icon icon icon
icon icon icon

ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు!

తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్‌ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు.

Published : 12 May 2024 19:23 IST

తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్‌ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) లోని అభ్యర్థుల పేర్లు, ఫొటో, గుర్తు సీరియల్ నెంబర్ కనిపిస్తాయి. ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌లో అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్‌తో స్లిప్ ప్రింట్ అవుతుంది. దానికి అమర్చిన పారదర్శక తెర మీద పేపర్ కేవలం 7 సెకన్లు ఉంటుంది. తమ ఓటు అనుకున్న అభ్యర్థికే పడి నట్లు ధ్రువీకరించుకోవడానికి వీవీప్యాట్ ఉపకరిస్తుంది. ఈ వ్యవస్థతో ఓట్లను మార్చడానికి లేదా లెక్కలు తారుమారు చేయడానికి వీలులేదు. రీకౌంటింగ్ అవసరమైతే మ్యాన్‌వల్‌గా ఓట్ల గణనను నిర్వహించే మార్గాన్ని చూపుతుంది. ఈవీఎం, వీవీప్యాట్‌తో పాటు కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. కంట్రోల్ యూనిట్ పోలింగ్ అధికారి దగ్గర, బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ ఓటు వేసే దగ్గర ఉంటాయి. పోలింగ్ అధికారి కంట్రోల్ యూనిట్‌ను యాక్టివేట్ చేస్తేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img