నాలుగు చోట్ల కాలుమోపని కమలం
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో భాజపా నాలుగు ప్రాంతాల్లో అసలు పోటీ చేయడంలేదు. అందులో లక్షద్వీప్, మేఘాలయ, నాగాలాండ్, కశ్మీర్ ఉన్నాయి. అక్కడి 7 సీట్లు మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్నిచోట్లయినా భాజపా బరిలోకి దిగుతోంది.
కశ్మీర్లో పోటీకి దూరం
మిత్రపక్షాలకు మేఘాలయ, నాగాలాండ్, లక్షద్వీప్ల కేటాయింపు
'
ఈనాడు, దిల్లీ: ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో భాజపా నాలుగు ప్రాంతాల్లో అసలు పోటీ చేయడంలేదు. అందులో లక్షద్వీప్, మేఘాలయ, నాగాలాండ్, కశ్మీర్ ఉన్నాయి. అక్కడి 7 సీట్లు మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్నిచోట్లయినా భాజపా బరిలోకి దిగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 443 స్థానాల్లో ఆ పార్టీ పోటీపడుతోంది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, ఝార్ఖండ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపుర్, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్లలో ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి సీట్లు సర్దుబాటు చేసుకొని బరిలోకి దిగింది. మిగతాచోట్ల ఒంటరిగానే పోటీపడుతోంది. 1996లో 471 లోక్సభ స్థానాల్లో భాజపా పోటీచేసింది. ఆ తర్వాత ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం.
వ్యూహాత్మక నిర్ణయం
370 అధికరణాన్ని రద్దు చేశాక కశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్న తొలి ఎన్నికలకు భాజపా దూరంగా ఉంది. అక్కడున్న మూడు సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపలేదు. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోలేదు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ‘370’ రద్దు పట్ల కశ్మీర్ లోయలోని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. తాము ఇక్కడ దేశభక్త పార్టీలకు మద్దతిస్తామని జమ్మూకశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా ప్రకటించారు. జమ్మూలోని రెండు స్థానాల నుంచి మాత్రం భాజపా పోటీలో ఉంది. అనంత్నాగ్-రాజౌరీ, శ్రీనగర్, బారాముల్లా స్థానాల నుంచి కాంగ్రెస్ కూడా పోటీచేయడం లేదు. పొత్తులో భాగంగా వాటిని నేషనల్ కాన్ఫరెన్స్కు కేటాయించింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ అక్కడ ఒంటరిగా పోటీచేస్తోంది.
మేఘాలయలోని రెండు సీట్లను ఎన్డీయే మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీకి, నాగాలాండ్లోని ఒక్క సీటును నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి, లక్షద్వీప్లోని ఒక సీటును అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి భాజపా కేటాయించింది. ఇవి మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఎక్కడోచోట కమలం పార్టీ రంగంలోకి దిగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో 443 స్థానాల్లో పోటీచేస్తున్న భాజపా ఇప్పటివరకు 435 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఇందులో ఉత్తర్ప్రదేశ్లోని రాయబరేలి, కైసర్గంజ్ స్థానాలున్నాయి. రాయబరేలి నుంచి కాంగ్రెస్ ప్రకటించే అభ్యర్థిని చూశాక బలమైన ప్రత్యర్థిని దించాలని భాజపా భావిస్తోంది. కైసర్గంజ్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వివాదాస్పద నేత, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ను కొనసాగించాలా? మరో అభ్యర్థిని రంగంలోకి దించాలా? అని ఆ పార్టీ యోచిస్తోంది. ఇతనిపై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ