తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని బెదిరింపు
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.
ఇంటికొచ్చి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పార్టీ నేత
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సిద్దవరం వెంకటేశ్వరరెడ్డి, నాయకులు
పెనగలూరు, న్యూస్టుడే: తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో సిద్దవరంలోని తన ఇంటి తలుపు చప్పుడు కావడంతో వెళ్లి తలుపు తీయగా గుర్తు తెలియని ఆరు మంది దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. తన చరవాణిని లాక్కుని అసభ్యంగా తిట్టి కొట్టారన్నారు. వైకాపాకు వ్యతిరేకంగా తిరుగుతున్నావా నీ అంతు చూస్తామంటూ దుండగులు బెదిరించినట్లు చెప్పారు. మే 14వ తేదీ వరకు గ్రామం నుంచి వదిలి వెళ్లాలని లేకుంటే అంతం చేస్తామంటూ హెచ్చరించినట్లు వివరించారు. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెనగలూరు ఎస్సై సుభాష్చంద్రబోస్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
[ 01-06-2024]
మండలంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు దుకాణాలు, హోటళ్ల వద్ద ప్రజలు గుంపులుగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నాగమురళీ తెలిపారు. -
బడిబాట కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులు
[ 01-06-2024]
మండలంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు. దీన్ని ఎంఈవోలు మస్తాన్ వలి, ప్రేమసాగర్ ప్రారంభించారు. -
వైఎస్సార్ జిల్లాలో పోలీసుల తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్లు స్వాధీనం
[ 01-06-2024]
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జయరాజ్ గార్డెన్స్ సమీపంలోని చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
అనంతపురం, నెల్లూరు జట్ల ఘన విజయం
[ 01-06-2024]
సౌత్జోన్ ఏసీఏ సీనియర్ పురుషుల వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా శుక్రవారం కడప నగరంలో జరిగిన మ్యాచుల్లో అనంతపురం, నెల్లూరు జట్లు ఘనవిజయం సాధించాయి. -
ఖరీఫ్.. కలిసొచ్చేనా?
[ 01-06-2024]
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ సారైనా మేలిమి విత్తనాలు అందుతాయా?...ఎరువుల కొరత తీరుతాయా?... రాయితీపై యంత్ర పరికరాలు, బిందు, తుంపర సేద్యం పరికరాల సమకూరుతాయా? తదితర ప్రశ్నలు సాగుదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి -
ఫీజుల దోపిడీని నియంత్రించాలని వినతి
[ 01-06-2024]
విద్యను వ్యాపారంగా మార్చిన విద్యాసంస్థలపై విచారణ చేసి ఫీజుల దోపిడీని నియంత్రించాలని కోరుతూ గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎం ఓబులేసు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సిద్ధిఖ్ విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిని కోరారు. -
నిమ్మ... రైతుల కళ్లల్లో చెమ్మ!
[ 01-06-2024]
నిమ్మ సాగు రైతులకు చేదు అనుభవాన్ని మిగుల్చుతోంది. నిలకడ లేని ధరలతో కర్షకుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. దళారుల మోసాలకు నష్టాలు తప్పడం లేదు -
తాగునీటి పథకాలకు గ్రహణం
[ 01-06-2024]
రాష్ట్రంలో వైకాపా పాలనలో చేసిన పనులు సక్రమంగా బిల్లులు చెల్లించక నడ్డివిరిచేశారు. జగన్ సర్కార్పై గుత్తేదారులకు నమ్మకం లేక మండలాల్లోను అభివృద్ధి పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. -
ఇసుక అక్రమ రవాణా... వయా ఠాణా
[ 01-06-2024]
ఎన్నికల కోడ్, 144 సెక్షన్ అమల్లో ఉన్నా.. జమ్మలమడుగులో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా వైకాపా నాయకులు పెన్నానదీ గర్భాన్ని ఇష్టారీతిన తవ్వేస్తున్నారు -
ఆరుగురు జిల్లా బహిష్కరణ... 32 మంది గృహనిర్బంధం
[ 01-06-2024]
ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో జమ్మలమడుగులో అల్లర్లు జరగకుండా కర్ఫ్యూ విధిస్తున్నట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. -
తొలి ఫలితం కమలాపురందే!
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. విజేతలు ఎవరు..? పరాజితులు ఎవరు..? తేల్చేసే సమయం దగ్గర పడింది. ఘడియలు దగ్గరపడే కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠత అధికమవుతోంది. -
మూల్యాంకనంలో రిమార్కులు
[ 01-06-2024]
విద్యాభివృద్దికి తామెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కార్పొరేట్కు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని చెప్పుకొంటున్న ప్రభుత్వం తీరు పదోతరగతి పరీక్షల మూల్యాంకనంలో తేటతెల్లమైంది. -
ఇసుక నిల్వల పరిశీలన
[ 01-06-2024]
సిద్దవటం మండలం జ్యోతి గ్రామశివారులోని ఇసుక నిల్వలను శుక్రవారం సిద్దవటం సెబ్, రెవెన్యూశాఖల అధికారులు తనిఖీ చేశారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రంలో క్రమశిక్షణతో మెలగాలి
[ 01-06-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది క్రమశిక్షణతో మెలగాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
-
సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత
-
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
-
రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ ప్రకటన చేయనన్న అల్లు అర్జున్
-
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
-
ఏ విషయమైనా.. ఎవరికీ అతిగా చెప్పేందుకు ప్రయత్నించను: జస్ప్రీత్ బుమ్రా