సుదీర్ఘకాలం ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా..
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పలు పార్టీలకు చెందిన నాయకులు సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగారు.
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పలు పార్టీలకు చెందిన నాయకులు సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగారు. వీరిలో కొన్ని కుటుంబాలకు చెందిన వారు జిల్లా రాజకీయాలతో పాటు ఇతర జిల్లాల్లో సైతం పోటీ చేసి గెలుపొందటం విశేషం. ఇలా విజయాలు సాధించిన నాయకులపై ప్రత్యేక కథనం.
- ఖమ్మం గాంధీచౌక్, ఖమ్మం నగరం, న్యూస్టుడే
పువ్వాడ నాగేశ్వరరావు.. అజయ్కుమార్
సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు 1989, 1994 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఓ పర్యాయం ఎమ్మెల్సీగా చేశారు. ఆయన కుమారుడు పువ్వాడ అజయ్కుమార్ ఇదే నియోజకవర్గం నుంచి 2014 కాంగ్రెస్, 2018లో తెరాస(ప్రస్తుత భారాస)నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం భారాస అభ్యర్థిగా మూడోసారి బరిలో నిలిచి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
‘మల్లు’ సోదర త్రయం..
- ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) మాజీ అధ్యక్షుడు దివంగత మల్లు అనంతరాములు మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుంచి 1980, 1989 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.
- అనంతరాములు సోదరుడు మల్లు రవి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో 2008లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇదే జిల్లాలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి 1991, 1998 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.
- అనంతరాములు మరో సోదరుడు మల్లు భట్టివిక్రమార్క 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన ఉప సభాపతిగా పని చేశారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న ఆయన నాలుగోసారి పోటీ చేస్తున్నారు.
‘జలగం’ కుటుంబం నుంచి నలుగురు
- మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి దివంగత జలగం వెంగళరావు... కుటుంబం నుంచి మొత్తం నలుగురు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో విజయాలు సాధించారు.
- జలగం వెంగళరావు 1962, 1967, 1972లో వేంసూరు, 1978లో సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 1984, 1989 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు.
- వెంగళరావు సోదరుడు జలగం కొండలరావు 1957లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977, 1980 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలిచారు.
- వెంగళరావు కుమారుడు జలగం ప్రసాదరావు 1983, 1989 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పని చేశారు.
- వెంగళరావు మరో కుమారుడు జలగం వెంకట్రావు కాంగ్రెస్ నుంచి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి, ఆ తర్వాత 2014లో కొత్తగూడెం నుంచి తెరాస నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
‘రాంరెడ్డి’ సోదరుల ‘పాంచ్’పటాక
- సుజాతనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి 1996 ఉప ఎన్నికతో పాటు ఆ తర్వాత జరిగిన 1999, 2004, పాలేరు నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు విజయాలు సాధించారు. పాలేరు నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. సహకార, ఉద్యానశాఖ మంత్రిగా కూడా కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. మొత్తం అయిదు పర్యాయాలు శాసన సభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
- రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి 1985, 1989, 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా తుంగతుర్తి, 2009లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పని చేశారు. 1994లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు చెరో ఐదు పర్యాయాలు గెలుపొందటం అరుదైన విషయం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర భారతంలో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని ఉక్కుమనిషి
ఉక్కు మనిషి అన్న పదం వినగానే ఆబాలగోపాలానికి గుర్తుకొచ్చే పేరు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో కేంద్ర హోం, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. -
ఆస్ట్రేలియాలో పండగలా పోలింగ్
ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. అక్కడి ప్రజలు ఓటు వేయడాన్ని శ్రమగా భావించరు. సంతోషంగా ఓటేస్తూ.. పోలింగ్ను పండగలా నిర్వహించుకుంటారు. -
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలవుతోంది. తొలిసారిగా 1912లో ఇక్కడ పురుషులకు ఓటింగ్ను తప్పనిసరి చేశారు. -
టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఆన్లైన్లో ఓటర్ స్లిప్... డౌన్లోడ్ చేసుకోండిలా!
Voter Slip Download Options: ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ కచ్చితంగా అవసరం. మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమౌతుందిలే అనుకునేవారు చరిత్ర గతిని మార్చిన ‘ఒక్క ఓటు’ ఉదంతాలు తెలుసుకోవాల్సిందే. -
ఎంపీగా ఎన్నికైతేే జీతం ఎంతో తెలుసా?
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
వారి ఓటును వారికి వేసుకోలేరు!
అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరికి ఇదే పునరావృతం కానుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉంది. దీంతో తమ పార్టీకి, కొన్నిచోట్ల ఇతర పార్టీలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఓటు.. సుదీర్ఘ ప్రయాణం
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. -
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా?
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి