ఒక్కలిగలపై పట్టు కోసం!
కర్ణాటకలో తొలి విడత ఎన్నికలు ఓ సామాజికవర్గ నేతల ఆధిపత్యానికి సవాలుగా మారాయి. ఈనెల 26న 14 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఇందులో అత్యధిక స్థానాల్లో ఒక్కలిగలు నిర్ణయాత్మక ఓటర్లుగా ఉన్నారు.
కర్ణాటకలో సామాజిక ఆధిపత్య సమరం
ఈనాడు, బెంగళూరు
కర్ణాటకలో తొలి విడత ఎన్నికలు ఓ సామాజికవర్గ నేతల ఆధిపత్యానికి సవాలుగా మారాయి. ఈనెల 26న 14 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఇందులో అత్యధిక స్థానాల్లో ఒక్కలిగలు నిర్ణయాత్మక ఓటర్లుగా ఉన్నారు. విధానసభ, లోక్సభ.. ఎన్నికలు ఏవైనా ఆయా పార్టీల్లో ఒక్కలిగ వర్గానికి ప్రాధాన్యం కల్పించడం పార్టీలకు ఓ సవాలే.
వారికి వారే పోటీ
కన్నడనాట రాజకీయాలను శాసించే ప్రముఖ వర్గాల్లో లింగాయత్ తర్వాత ఒక్కలిగలే. వీరు రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో వీరి ప్రభావం ఉంటుంది. మండ్య, హాసన, మైసూరు, బెంగళూరు గ్రామీణ, తుమకూరు, కోలారు, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరులో కనీసం 40 శాతం, చిత్రదుర్గ, శివమొగ్గ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో 30 శాతం ఓట్లు వారివే. మండ్య జిల్లాలో సగానికి సగం ఈ వర్గానికి చెందినవారే. తాజా ఎన్నికల్లోనూ నాలుగు స్థానాల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ ఈ వర్గానికి చెందినవారే. ఆరు చోట్ల కనీసం ఒకరు ఒక్కలిగ వర్గం నుంచి బరిలో ఉన్నారు. హాసనలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (జేడీఎస్)- శ్రేయస్ పాటిల్ (కాంగ్రెస్) తలపడుతున్నారు. మండ్యలో మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్)- వెంకటరమణే గౌడ (కాంగ్రెస్), బెంగళూరు గ్రామీణలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ (కాంగ్రెస్)- హెచ్.డి.దేవెగౌడ అల్లుడు డాక్టర్ సి.ఎన్.మంజునాథ్ (భాజపా) సవాళ్లు విసురుకుంటున్నారు. బెంగళూరు ఉత్తరలో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె (భాజపా)- రాజ్యసభ మాజీ సభ్యుడు రాజీవ్గౌడ (కాంగ్రెస్) ప్రధాన ప్రత్యర్థులు. మాజీ మంత్రి కె.సుధాకర్ (భాజపా) చిక్కబళ్లాపుర నుంచి, మైసూరులో యదువీర్ ఒడెయార్కు పోటీగా ఎం.లక్ష్మణ్ ఒక్కలిగ సముదాయానికి ప్రతినిధులుగా రంగంలో ఉన్నారు.
పొత్తు మతలబు..
గత రెండు లోక్సభ ఎన్నికల నుంచి భాజపా ఉత్తర ప్రాంతం కంటే దక్షిణంపైనే దృష్టి సారిస్తోంది. బెంగళూరు పరిధిలోని 4 నియోజకవర్గాల్లో కనీసం 3 స్థానాలను సులువుగా గెలుచుకోగలిగిన భాజపా మండ్య, కోలారు, హాసన, బెంగళూరు గ్రామీణ, తుమకూరు, చిక్కబళ్లాపురలో శ్రమించాల్సి వచ్చేది. అందుకోసమే పార్టీలో ఒక్కలిగ నాయకులకు ప్రాధాన్యమిస్తోంది. 2023 ఎన్నికల సమయంలో ఒక్కలిగ ఆరాధ్య యోధుడుగా భావించే కెంపేగౌడ విగ్రహ స్థాపన, ఓబీసీలోని ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్లు తొలగించి ఆ సదుపాయాన్ని ఒక్కలిగలకు ఇవ్వడం.. తదితర ప్రయత్నాలు చేసింది. ఆ ఎన్నికల్లో భాజపా నుంచి గెలిచిన ఒక్కలిగ అభ్యర్థులు 8 మందే. కాంగ్రెస్ అన్ని వర్గాలనూ ఆకట్టుకుని ఘన విజయం సాధించడంతో లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించకుండా ఉండేందుకు జేడీఎస్తో పొత్తుకు సిద్ధమైంది. అంతకు ముందే ఈ వర్గానికి చెందిన ఆర్.అశోక్ను విపక్ష నేతగా నియమించిన భాజపా.. ఒక్కలిగలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఆధిపత్య పోరు
రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కలిగలకు ఆధిపత్యం వహిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది.. జనతాదళ్ మాత్రమే. పాత మైసూరులోని కనీసం 4 జిల్లాలో ఆ పార్టీకి ఒక్కలిగలు వెన్నుదన్నుగా ఉన్నారు. 2023 విధానసభ ఎన్నికల్లో వీరి ఆధిపత్యానికి కాంగ్రెస్ గండికొట్టింది. ఒక్కలిగ ప్రభావం అధికంగా ఉండే 4 జిల్లాల్లో జేడీఎస్ హాసన మినహా మరే చోటా ప్రభావం చూపలేకపోయింది. ఒక్కలిగ జిల్లాగా పేరున్న మండ్యలోనూ 8 అసెంబ్లీ స్థానాల్లో ఆరింట కాంగ్రెస్ నెగ్గింది. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాల్లోనూ భాజపా జాతీయ సమీకరణాల కారణంగా అత్యధిక స్థానాలు గెలుచుకోగలిగినా వాటిల్లో ఒక్కలిగలకు ఇచ్చే ప్రాధాన్యం అంతంత మాత్రమే. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ భాజపా 25 స్థానాల్లో గెలిచినా అందులో ఒక్కలిగలు కేవలం నలుగురే.
నాయకుల సమరం
కాంగ్రెస్కు అతి పెద్ద ఓటు బ్యాంకు అహిందలే (అట్టడుగు, హిందళిత, దళితులే). ఆ వర్గానికి సిద్ధరామయ్య ఎలాగూ పెద్ద దిక్కుగా ఉన్నారు. డీకే శివకుమార్ రూపంలో పీసీసీ సారధి అయిన ఒక్కలిగ నాయకుడు కాంగ్రెస్కూ దొరికినట్లైంది. ఆయన సారధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 135 నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో ఈ పార్టీలో ఒక్కలిగ పెద్దలు ప్రధాన భూమిక కోసం సమరాన్ని మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి కుర్చీ జారవిడుచుకున్న డీకే శివకుమార్.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం 15 స్థానాలైనా దక్కేలా చేస్తే మరింత బలపడతారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్కు ఈ స్థాయి విజయాన్ని అందకుండా చేసేందుకు ఇదే వర్గానికి చెందిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి చెమటోడుస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు