Doubtful voters: ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది.
ఇంటర్నెట్ డెస్క్: ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ కొందరు ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ అస్సాంలో మాత్రం పరిస్థితి భిన్నం. భారత పౌరులుగా ఫారెనర్స్ ట్రిబ్యునల్ ప్రకటించినప్పటికీ.. ఓటు వేయలేకపోతున్నామని పలువురు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో తమ పేరు వద్ద ‘సందేహాస్పద ఓటరు’ను తొలగించకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ ‘డీ’ ఓటరు అనే విషయాన్ని పరిశీలిస్తే..
ఎవరు వీళ్లు..?
అస్సాంలోని బరాక్ లోయ ప్రాంతంలో ఉన్న కరీంగంజ్, సిల్చర్ నియోజకవర్గాలు బంగ్లాదేశ్తో 129 కి.మీ సరిహద్దు కలిగి ఉన్నాయి. పొరుగు దేశం నుంచి వచ్చిన ఎంతో మంది హిందూ బెంగాలీలు ఈ లోయ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇలా వచ్చిన వారిలో భారత పౌరులుగా నిరూపించుకునేందుకు అవసరమైన ఆధారాలను చూపించలేని వారిని ‘డీ’ ఓటరు లేదా సందేహాస్పద ఓటర్లుగా పేర్కొంటారు. ఫారినర్స్ ట్రిబ్యునల్లో పెండింగులో ఉన్న లేదా ట్రిబ్యునల్ విదేశీయులుగా ప్రకటించిన వారిని ఈ జాబితాలో చేరుస్తారు. అస్సాంలో ‘డీ’ ఓటరు అనే భావనను కేంద్ర ఎన్నికల సంఘం 1997లో తీసుకువచ్చింది. ఇక్కడ తప్పితే దేశంలో మరే రాష్ట్రంలో ఇది ఉండదు.
సుమారు లక్ష మంది..
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. సందేహాస్పద ఓటర్లకు సంబంధించిన వేలాది కేసులు ఫారినర్స్ ట్రిబ్యునల్ వద్ద పెండింగులో ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో దాదాపు 86వేల మందిని విదేశీయులుగా ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. వీరందరూ అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీల్లేదు.
ప్రచారానికి ‘డీ ఓటరు’ వేడి..
ఎన్నికలు పూర్తైన ఆరు నెలల్లోగా బెంగాలీ హిందువులు ఎదుర్కొంటున్న పౌరసత్వ సమస్యతోపాటు డీ ఓటరు ట్యాగ్ తొలగిస్తామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అక్కడి ఓటర్లుకు హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఏఏ ప్రకారం పౌరసత్వ సమస్య పరిష్కారమైతే.. బెంగాలీ హిందువుల డీ-ఓటరు సమస్య సమసిపోతుందని సిల్చార్ భాజపా అభ్యర్థి పేర్కొంటున్నారు. అయితే, డీ ఓటరును తొలగించాలా? లేదా అనే అంశం సుప్రీం కోర్టులో పెండింగులో ఉందని కరీంగంజ్ కాంగ్రెస్ అభ్యర్థి హఫీజ్ అహ్మద్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్