అవినీతిరహిత పాలన భాజపా నినాదం
అవినీతి రహిత పాలన భాజపా నినాదమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులో ఆదివారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారసభ, విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్
మాట్లాడుతున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, పక్కన అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, భూపేష్రెడ్డి
కొండాపురం, న్యూస్టుడే: అవినీతి రహిత పాలన భాజపా నినాదమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులో ఆదివారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారసభ, విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గడిచిన పదేళ్లలో భాజపా మంత్రుల్లో ఏ ఒక్కరిపై ఆరోపణలు లేవన్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాని పీవీ నరసింహారావుకు సైతం భారతరత్న ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే చెందుతున్నారు. కాంగ్రెస్ హయంలో మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. అత్యధిక పార్లమెంటు స్థానాలను ఎన్డీఏ కూటమి సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతిలో మోదీ పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, తెదేపా కడప ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. గండికోట, రాజోలి నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గండికోటను పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు వినతి పత్రం అందజేశారు. ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలవుతాయన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని, జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎత్తిపోతలు.. కొత్త ఆశలు!
[ 18-06-2024]
కర్షకుల సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై గత వైకాపా ప్రభుత్వం అంతులేని అలసత్వం చూపింది. నిర్వహణకు నిధులివ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసింది. -
విస్తరణ... నత్తనడకన!
[ 18-06-2024]
ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి-చాగలమర్రి రహదారి విస్తరణ పనులు గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతుండడంతో వాహనచోదకులు, ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
[ 18-06-2024]
త్యాగానికి ప్రతీక బక్రీద్ అని ముస్లిం మత గురువు ఇనాయతుల్లా మౌలి పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల, కమలాపురంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
కలిసికట్టుగా భరతం పడదాం!
[ 18-06-2024]
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కడపలో సోమవారం తొలిసారిగా కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కలిసికట్టుగా రాజకీయ ప్రయాణం సాగిస్తూ అక్రమార్కుల భరతం పట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. -
అంటకాగితే అంతే!
[ 18-06-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించిన వివాదాస్పద అధికారులపై వేటు వేయడం ప్రారంభించింది. వైకాపాతో అంటకాగుతూ తెదేపాతో పాటు దాని మిత్రపక్షాలను ఇబ్బందులు పెట్టిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. -
కిలో టమాట రూ.80
[ 18-06-2024]
మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాట ధర అత్యధికంగా రూ.80 పలికింది. బక్రీద్ను పురస్కరించుకుని మార్కెట్కు తక్కువ కాయలు రైతులు తీసుకొచ్చారు. -
మాట తప్పని నాయకుడు చంద్రబాబు
[ 18-06-2024]
అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచుతూ సంతకం చేసి సీఎం చంద్రబాబునాయుడు మాట తప్పని నేతగా నిలిచారని దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి పేర్కొన్నారు. -
నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు కడపకు రాక
[ 18-06-2024]
కేంద్ర విమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు మంగళవారం కడప నగరానికి రానున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. -
విద్యుదాఘాతంతో మహిళా కూలీ మృతి
[ 18-06-2024]
బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్తు హైటెన్షన్ తీగలు తగలడంతో ఓ మహిళా కూలీ మృతిచెందగా, నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటన రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలో సోమవారం చోటుచేసుకుంది. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 18-06-2024]
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడలశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని ఏపీ ఎన్జీవో జిల్లా సంఘం నాయకులు సోమవారం రాయచోటిలో కలసి సత్కరించారు. -
చేపల చెరువు విషయంలో ఘర్షణ
[ 18-06-2024]
జమ్మలమడుగు మండలంలో గత కొన్నేళ్లుగా చేపల చెరువు నిర్వహిస్తున్న వైకాపా మాజీ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ సుబ్బరాయుడు, ఎన్డీఏ కూటమి నేతల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. -
కార్డుదారులకు తీపి కబురు
[ 18-06-2024]
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే ఐదు హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతకాలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇలాంటి వారు పైరసీ కంటే ప్రమాదకరం: విష్వక్ సేన్
-
ఎంపీగా.. ఎమ్మెల్యేగా కొనసాగితే తప్పేంటి? ఆర్ఎల్పీ నేత వాదన
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
-
మా విషయంలో మీ జోక్యం ఎందుకు? చైనాపై తైవాన్ కీలక వ్యాఖ్యలు
-
పక్షుల్లా ప్రవర్తిస్తున్న చైనా యువత.. ఎందుకో తెలుసా?
-
రైటర్గా అలియా భట్.. ఆమె ఏం రాశారంటే?