్చరిక
-
నా చిరునవ్వుకు కారణం వారే: రూమర్లపై నవదీప్
-
ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ.. ఎలా ఉంటుందంటే!
-
హార్దిక్ చాలా స్ట్రాంగ్.. గడ్డు పరిస్థితిని తట్టుకోగలిగాడు: మాజీ క్రికెటర్
-
తెలంగాణలో లెక్కింపునకు సర్వం సిద్ధం.. కౌంటింగ్లో 10 వేల మంది సిబ్బంది
-
బెంగళూరు రేవ్పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు..