హోరాహోరీ స్థానాల్లో ఉద్ధృత ప్రచారంతో ఢీ
తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. ఉత్తర తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు నియోజకవర్గాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించి పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు తెలిసింది.
ఆరు లోక్సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి
అగ్రనేతల పర్యటనలూ ఎక్కువగా అక్కడే
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. ఉత్తర తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు నియోజకవర్గాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించి పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు తెలిసింది. దీనికి తగ్గట్లుగా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ లోక్సభ స్థానాల పరిధిలో ప్రచారం ఉద్ధృతం చేయడంతో పాటు పార్టీ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకల ప్రచార సభలను కూడా ఎక్కువగా ఈ స్థానాల్లోనే ఏర్పాటు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, వ్యూహకర్త సునీల్ కనుగోలు, మంత్రులు, లోక్సభ స్థానాల ఇన్ఛార్జులు పాల్గొని నియోజకవర్గాల వారీగా సమీక్షించినట్లు తెలిసింది. తాజా సర్వే అంశాలు, ఇన్ఛార్జుల నివేదికల ఆధారంగా చర్చించినట్లు సమాచారం. ప్రచారం, నాయకుల మధ్య సమన్వయం, ఏయే వర్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది, వనరులు.. ఇలా అన్ని అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. 9 లోక్సభ స్థానాల్లో పార్టీకి ఆధిక్యం ఉందని వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదించినట్లు సమాచారం. మరో 6 చోట్ల గట్టిపోటీ ఉందని, నువ్వా నేనా అన్న పరిస్థితికి వచ్చామని, ఈ స్థానాల్లో బాగా పని చేయాలని నిర్ణయించుకొని ఆ మేరకు కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిసింది. హైదరాబాద్, మరో లోక్సభ స్థానంలో బాగా వెనకబడి ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ‘ఈ రెండూ మినహాయిస్తే... మిగిలిన వాటిలో ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలి. స్థానిక నాయకులు మరింత ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలి. కొన్ని వర్గాల వద్దకు ఇంకా ఎక్కువగా వెళ్లాలి’ అని నిర్ణయించినట్లు తెలిసింది.
భారాస ముఖ్య నేతలను చేర్చుకుంటూ...
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం పరిధిలో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. భారాస, భాజపాల కంటే రెండు లక్షల ఓట్లు తక్కువగా వచ్చాయి. ఉద్యమ నేపథ్యం గల ఆత్రం సుగుణను ఇక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం, అసెంబ్లీ సెగ్మెంట్లలోని భారాస ముఖ్య నాయకులను చేర్చుకోవడం, ప్రచార ఉద్ధృతి పెంచడం వల్ల కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఎదిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే రెండుసార్లు బహిరంగసభల్లో ప్రసంగించారు. ఆదివారం నిర్మల్లో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ సభ జరిగింది. రేవంత్ కూడా పాల్గొన్నారు. ఈ సభకు ముందే నిర్మల్కు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఎలాగైనా ఆదిలాబాద్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో పార్టీ పని చేస్తోంది. మంత్రి సీతక్క ఇన్ఛార్జిగా అక్కడే మకాం వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కక అసంతృప్తికి గురై బరిలోకి దిగి సస్పెండ్ అయిన వారిని తిరిగి చేర్చుకొన్నా, కొందరు నాయకుల అభ్యంతరంతో తిరిగి పెండింగ్లో పెట్టడం లాంటివి ప్రభావం చూపుతాయని, ఇలాంటి సమస్యలను కూడా పరిష్కరించాలని కొందరు నాయకులు అధిష్ఠానం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకూ అధిక ప్రాధాన్యం
జహీరాబాద్, నిజామాబాద్లపైన కూడా కాంగ్రెస్ మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. ఈ నెల 10న ఎల్లారెడ్డిలో జరిగే సభలో ప్రియాంక పాల్గొనే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్లోని మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాలతోపాటు మహబూబ్నగర్పై కూడా పార్టీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే ఐదుసార్లు మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ శనివారం కూడా కొత్తకోట రోడ్షోలో పాల్గొన్నారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే రాహుల్ సభ నిర్వహించారు. 9న కరీంనగర్తోపాటు సరూర్నగర్లో జరిగే రోడ్షోకు కూడా హాజరవుతారు. సరూర్నగర్ మల్కాజిగిరి పరిధిలో ఉంది. ఈ నెల 10న ప్రియాంకాగాంధీ జహీరాబాద్ పరిధిలోని ఎల్లారెడ్డి; చేవెళ్ల పరిధిలోని తాండూరు; మహబూబ్నగర్ పరిధిలోని షాద్నగర్ సభల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా కాంగ్రెస్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా పెట్టినట్లు తెలిసింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి సభలు కూడా ఈ ఆరేడు ఎంపీ స్థానాల్లోనే ఎక్కువగా ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు భాజపా అగ్రనాయకత్వం కూడా ఈ నియోజకవర్గాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్