Hyderabad: ఆ చీటీలే కరెన్సీ.. చెల్లింపులకు నయా మార్గం
నగరంలో ప్రచారపర్వం ఉద్ధృతంగా సాగుతోంది. ర్యాలీలు, సభలకు భారీఎత్తున జనసమీకరణ జరుగుతోంది. ఎన్నికల అధికారులకు చిక్కకుండా.. పోలీసులకు పట్టుబడకుండా వీరికి చెల్లింపులు చేస్తున్నారు నాయకులు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాజధానిలో రోజూ కనీసం 100 ప్రాంతాల్లో వాహనతనిఖీలు చేపడుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: నగరంలో ప్రచారపర్వం ఉద్ధృతంగా సాగుతోంది. ర్యాలీలు, సభలకు భారీఎత్తున జనసమీకరణ జరుగుతోంది. ఎన్నికల అధికారులకు చిక్కకుండా.. పోలీసులకు పట్టుబడకుండా వీరికి చెల్లింపులు చేస్తున్నారు నాయకులు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాజధానిలో రోజూ కనీసం 100 ప్రాంతాల్లో వాహనతనిఖీలు చేపడుతున్నారు. భారీఎత్తున నగదు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటువంటి క్లిష్ల పరిస్థితుల్లో నేతలు కొత్తదారులు వెతికారు. నగదు చెల్లింపులు.. మద్యం.. బిర్యానీ కోసం చీటీలు అందజేస్తున్నారు.
స్థానిక ఓటర్లకే అవకాశం.. నగరంలో బడా నేతలు హాజరయ్యే బహిరంగసభలు, ర్యాలీల్లో బలప్రదర్శనకు అడ్డాకూలీలను తీసుకొస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రచారం, సమావేశాలకు స్థానిక ఓటర్లకే ప్రాధాన్యతనిస్తున్నారు. వీళ్లను ప్రచారంలో వినియోగించటం వల్ల ఆ ఓట్లన్నీ తమ పార్టీకే పోలవుతాయని నాయకులు అంచనా వేసుకుంటున్నారు. పార్టీ గుర్తు కూడా వారి బుర్రల్లో నిలిచిపోతుందని భావిస్తున్నారు. ఈ ప్రణాళిక పోలింగ్ తేదీ నాడు తమకు మేలు చేస్తుందంటున్నారు. డివిజన్ వారీగా ప్రచారానికి వచ్చే మహిళలు, పురుషులు, యువతీ, యువకులకు వేర్వేరుగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. అక్కడ జరిగే పార్టీ కార్యకలాపాలు, గల్లీనేతల కదలికలను ఎప్పటికప్పుడు గ్రూప్లో పోస్టు చేస్తూ సమాచారం రాబడుతున్నారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల వెంట ఎవరెవరు ఉండాలనేది ముందుగానే నిర్ణయిస్తున్నారు. ప్రచారం పూర్తవగానే వచ్చిన వారి చేతికి నగదు వివరాలున్న చీటీలు చేతికిస్తున్నారు. వీటిని ఆయా పార్టీలు/అభ్యర్థులకు అనుకూలమైన మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్స్, పచారీ దుకాణాలు, హోటళ్ల వద్ద చూపితే వెంటనే నగదు ఇస్తున్నారు. ఈ స్లిప్పుల ఆధారంగా నిర్వాహకులు నగదు వివరాలు నమోదు చేసుకుంటారు. పోలింగ్ ముగిశాక సంబంధిత పార్టీల నాయకుల నుంచి తీసుకుంటారు. దీనికి ప్రతిఫలంగా చిరువ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులకు 2-3శాతం కమీషన్ కూడా ఇస్తున్నట్టు సమాచారం. గుట్టుగా జరిగే ఈ వ్యవహారంతో తమ పని తేలిక అవుతుందని, ఫ్లయింగ్స్క్వాడ్స్కు దొరుతామనే భయం లేదంటూ ఖైరాతాబాద్కు చెందిన ఒక నాయకుడు వివరించారు. ఉదయం, సాయంత్రం 2-3 గంటలు సమయం కేటాయిస్తే రూ.300 వరకూ ఇస్తున్నారని ఆనంద్నగర్కాలనీకు చెందిన ఒక మహిళ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర భారతంలో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని ఉక్కుమనిషి
ఉక్కు మనిషి అన్న పదం వినగానే ఆబాలగోపాలానికి గుర్తుకొచ్చే పేరు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో కేంద్ర హోం, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. -
ఆస్ట్రేలియాలో పండగలా పోలింగ్
ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. అక్కడి ప్రజలు ఓటు వేయడాన్ని శ్రమగా భావించరు. సంతోషంగా ఓటేస్తూ.. పోలింగ్ను పండగలా నిర్వహించుకుంటారు. -
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలవుతోంది. తొలిసారిగా 1912లో ఇక్కడ పురుషులకు ఓటింగ్ను తప్పనిసరి చేశారు. -
టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఆన్లైన్లో ఓటర్ స్లిప్... డౌన్లోడ్ చేసుకోండిలా!
Voter Slip Download Options: ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ కచ్చితంగా అవసరం. మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమౌతుందిలే అనుకునేవారు చరిత్ర గతిని మార్చిన ‘ఒక్క ఓటు’ ఉదంతాలు తెలుసుకోవాల్సిందే. -
ఎంపీగా ఎన్నికైతేే జీతం ఎంతో తెలుసా?
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
వారి ఓటును వారికి వేసుకోలేరు!
అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరికి ఇదే పునరావృతం కానుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉంది. దీంతో తమ పార్టీకి, కొన్నిచోట్ల ఇతర పార్టీలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఓటు.. సుదీర్ఘ ప్రయాణం
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. -
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా?
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు